Ganja | 358 కిలోల గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ లో అంతరాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి గంజాయి, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ లో గంజాయి రవాణా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురిలో ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్వోటీ అధికారులు, హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులనుండి 87 లక్షల విలువ చేసే.. 358 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు, 1300 వందల నగదు, 3 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేశారు. పరారీలో ఇద్దరు నిందితులు అర్జున్, శివాజీ ఉన్నారు.
2019 నుంచి గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. జహీరాబాద్ కు చెందిన అర్జున్ తో కలిసి శివాజీ గంజాయి రవాణా చేస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని గంజాయి విక్రేతలతో సంబంధాలు ఉన్నాయి.
టాపిక్