Guppedantha Manasu May 17th Episode: రిషి, వసులను ఏకం చేసిన అమ్మవారు - జగతికి మహేంద్ర దూరం
Guppedantha Manasu May 17th Episode: ఎంగేజ్మెంట్ భయభయంగా జరగడంతో వసుధార కంగారు పడుతుంది. తమ బంధాన్ని నిలబెట్టమని అమ్మవారిని కోరుకుంటుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu May 17th Episode: శైలేంద్ర కుట్రను బయటపెట్టబోయి ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు జగతి దోషిగా మారుతుంది. జగతి తరఫున దేవయాని, శైలేంద్రలకు వసుధార క్షమాపణలు చెబుతుంది. మహేంద్ర కూడా ఫణీంద్ర ఫ్యామిలీని క్షమాపణలు కోరుతాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత జగతి దగ్గరకు శైలేంద్ర, దేవయాని వస్తారు. అసలు ఈ రోజు మా ప్లాన్ రిషి చంపడం కాదు...రిషి మనసులో ఉన్న నీ స్థానాన్ని చంపడం అని చెబుతారు. వారి మాటలు విని జగతి షాక్ అవుతుంది. తమ కన్నింగ్ ప్లాన్ను ఎలా అమలు చేసింది చెబుతారు. .
వసుధారకు కష్టాలు రాకుండా...
వసుధారతో కలిసి దైవదర్శనానికి వెళతాడు రిషి. సంతోషంగా జరుపుకోవాల్సిన నిశ్చితార్థం భయభయంగా జరిగింది. నువ్వే మా బంధాన్ని నిలబెట్టాలని అమ్మవారిని వేడుకుంటుంది వసుధార. జగతి ఎలాంటి బాధలకు గురికాకుండా చూడమని కోరుకుంటుంది.
మరోవైపు వసుధారకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకునే శక్తిసామర్థ్యాలు తనకు ఇవ్వమని, వసుధార ఎప్పుడూ సంతోషంగా ఉండాలని రిషి అమ్మవారిని కోరుకుంటాడు. దేవుడిని ఏం కోరుకున్నావని వసుధారను అడుగుతాడు రిషి. అతడి మాటలకు తనకు ప్రత్యేకంగా కోరికలు ఏం లేవని, మీరు బాగుండాలని కోరుకున్నట్లు రిషితో చెబుతుంది వసుధార. మీరు బాగుంటే నేను బాగుంటాను. మీ వల్ల ఇంకో పది మంది బాగుంటారు అని అంటుంది.
ఒకే పూలమాలలో రిషి, వసు...
కానీ ఈ మధ్య మీ చుట్టూ ఏవేవో జరుగుతోన్నాయి. ఊహించని సంఘటనలు, ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమోషనల్ అవుతుంది. ఆమె మాటలకు ఇంకా నీ మనసులో భయం, ఆందోళన పోలేదు అనుకుంటా. చిన్న చిన్న వాటికి నువ్వు, జగతి ఎక్కువగా టెన్షన్ పడుతున్నారని రిషి ఆమెను ఓదార్చుతాడు.
ఇవి సంతోషంగా ఉండే క్షణాలని అంటాడు. అతడి మాటలకు సరే అని వసుధార అంటుంది. ఇద్దరు కలిసి దేవుడికి పూలదండ వేయబోతారు. కానీ గాలికి ఆ పూలమాల వారిద్దరి మెడలోనే పడుతుంది. చూశావా ఆ అమ్మవారు మన ఇద్దరినీ ఒకే దండలో చేర్చింది. ఎప్పటికీ విడిపోము అనడానికి ఇది సంకేతమని రిషి అనడంతో వసుధార సంతోషపడుతుంది.
ధరణికి శైలేంద్ర వార్నింగ్...
జ్యూస్లో విషం కలిపిన విషయాన్ని జగతికి చెప్పినందుకు ధరణిపై శైలేంద్ర, దేవయాని విరుచుకుపడతారు. ముందు ముందు తోకజాడిస్తే నేను సహించను నా రియాక్షన్ సీరియస్గా ఉంటుంది. జాగ్రత్తగా నడుచుకో అంటూ ధరణికి శైలేంద్ర వార్నింగ్ ఇస్తాడు.
జగతికి మహేంద్ర దూరం...
జగతి కన్నీళ్లకు కారణమేమిటని మహేంద్ర ఆమెను అడుగుతాడు. నిన్ను ఇలా బాధలో చూడలేకపోతున్నానని అంటాడు. అతడి మాటలతో మహేంద్ర గుండెలపై వాలి ఏడుస్తుంది జగతి. శైలేంద్ర దగ్గరుండి రిషి, వసుధార ఎంగేజ్మెంట్ చేశాడని, త్వరలోనే అతడే వాళ్ల పెళ్లి చేస్తాడని జగతితో అంటాడు మహేంద్ర. శైలేంద్రను అనుమానించాల్సిన అవసరం లేదని ఆమెతో చెబుతాడు.
తనవన్నీ భ్రమలు అని మహేంద్ర కూడా తేల్చేయడంతో జగతిలోని బాధ మరింత ఎక్కవవుతుంది. మెడికల్ కాలేజీ పనుల మీద తాను ఢిల్లీ వెళుతున్నట్లు మహేంద్ర చెబుతాడు. కష్టసమయంలో తనను మహేంద్ర కూడా వదిలిపెట్టి వెళ్లిపోతున్నాడని తెలిసి జగతిలోని భయం, ఆవేదన పెరుగుతాయి.
చక్రపాణిలో భయం...
జగతి ముభావంగా కనిపించడం వెనుక ఏదో కారణంగా ఉందని వసుధార తల్లిదండ్రులు చక్రపాణి, సుమిత్ర ఆందోళనపడతారు. కష్టసమయంలో కూతురు వెంట ఉండలేకపోయినందుకు బాధపడతారు. మరోవైపు రిషి, వసుధార గుడికి వెళ్లి చాలా సమయం దాటినా ఇంటికి రాకపోవడంతో జగతి టెన్షన్ పడుతుంది. తమ మాటలతో ఆమె భయాన్ని మరింత పెంచుతారు శైలేంద్ర, దేవయాని.
రిషి ఎక్కడున్నాడో తాను ఫోన్ చేసి అడుగుతానని శైలేంద్ర అంటాడు. అవసరం లేదని దేవయాని వారిస్తున్నా వినకుండా రిషికి ఫోన్ చేస్తాడు. తమకు దొరికిన ఏకాంతాన్ని ఆనందంగా ఆస్వాదిస్తుంటారు రిషి, వసుధార. శైలేంద్ర ఫోన్ చేసినా అతడు లిఫ్ట్ చేయడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది.