Son kills father : ఆస్తి ఇవ్వలేదని.. తండ్రిని నరికి చంపిన కుమారుడు!
Son kills father : ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి నిరాకరించాడు. కోపం పెంచుకున్న తనయుడు.. తండ్రితో పాటు సోదరీమణులను సైతం నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్లో కలకలం సృష్టించింది.
Son kills father : ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి విషయంలో గొడవల కారణంగా తండ్రిని, సోదరీమణులను నరికి చంపేశాడు ఓ కుమారుడు.
ట్రెండింగ్ వార్తలు
నరికి చంపేసి..
60ఏళ్ల బ్రిజ్పాల్ అనే వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి బఘ్పట్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూతుళ్లు జ్యోతి, అనురాధలకు 25, 17 సంవత్సరాలు ఉంటాయి. కుమారుడు అమర్కు 20ఏళ్లు పైబడ్డాయి.
కాగా.. కొన్ని నెలలుగా కుటుంబంలో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి తనకే దక్కాలని అమర్ పట్టుబట్టాడు. కాగా.. అమర్పై అసహనంతో.. ఆస్తిని అతనికి దక్కకుండా చేశాడు తండ్రి బ్రిజ్పాల్. రెండు నెలల క్రితం.. ఆస్తి హక్కుల నుంచి శాస్వతంగా కుమారుడిని తొలగించాడు.
ఈ వ్యవహారంపై కోపం పెంచుకున్నాడు అమర్. తండ్రిని చంపేందుకు సిద్ధపడ్డాడు.
ఈ క్రమంలోనే బ్రిజ్పాల్, ఇద్దరు కూతుళ్లను అతని కుమారుడు నరికి చంపేశాడు. అనంతరం అక్కడిని పారిపోయాడు.
ఘటనపై పోలీసులకు సోమవారం సమాచారం ఇచ్చింది.. బ్రిజ్పాల్ భార్య శశిప్రభ. జరిగిన దారుణాన్ని వివరించింది. ఆస్తి వ్యవహారం వల్లే.. సొంత కుమారుడు తనకు అన్యాయం చేశాడని బాధపడింది.
ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం.. పరారీలో ఉన్న అమర్ను పట్టుకునే పనిలో పడ్డారు.
దారుణ ఘటనలు..
దేశంలో హత్యలు దారుణంగా పెరిగిపోతున్నాయి. 21ఏళ్ల యువకుడిని.. ఐదుగురు మైనర్లు దారుణంగా చంపేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో గత సోమవారం జరిగింది ఈ ఘటన. 16 బ్లాక్ త్రిలోక్పురి ప్రాంతంలో.. కత్తి పోట్లతో నేల మీద ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడని.. పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. తీవ్రంగా గాయపడిన 21ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే అతడు మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.
ఆ 21ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు మార్చ్యురీలో పెట్టారు.
మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. క్రైమ్ సీన్కు వెళ్లి అన్నింటిని క్షుణ్నంగా పరిశీలించారు. ఘటనపై సెక్షన్ 302, ఐపీసీ 34 కింద కేసు నమోదు చేసుకున్నారు.
Delhi crime news : దర్యాప్తులో భాగంగా స్థానిక సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఐదుగురు వ్యక్తులు.. ఆ 21ఏళ్ల వ్యక్తిని దారుణంగా పొడిచి చంపుతున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. వారందరు మైనర్లే కావడం గమనార్హం.
తొలుత వారు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికే.. కత్తితో బాధితుడిని పొడిచి చంపేశారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా.. బాధితుడికి, నిందితులకు ఎప్పటి నుంచే సంబంధం ఉందని తెలిసింది. ఒక విషయంపై మొదలైన గొడవ, చివరికి ఒకరి ప్రాణాలు తీసిందని స్పష్టమైంది.
పోలీసులు.. మరో ఇద్దరిని పట్టుకునే పనిలో ఉన్నారు.
సంబంధిత కథనం