Son kills father : ఆస్తి ఇవ్వలేదని.. తండ్రిని నరికి చంపిన కుమారుడు!-up youth absconding after hacking father two sisters to death in baghpat ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Up: Youth Absconding After Hacking Father, Two Sisters To Death In Baghpat

Son kills father : ఆస్తి ఇవ్వలేదని.. తండ్రిని నరికి చంపిన కుమారుడు!

Sharath Chitturi HT Telugu
Aug 15, 2022 05:14 PM IST

Son kills father : ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి నిరాకరించాడు. కోపం పెంచుకున్న తనయుడు.. తండ్రితో పాటు సోదరీమణులను సైతం నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో కలకలం సృష్టించింది.

ఆస్తి ఇవ్వలేదని.. తండ్రిని నరికి చంపిన కుమారుడు!
ఆస్తి ఇవ్వలేదని.. తండ్రిని నరికి చంపిన కుమారుడు! (HT)

Son kills father : ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి విషయంలో గొడవల కారణంగా తండ్రిని, సోదరీమణులను నరికి చంపేశాడు ఓ కుమారుడు.

ట్రెండింగ్ వార్తలు

నరికి చంపేసి..

60ఏళ్ల బ్రిజ్​పాల్​ అనే వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి బఘ్​పట్​ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూతుళ్లు జ్యోతి, అనురాధలకు 25, 17 సంవత్సరాలు ఉంటాయి. కుమారుడు అమర్​కు 20ఏళ్లు పైబడ్డాయి.

కాగా.. కొన్ని నెలలుగా కుటుంబంలో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి తనకే దక్కాలని అమర్​ పట్టుబట్టాడు. కాగా.. అమర్​పై అసహనంతో.. ఆస్తిని అతనికి దక్కకుండా చేశాడు తండ్రి బ్రిజ్​పాల్​. రెండు నెలల క్రితం.. ఆస్తి హక్కుల నుంచి శాస్వతంగా కుమారుడిని తొలగించాడు.

ఈ వ్యవహారంపై కోపం పెంచుకున్నాడు అమర్​. తండ్రిని చంపేందుకు సిద్ధపడ్డాడు.

ఈ క్రమంలోనే బ్రిజ్​పాల్​, ఇద్దరు కూతుళ్లను అతని కుమారుడు నరికి చంపేశాడు. అనంతరం అక్కడిని పారిపోయాడు.

ఘటనపై పోలీసులకు సోమవారం సమాచారం ఇచ్చింది.. బ్రిజ్​పాల్​ భార్య శశిప్రభ. జరిగిన దారుణాన్ని వివరించింది. ఆస్తి వ్యవహారం వల్లే.. సొంత కుమారుడు తనకు అన్యాయం చేశాడని బాధపడింది.

ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం.. పరారీలో ఉన్న అమర్​ను పట్టుకునే పనిలో పడ్డారు.

దారుణ ఘటనలు..

దేశంలో హత్యలు దారుణంగా పెరిగిపోతున్నాయి. 21ఏళ్ల యువకుడిని.. ఐదుగురు మైనర్లు దారుణంగా చంపేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఢిల్లీలోని మయూర్​ విహార్​ ప్రాంతంలో గత సోమవారం జరిగింది ఈ ఘటన. 16 బ్లాక్​ త్రిలోక్​పురి ప్రాంతంలో.. కత్తి పోట్లతో నేల మీద ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడని.. పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. తీవ్రంగా గాయపడిన 21ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే అతడు మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.

ఆ 21ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు మార్చ్యురీలో పెట్టారు.

మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. క్రైమ్​ సీన్​కు వెళ్లి అన్నింటిని క్షుణ్నంగా పరిశీలించారు. ఘటనపై సెక్షన్​ 302, ఐపీసీ 34 కింద కేసు నమోదు చేసుకున్నారు.

Delhi crime news : దర్యాప్తులో భాగంగా స్థానిక సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఐదుగురు వ్యక్తులు.. ఆ 21ఏళ్ల వ్యక్తిని దారుణంగా పొడిచి చంపుతున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. వారందరు మైనర్లే కావడం గమనార్హం.

తొలుత వారు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికే.. కత్తితో బాధితుడిని పొడిచి చంపేశారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా.. బాధితుడికి, నిందితులకు ఎప్పటి నుంచే సంబంధం ఉందని తెలిసింది. ఒక విషయంపై మొదలైన గొడవ, చివరికి ఒకరి ప్రాణాలు తీసిందని స్పష్టమైంది.

పోలీసులు.. మరో ఇద్దరిని పట్టుకునే పనిలో ఉన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం