Shraddha Murder Case: ఆఫ్తాబ్‍ను తీసుకెళుతున్న పోలీస్ వ్యాన్‌పై కత్తులతో దాడి-shraddha walkar murder case men with swords attack van carrying aaftab poonawala ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Shraddha Walkar Murder Case Men With Swords Attack Van Carrying Aaftab Poonawala

Shraddha Murder Case: ఆఫ్తాబ్‍ను తీసుకెళుతున్న పోలీస్ వ్యాన్‌పై కత్తులతో దాడి

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 28, 2022 08:18 PM IST

Shraddha Walkar Murder Case: ఆఫ్తాబ్‍ పునావాలాను తీసుకెళుతున్న పోలీసు వాహనంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. కత్తులతో అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. తన ప్రియురాలు శ్రద్ధను ఈ ఏడాది మేలో ఆఫ్తాబ్ కిరాతకంగా హత్య చేశాడు.

Shraddha Murder Case: ఆఫ్తాబ్‍ను తీసుకెళుతున్న పోలీస్ వ్యాన్‌పై కత్తులతో దాడి (Twitter/ANI)
Shraddha Murder Case: ఆఫ్తాబ్‍ను తీసుకెళుతున్న పోలీస్ వ్యాన్‌పై కత్తులతో దాడి (Twitter/ANI)

Shraddha Walkar Murder Case: శ్రద్ధా వాకర్‌ను అత్యంత పాశవికంగా చంపిన ఆఫ్తాబ్ పునావాలాను తరలిస్తున్న పోలీస్ వాహనంపై సోమవారం దాడి జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. పోలీస్ వ్యాన్‍ను కొందరు వ్యక్తులు అడ్డగించారు. కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. కాసేపు హల్‍చల్ చేశారు. తాము హిందూసేనకు చెందిన వారమంటూ వారు చెప్పుకున్నారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. ఈ దాడికి ప్రయత్నించిన వారిని పోలీసులు పట్టుకున్నారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి జైలుకు తీసుకెళుతుండగా..

Shraddha Walkar Murder Case: రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఆఫ్తాబ్ పునావాలాను పోలీసులు సోమవారం తీసుకొచ్చారు. పాలీగ్రాఫ్ టెస్ట్ కోసం అతడిని ఎఫ్ఎస్ఎల్‍కు పిలుచుకొని వచ్చారు. అక్కడి నుంచి మళ్లీ జైలుకు తరలిస్తుండగా.. ఆ కార్యాలయం ముందే పోలీసు వాహనంపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆ సమయంలో పునావాలాను ఐదుగురు పోలీసులు తీసుకెళుతున్నారు. దాడి చేసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆఫ్తాబ్ వాడిన ఆయుధాలు స్వాధీనం

Shraddha Walkar Murder Case: శ్రద్ధా వాకర్ శరీరాన్ని ముక్కలుగా నరికేందుకు ఆఫ్తాబ్ పునావాలా ఉపయోగించిన కొన్ని ఆయుధాలను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. గత వారం ఐదు కత్తులను కనుగొన్న పోలీసులు.. నేడు మరిన్ని ఆయుధాలను రికవర్ చేశారు.

శ్రద్ధ ఉంగరం.. మరో గర్ల్ ఫ్రెండ్‍కు..

Shraddha Walkar Murder Case: తాను హత్య చేసిన శ్రద్ధ వాకర్ ఉంగరాన్ని.. మరో గర్ల్ ఫ్రెండ్‍కు ఆఫ్తాబ్ బహుమతిగా ఇచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. శ్రద్ధను చంపిన కొద్ది రోజుల తర్వాత ఓ మహిళను తన ఫ్లాట్‍కు పునావాలా తీసుకొచ్చాడు. ఆమెను కూడా డేటింగ్ యాప్ ద్వారానే పరిచయం చేసుకున్నాడు ఆఫ్తాబ్.

Shraddha Walkar Murder: తన లివ్-ఇన్ పార్ట్‌నర్‌ శ్రద్ధా వాకర్ ను ఈ ఏడాది మే 18వ తేదీన ఆఫ్తాబ్ పునావాలా హతమార్చాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. వాటిని ఫ్రిజ్‍లో స్టోర్ చేసి.. కొన్ని రోజుల పాటు మెహ్రౌలీ అడవిలో పడేశాడు. శ్రద్ధ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆఫ్తాబ్ చేసిన దారుణం ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. నవంబర్ 12న ఆఫ్తాబ్‍ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆఫ్తాబ్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసులో వాస్తవాలు రోజురోజుకూ బయటపడుతున్నాయి.

IPL_Entry_Point

టాపిక్