International Women's Day | వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు అవార్డులు.. జాబితా ఇదే..
పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. మెుత్తం 40 మందిని అవార్డులకు ఎంపిక చేశారు.
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు
విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. 40 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డీ దివ్య ఉత్తర్వులు జారీచేశారు. 2021, 2022 కలిపి రెండు సంవత్సరాలకు 40 మందిని ఎంపిక చేశారు. అవార్డుతోపాటుగా.. ప్రతి ఒక్కరికి రూ.లక్ష చొప్పున నగదు పురస్కారం అందజేయనున్నారు.
ప్రొఫెసర్ లక్ష్మీరెడ్డి, ఐపీఎస్ బడుగుల సుమతి, రమాదేవి లంకా, ఉషా ఆర్.రెడ్డి, ఏ.జ్యోతిగౌడ్, సౌమ్య గుగులోతు, గొట్టె కనకవ్వ, డాక్టర్ పద్మావతి, చింతల పోశవ్వతో పాటు మరికొంతమందికి అవార్డులు దక్కాయి. ఈ మేరకు జాబితాను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ను దివ్య ప్రకటించారు.