Vande Bharat Express: తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్-vande bharat express between secunderabad and tirupati soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Vande Bharat Express Between Secunderabad And Tirupati Soon

Vande Bharat Express: తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్

HT Telugu Desk HT Telugu
Mar 25, 2023 07:24 AM IST

Vande Bharat Express: తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.

త్వరలో తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్
త్వరలో తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (HT_PRINT)

Vande Bharat Express: తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల రెండో వారంలోనే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విజయవంతంగా నడుస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఉన్న రద్దీ దృష్ట్యా ఈ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టనుంది. వారంలో 6 రోజులు ఈ ట్రైన్ నడిచేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రస్తుతం పద్మావతి, నారాయణాద్రి, వెంకట్రాది తదితర ఎక్స్‌ప్రెస్ సర్వీసులు తిరుపతికి భక్తులను చేరవేస్తున్నాయి. కానీ వీటిలో టికెట్ కోసం కనీసం ఒక నెల ముందు బుక్ చేసుకోవాల్సి వస్తోంది. లేదంటే వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో ప్రయాణికులకు ఈవిషయంలో సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.

కాగా ఏప్రిల్ 14న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య భారతానికి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించనున్నారు. గౌహతి, న్యూజల్‌పాయిగురి మధ్య ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది.

IPL_Entry_Point

టాపిక్