Man kills wife : చిన్న విషయంపై గొడవ.. భార్యను చంపి భర్త పరార్!
Man kills wife : ఆ భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ రోజు మాత్రం పరిస్థితి మారిపోయింది. గొడవ అనంతరం.. కోపంతో ఊగిపోయిన భర్త.. భార్యను చంపేసి పారిపోయాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
Man kills wife : మహారాష్ట్ర ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న విషయంపై మొదలైన గొడవ.. చివరికి ఒకరి ప్రాణం తీసింది. భార్య మెడను తాడుతో కట్టి.. ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు ఓ కిరాతక భర్త!
ట్రెండింగ్ వార్తలు
చిన్న చిన్న విషయాలపై గొడవ..
30ఏళ్ల మంజిల షేక్.. తన 33ఏళ్ల భర్త ముక్తార్తో కలిసి ముంబైలోని జేజే మార్గ్ ప్రాంతంలో నివాసముంటోంది. వారిద్దరు.. స్థానికంగా నిర్మాణ ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తూ ఉంటారు.
కాగా ఆ భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు వారిద్దరు తీవ్రస్థాయిలో గొడవపడుతూనే ఉండటం సాధారణమైపోయింది.
కాగా.. శనివారం రాత్రి తాగి ఇంటికెళ్లిన ముక్తార్కు, తన భార్య మంజిలకు మధ్య మళ్లీ గొడవ మొదలైంది. కానీ ఈసారి గొడవ పరిణామాలు హత్యకు దారితీశాయి!
తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో ముక్తార్కు అర్ధం కాలేదు. ఆదివారం తెల్లవారుజామున ప్రాంతంలో.. భార్య మెడను తాడుకు చుట్టి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు ముక్తార్. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కొద్దిసేపటికి.. అటువైపు వెళుతున్న చుట్టుపక్కన ప్రజలు.. ముక్తార్ ఇంటి డోర్ తెరిచి ఉండటాన్ని గమినించారు. లోపలికి వెళ్లి చూసిన వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
విగతజీవిగా పడి ఉన్న మంజలిని పరిశీలించగా.. ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు స్థానికులు తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగింది? అన్న విషయాన్ని స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయని స్థానికులు పోలీసులకు వివరించారు. భర్త ముక్తార్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో.. అతడే భార్యను చంపి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముక్తార్ను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
సంబంధిత కథనం