Nani Opens up on Nepotism: నెపోటిజంపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. రామ్ చరణ్‌తో పోల్చుకున్న హీరో-nani opens up on nepotism and compares himself with ram charan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani Opens Up On Nepotism And Compares Himself With Ram Charan

Nani Opens up on Nepotism: నెపోటిజంపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. రామ్ చరణ్‌తో పోల్చుకున్న హీరో

Maragani Govardhan HT Telugu
Feb 24, 2023 02:27 PM IST

Nani Opens up on Nepotism: నేచురల్ స్టార్ నాని ఇటీవల ప్రముఖ సింగర్ స్మిత నిర్వహిస్తున్న నిజం విత్ స్మిత షో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెపోటిజంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాని- రామ్ చరణ్
నాని- రామ్ చరణ్

Nani Opens up on Nepotism: టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన హీరో నాని. నేచురల్ స్టార్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాని కెరీర్‌లో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన దసరా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా వచ్చే నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా నాని, రానాతో కలిసి ప్రముఖ సింగర్ స్మిత నిర్వహిస్తున్న నిజం విత్ స్మిత అనే షోలో పాల్గొన్నారు. తాజాగా ఈ ప్రోమో విడుదలవుగా.. అందులో నాని నెపొటిజంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో బయట నుంచి వచ్చినవారికి, ఇన్‌సైడర్లకు మధ్య గల తేడాను వివరించిన నాని.. రామ్ చరణ్‌తో పోల్చుకున్నారు. నాని మొదటి సినిమాను ఓ లక్ష మంది చూసుంటారు. ఇదే సమయంలో రామ్ చరణ్ మొదటి సినిమాను కోటి మంది చూశారు. కాబట్టి ఇక్కడ ఆడియెన్స్‌దే బాధ్యత. ప్రేక్షకులు తమ అభిమాన హీరోల కుమారులను, కుమార్తేలను వెండితెరపై చూడాలనుకుంటున్నారు. అని నాని స్పష్టం చేశారు.

మరోపక్క ఇదే ప్రోమోలో రానా కూడా ఈ అంశంపై మాట్లాడారు. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వంగా భావిస్తున్నానని, ఒకవేళ తల్లిదండ్రుల విజయాలను, వారసత్వాన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్లకపోతే అది వారి కుటుంబానికి చేసే పెద్ద తప్పు అవుతుందని రానా పేర్కొన్నారు. అంతటితో ప్రోమో ముగుస్తుంది. ఫుల్ ఎపిసోడ్ కోసం సోనీ లివ్‌లో ప్రసారం కానున్న నిజం విత్ స్మిత షోలో చూడవచ్చు.

సినిమాల విషయానికొస్తే నాని.. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం చేస్తూ దసరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, పాటలు విడుదలై సినిమాపై భారీ అంచనాలను పెంచింది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా చేసింది. వీరు కాకుండా సాయికుమార్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్