Nikki Yadav Murder Case: కన్ఫ్యూజన్లో లవర్ను చంపేశాడట.. మర్డర్ ముందు పార్టీ కూడా..
Nikki Yadav Murder Case: ఢిల్లీలో జరిగిన నిక్కీ యాదవ్ హత్య గురించి మరిన్ని విషయాలు బయటికి వచ్చాయి. ఆమెను చంపిన లివ్ ఇన్ పార్ట్నర్ ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చిందో పోలీసుల విచారణలో చెప్పాడు.
Nikki Yadav Murder Case: నిక్కీ యాదవ్ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. సాహిల్ గహ్లోత్ (Sahil Gehlot) అనే యువకుడు తన లివ్ ఇన్ పార్ట్నర్ అయిన నిక్కీ యాదవ్(22)ను హతమార్చాడు. డేటా కేబుల్ను గొంతుకు బిగించి చంపేశాడు. ఆ తర్వాత తన దాబాలోని రిఫ్రిజిరేటర్లో శవాన్ని దాచాడు. కాగా, హత్య చేసిన గంటల వ్యవధిలోనే అతడు వేరే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఢిల్లీ (Delhi Murder Case)లో ఈ ఘటన జరిగింది. ఈనెల 9 - 10వ తేదీ మధ్య రాత్రి హత్య జరగగా.. 14వ తేదీన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సాహిల్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచారణలో సాహిల్ తాజాగా కీలకమైన విషయాలను వెల్లడించాడు. హత్యకు దారి తీసిన పరిస్థితులేంటో చెప్పాడు. ఈ విషయాలను పోలీసులు వెల్లడించారు.
‘డబుల్ మైండ్’తో..
Nikki Yadav Murder Case: ఈనెల 9వ తేదీ రాత్రి నిక్కీ యాదవ్ను సాహిల్ హత్య చేశాడు. అంతకు కొన్ని గంటల ముందే అతడు ఎంగేజ్మెంట్ పార్టీ చేసుకున్నాడు. అతడికి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. ఈ విషయాల గురించి విచారణలో సాహిల్ చెప్పాడు. అయితే, తనను ప్రేమించి వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని నిక్కీ తనతో గొడవ పడిందని పోలీసులకు సాహిల్ చెప్పాడు. “పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, తన లివ్ ఇన్ పార్ట్ నర్గా ఉన్న నిక్కీ యాదవ్ను పెళ్లి చేసుకోవాలా అనే డబుల్ మైండ్లో సమతమమయ్యానని సాహిల్ చెప్పాడు. ఈ డబుల్ మైండ్ ఒత్తిడి వల్లే నిక్కీ యాదవ్ హత్యకు పాల్పడ్డానని చెప్పాడు” అని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక కన్ఫ్యూజ్ అవడంతో నిక్కీని చంపానని సాహిల్ అంగీకరించాడట. ఈ విషయాలను పోలీస్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
హత్యకు ముందు రోజు ఎంగేజ్మెంట్ పార్టీ
Nikki Yadav Murder Case: ఫిబ్రవరి 9వ తేదీన సాహిల్ గహ్లోత్ ఎంగేజ్మెంట్ పార్టీ చేసుకున్నాడు. ఆ పార్టీలో ఫుల్గా ఎంజాయ్ చేసి డ్యాన్స్ కూడా చేశాడట. ఆ తర్వాత ఉత్తమ్ నగర్లో నిక్కీతో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అయితే, పెళ్లికి ముందు చిన్న ట్రిప్కు వెళదామని సాహిల్ను నిక్కీ ఒప్పించింది.
సాహిల్తో కలిసి గోవాకు వెళ్లాలని నిక్కీ ప్లాన్ చేసింది. అది కుదరకపోవటంతో హిమాచల్ ప్రదేశ్కు వెళ్లాలని అనుకున్నారు. ఇందుకోసం బస్ ఎక్కేందుకు కశ్మీర్ గేట్కు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో పెళ్లి గురించి కారులో సాహిల్ - నిక్కీ మధ్య గొడవ జరిగింది. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తాను అంగీకరించనని సాహిల్కు నిక్కీ తేల్చేసి చెప్పింది. సుమారు రెండు గంటలకు పైగా ఇద్దరి మధ్య కారులోని గొడవ జరిగింది. దీంతో కారులోనే నిక్కీ యాదవ్ గొంతుకు కేబుల్ బిగించి హత్య చేశాడు సాహిల్. ఈ విషయాన్నింటినీ విచారణలో సాహిల్ చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.
హత్య చేసిన తర్వాత ఢిల్లీలోని తన ఫ్యామిలీ దాబాకు నిక్కీ మృతదేహాన్ని తీసుకెళ్లి ఫ్రిజ్లో దాచాడు సాహిల్. ఆ తర్వాత 10వ తేదీనే పెద్దలు కుదిర్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఫ్రిజ్లో నిక్కీ యాదవ్ మృతదేహం విషయం బయటపడటంతో ఈనెల 14వ తేదీన సాహిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.