cji nv ramana - cm jagan: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ సర్కార్ విందు
cji nv ramana ap tour: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ల గౌరవార్థం ఏపీ ప్రభుత్వం అధికారిక విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ దంపతులు హాజరయ్యారు.
ap cm jagan hosts lunch to cji: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కు ఏపీ ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది. సీజేఐ హోదాలో విజయవాడకు వచ్చిన సీజేఐకు సీఎం జగన్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ విందుకు గవర్నత్ పాటు... హైకోర్టు సీజే ప్రశాంత్కుమార్ మిశ్రా, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ దంపతులకు... సీఎం జగన్ దంపతులు స్వాగతం పలికారు.
సీజేఐ దంపతులు, గవర్నర్, సీఎం జగన్ దంపతులు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు ఒకే టేబుల్ పంచుకున్నారు. న్యాయమూర్తులు అందరినీ సీఎం పలకరించారు. మరోవైపు ఈ నెల 27న సీజేఐ పదవి నుంచి జస్టిస్ ఎన్వీ రమణ విరమణ పొందుతున్నారు.
విభజనతో నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన కోర్టు కాంప్లెక్స్ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. సిటి సివిల్ కోర్టు ఆవరణలో 3.70 ఎకరాల విస్తీర్ణంలో 92.60కోట్ల రుపాయల వ్యయంతో 8 అంతస్తులతో సిటి కోర్టు కాంప్లెక్స్ కోసం భారీ భవనాన్ని నిర్మించారు.
జ్యూడిషియల్ వ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చాలా ప్రాంతాల్లో కోర్టు కాంప్లెక్సుల నిర్మాణం జరగడం సాధారణమే అయినా విజయవాడ కోర్టు కాంప్లెక్స్ను ఎన్వీ రమణ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన కాంప్లెక్స్కు ఆయనే ప్రారంభం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.