Suryapet Road Accident : ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ… ఐదుగురు దుర్మరణం
five dead in road accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు దుర్మరం చెందారు.
Road accident in sutyapet district: శనివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ - లారీ ఢీకొన్న ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులోని కొందరి పరిస్థతి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
పడిపూజ కోసం వచ్చి....
మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సాగర్ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి మహాపడి పూజకు హాజరయ్యారు. వారిలో దాదాపు 30 మంది ట్రాక్టర్ ట్రాలీలో ఇళ్లకు తిరుగి బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెళ్తుండగా ఓ లారీ ఢొకొట్టింది.
ప్రమీల, లోకేశ్, కోటయ్య, జ్యోతి, తన్నీరు ప్రమీలను మృతులుగా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.