Man kills Lover: ప్రియురాలి గొంతు కోసి చంపి.. తానూ ఆత్మహత్య చేసుకొని.. సోషల్ మీడియాలో వీడియో-man allegedly kills girlfriend confesses on social media before doing suicide in west bengal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Man Allegedly Kills Girlfriend Confesses On Social Media Before Doing Suicide In West Bengal

Man kills Lover: ప్రియురాలి గొంతు కోసి చంపి.. తానూ ఆత్మహత్య చేసుకొని.. సోషల్ మీడియాలో వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 16, 2022 01:21 PM IST

Man kills Woman in Bengal: మహిళను గొంతుకోసి చంపి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన నేరాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. హత్యకు గురైన మహిళకు పెళ్లయి.. ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ప్రియురాలి గొంతు కోసి చంపి.. తానూ ఆత్మహత్య చేసుకొని..
ప్రియురాలి గొంతు కోసి చంపి.. తానూ ఆత్మహత్య చేసుకొని..

Man kills Woman in Bengal: సిలిగుడి: పశ్చిమ బెంగాల్‍లో మరో దారుణమైన ఘటన జరిగింది. ఓ యువకుడు తాను ప్రేమించిన మహిళను గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తన నేరాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. అనంతరం వీడియో షూట్ చేస్తూ నడిచిన రైల్వే ట్రాక్‍పైనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగాల్‍లోని కొత్త జల్పాయ్‍గుడి దగ్గర జరిగింది ఈ ఘటన. హత్యకు గురైన మహిళ వివాహిత. పోలీసులు వివరాలను వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Man kills Woman in Bengal: వివాహితతో సంబంధం.. హత్య జరిగిందిలా..

ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని కిరణ్ దేవ్‍నాథ్‍గా పోలీసులు గుర్తించారు. అతడి చేతిలో హత్యకు గురైన మహిళ రియా బిశ్వాస్ (30) అని తెలిపారు. ఆ మహిళకు ఇప్పటికే విహహం జరిగింది. ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

కిరణ్ దేవ్‍నాథ్ ఓ కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే రియాతో సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. రియా భర్త లేని సమయం చూసి ఆమె ఇంటికి దేవ్‍నాథ్ హఠాత్తుగా వెళ్లాడు. రియా గొంతును కోశాడు. ఈ విషయాలు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యాయి.

“ఘటన జరిగినప్పుడు రియా కుమారుడు గట్టిగా ఏడ్చాడు. దీంతో చుట్టుపక్కన వారు ఏం జరిగిందోనని చూడడానికి వచ్చారు. వాష్‍రూమ్‍లో ఆ మహిళ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూశారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు” అని ఓ పోలీస్ చెప్పారు.

Man kills Woman in Bengal: వీడియో షూట్ చేస్తూనే.

హత్య చేసిన అనంతరం 30 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కిరణ్ దేవ్‍నాథ్. “నేను తనను ఎంతో ప్రేమించాను. ఆమె లేకుండా నేను జీవించలేను. నేను ఆమెను నా చేతులతోనే చంపేశాను” అని ఆ వీడియోలో కిరణ్ చెప్పాడు.

రైల్వే ట్రాక్ పై నుంచి ఈ వీడియోను షూట్ చేశాడు కిరణ్. తన చివరి మాటలను రికార్డ్ చేశాడు. ట్రైన్ సమీపించడంతో అతడి చివరి మాటలు స్పష్టంగా వినిపించలేదు. రైలు కింద పడి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

“కిరణ్ మంచి వ్యక్తి. ఇలాంటి విషాదకర ఘటన జరిగిందని తెలిసి షాకయ్యా. సోషల్ మీడియాలో అతడు ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ మహిళను తానే చంపినట్టు దాంట్లో ఆంగీకరించాడు” అని విమల్ అనే వ్యక్తి చెప్పాడు. ఆ వీడియో ఉన్నది కిరణ్ అని విమల్ గుర్తించాడు.

IPL_Entry_Point