Veera Simha Reddy New Update: 'వీరసింహారెడ్డి'కి గుమ్మడికాయ కొట్టేశారు.. ఈ నెలాఖరు నుంచి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్-balakrishna veera simha reddy movie wraps up ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Veera Simha Reddy New Update: 'వీరసింహారెడ్డి'కి గుమ్మడికాయ కొట్టేశారు.. ఈ నెలాఖరు నుంచి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్

Veera Simha Reddy New Update: 'వీరసింహారెడ్డి'కి గుమ్మడికాయ కొట్టేశారు.. ఈ నెలాఖరు నుంచి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్

Maragani Govardhan HT Telugu
Dec 26, 2022 10:33 AM IST

Veera Simha Reddy New Update: నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనలు జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

వీరసింహారెడ్డిలో బాలకృష్ణ
వీరసింహారెడ్డిలో బాలకృష్ణ

Veera Simha Reddy New Update: నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే మరోపక్క అన్‌స్టాపబుల్ షోలో వ్యాఖ్యతగానూ వ్యవహరిస్తూ తీరిక లేకుండా ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పాటలు విడుదలై శ్రోతలను అలరిస్తున్నాయి. ఇప్పటికే టీజర్ కూడా విడుదలై ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య వీరసింహారెడ్డి షూటింగ్ పూర్తయింది. ఆదివారంతో ఈ సినిమాకు చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేసింది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం చిత్రబృందం నుంచి రానుంది. ఇటీవలే శృతిహాసన్‌-బాలకృష్ణపై ఓ సాంగ్ పూర్తి చేశారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రభినయం చేస్తున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా డిసెంబరు 29 నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పండుగకు నాలుగు రోజుల ముందే థియేటర్లలో బాలయ్య సందడి మొదలుకానుంది.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ఆలస్యంగా పూర్తికావడంతో అభిమానులు ఆందోళనలో పడ్డారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మూవీ టీమ్ కాంప్రమైజ్ కాకుండా.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని ఈ సినిమా తీస్తుండగా.. అఖండ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. తమన్ సంగీతాన్ని సమకురుస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

టాపిక్