Accident : గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులు విజయవాడకు చెందినవారిగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ రోడ్డుపై నిలిపి ఉంది. అదే సమయంలో వెనక నుంచి కారు వచ్చి బలంగా ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు ఘటన స్థలంలోనే చనిపోయారు. మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే మృతి చెందింది. మృతులు విజయవాడకు చెందినవారిగా గుర్తించారు. కారు గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్నట్టుగా తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.