యాదగిరిగుట్టలో విషాదం.. భవనం కూలి నలుగురు మృతి-double storey building collapsed in yadagiri gutta ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Double Storey Building Collapsed In Yadagiri Gutta

యాదగిరిగుట్టలో విషాదం.. భవనం కూలి నలుగురు మృతి

HT Telugu Desk HT Telugu
Apr 29, 2022 07:31 PM IST

యాదగిరిగుట్టలో రెండు అంతస్తుల పాత భవనం కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

యాదగిరిగుట్టలో కూలిన పాత భవనం
యాదగిరిగుట్టలో కూలిన పాత భవనం

యాదగిరిగుట్టలో రెండు అంతస్తుల పాత భవనం కుప్ప కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.  గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

భవన శిథిలాల కింద మరో 6 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం. కూలిన భవనంలో ముందు భాగంలో రెండు దుకాణాలు నిర్వహిస్తుండగా, వెనుక భాగంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రమాద సమయంలో ఇళ్లలో, దుకాణాల్లో ఉన్న వారితో పాటు అక్కడికి వచ్చిన పలువురు గాయపడ్డారు. కూలిన రెండంతస్తుల భవనం 35ఏళ్ల క్రితం కట్టారని స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. దశరథ్ గౌడ్, ఉపేందర్, శ్రీనాథ్, శ్రీనులను మృతులుగా గుర్తించారు.

 

IPL_Entry_Point

టాపిక్