Man kills wife : చిన్న విషయంపై గొడవ.. భార్యను చంపి భర్త పరార్​!-man strangulates wife over petty issue flees ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Man Strangulates Wife Over Petty Issue, Flees

Man kills wife : చిన్న విషయంపై గొడవ.. భార్యను చంపి భర్త పరార్​!

Sharath Chitturi HT Telugu
Aug 15, 2022 09:18 PM IST

Man kills wife : ఆ భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ రోజు మాత్రం పరిస్థితి మారిపోయింది. గొడవ అనంతరం.. కోపంతో ఊగిపోయిన భర్త.. భార్యను చంపేసి పారిపోయాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

చిన్న విషయంపై గొడవ.. భార్యను చంపి భర్త పరార్​!
చిన్న విషయంపై గొడవ.. భార్యను చంపి భర్త పరార్​! (HT)

Man kills wife : మహారాష్ట్ర ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న విషయంపై మొదలైన గొడవ.. చివరికి ఒకరి ప్రాణం తీసింది. భార్య మెడను తాడుతో కట్టి.. ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు ఓ కిరాతక భర్త!

ట్రెండింగ్ వార్తలు

చిన్న చిన్న విషయాలపై గొడవ..

30ఏళ్ల మంజిల షేక్​.. తన 33ఏళ్ల భర్త ముక్తార్​తో కలిసి ముంబైలోని జేజే మార్గ్​ ప్రాంతంలో నివాసముంటోంది. వారిద్దరు.. స్థానికంగా నిర్మాణ ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తూ ఉంటారు.

కాగా ఆ భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు వారిద్దరు తీవ్రస్థాయిలో గొడవపడుతూనే ఉండటం సాధారణమైపోయింది.

కాగా.. శనివారం రాత్రి తాగి ఇంటికెళ్లిన ముక్తార్​కు, తన భార్య మంజిలకు మధ్య మళ్లీ గొడవ మొదలైంది. కానీ ఈసారి గొడవ పరిణామాలు హత్యకు దారితీశాయి!

తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో ముక్తార్​కు అర్ధం కాలేదు. ఆదివారం తెల్లవారుజామున ప్రాంతంలో.. భార్య మెడను తాడుకు చుట్టి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు ముక్తార్​. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

కొద్దిసేపటికి.. అటువైపు వెళుతున్న చుట్టుపక్కన ప్రజలు.. ముక్తార్​ ఇంటి డోర్​ తెరిచి ఉండటాన్ని గమినించారు. లోపలికి వెళ్లి చూసిన వారు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

విగతజీవిగా పడి ఉన్న మంజలిని పరిశీలించగా.. ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు స్థానికులు తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగింది? అన్న విషయాన్ని స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయని స్థానికులు పోలీసులకు వివరించారు. భర్త ముక్తార్​ ప్రస్తుతం పరారీలో ఉండటంతో.. అతడే భార్యను చంపి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముక్తార్​ను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం