RC15 On Location Photos Viral: ఆర్‌సీ 15 షూటింగ్ ఫొటోస్ షేర్ చేసిన కియారా - పిక్స్ వైర‌ల్‌-kiara advani shares rc15 shooting pics ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kiara Advani Shares Rc15 Shooting Pics

RC15 On Location Photos Viral: ఆర్‌సీ 15 షూటింగ్ ఫొటోస్ షేర్ చేసిన కియారా - పిక్స్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 25, 2022 01:02 PM IST

RC15 On Location Photos Viral: రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న పాన్ ఇండియ‌న్ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో చ‌ర‌ణ్‌తో క‌లిసి బ‌ర్గ‌ర్ తింటోన్న ఫొటోల‌ను కియారా అద్వాణీ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వాణీ
రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వాణీ

RC15 On Location Photos Viral: ఆర్‌సీ 15 షూటింగ్‌తో బిజీగా ఉన్నారు రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జ‌రుగుతోంది. నాయ‌కానాయిక‌ల‌పై ఓ రొమాంటిక్ డ్యూయెట్‌ను తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్‌.

బుధ‌వారం నుంచి డ్యూన్‌డీన్‌సిటీ బీచ్‌తో పాటు స‌ముద్ర తీర ప్రాంతాల్లోని బ్యూటీఫుల్ లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. షూటింగ్ గ్యాప్‌లో టీమ్ మెంబ‌ర్స్‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతోన్న ఫొటోల‌ను కియారా అద్వాణీ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. మొద‌టి ఫొటోలో చ‌ర‌ణ్‌తో క‌లిసి బ‌ర్గ‌ర్ లాగిస్తూ కియారా క‌నిపిస్తోంది. మ‌రో ఫొటోలో టీమ్ అంద‌రూ క‌నిపించారు.

ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌, కియారాతో పాటు డ్యాన్స్ మాస్ట‌ర్ బాస్కో మార్టీస్‌, అలీమ్ హ‌కీమ్ త‌దిత‌రులు ఉన్నారు. కియారా షేర్ చేసిన ఈ ఫొటోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోల‌ను ఉద్దేశిస్తూ బ‌ర్గ‌ర్స్ విత్ దేస్ బ‌గ్గ‌ర్స్ అంటూ ట్వీట్ చేసింది. అయితే బ‌గ్గ‌ర్స్ అనే ప‌దాన్ని కొన్ని చోట్ల బూతుగా ప‌రిగ‌ణిస్తారు. మోస‌గాళ్ల‌ను ఉద్దేశిస్తూ ఈ ప‌దాన్ని ఉప‌యోగిస్తుంటారు.

మ‌రికొంద‌రు ఫ‌న్నీగా ఎదుటివారికి పిల‌వ‌డం కోసం ఈ ప‌దాన్ని వాడుతుంటారు. కియారా స‌ర‌దాగానే ఈ బ‌గ్గ‌ర్స్ అనే ప‌దాన్ని ఉప‌యోగించింది. కానీ ఈ పిలుపుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దాంతో త‌న పోస్ట్ నుంచి ఆ ప‌దాల‌ను తొల‌గించింది. సాంగ్ షూట్ కోసం డైట్‌లో ఉన్నామంటూ పేర్కొన్న‌ది.

కియారా పోస్ట్ చేసిన ఫొటోల‌ను ఉద్దేశించి రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న స్పందించింది. అంద‌రిని మిస్ అవుతోన్న‌ట్లుగా పేర్కొన్న‌ది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా శంక‌ర్ ఈసినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.

పాన్ ఇండియ‌న్ స్థాయిలో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. న‌వీన్‌చంద్ర‌, సునీల్‌, అంజ‌లి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

IPL_Entry_Point