Hyderabad MMTS | ఎంఎంటీస్‌ ప్రయాణికులకు గుడ్ న్యూస్..-hyderabad mmts good news for passengers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Mmts | ఎంఎంటీస్‌ ప్రయాణికులకు గుడ్ న్యూస్..

Hyderabad MMTS | ఎంఎంటీస్‌ ప్రయాణికులకు గుడ్ న్యూస్..

HT Telugu Desk HT Telugu
Apr 14, 2022 03:38 PM IST

హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎంఎంటీస్‌ రైళ్ల పునరుద్ధరణపై కీలక ప్రకటన చేసింది.

ఎంఎంటీఎస్
ఎంఎంటీఎస్

జంట నగరాల ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఎంఎంటీస్‌ రైళ్ల పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో మరో 86 ఎంఎంటీస్‌ రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. రైళ్ల రాకపోకల సమయాల్లో పలు మార్పులు చేసినట్టు తెలిపింది. ఉదయం 4.30 నుంచి రాత్రి 12.30 రైళ్లు రాకపోకలు సాగించనున్నామని పేర్కొంది. అంతకుముందు.. ఉదయం 6 నుండి రాత్రి 11.45 వరకు రాకపోకలు ఉండేవి. సీజనల్ టికెట్స్‌ను సైతం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మళ్ళీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది.

IPL_Entry_Point