పెళ్లిలో విషాదం.. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలిన వధువు-bride died during wedding at madhurawada in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bride Died During Wedding At Madhurawada In Visakhapatnam

పెళ్లిలో విషాదం.. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలిన వధువు

HT Telugu Desk HT Telugu
May 12, 2022 01:49 PM IST

విశాఖలో జరిగిన ఓ వివాహంలో విషాదం చోటు చేసుకుంది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో పెళ్లికుమార్తె కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

పెళ్లిలో విషాదం
పెళ్లిలో విషాదం

విశాఖపట్నం మధురవాడలో ఓ పెళ్లిలో విషాదం జరిగింది. పెళ్లిపీటలపైనే వధువు స్పృహ కోల్పోయింది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వధువు కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది.

బుధవారం రాత్రి 7 గంటలకు శివాజీ, సృజనల వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో నిన్న భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. అనుకున్నట్లే పెళ్లి జరుగుతుండగా పెళ్లికుమార్తె కుప్పకూలింది. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే సృజన మృతికి గల కారణాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఇరువైపు బంధువులు పుట్టెడు దుఖంలో ఉన్నారు.

IPL_Entry_Point