Journalist kills lover : మహిళను చంపి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన జర్నలిస్ట్​-journalist kills lover and hacks her body accused arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Journalist Kills Lover And Hacks Her Body, Accused Arrested

Journalist kills lover : మహిళను చంపి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన జర్నలిస్ట్​

Sharath Chitturi HT Telugu
Aug 19, 2022 09:54 AM IST

Journalist kills lover: వారిద్దరి మధ్య గత కొంతకాలంగా సంబంధం ఉంది. ఆ మహిళ, తన భర్త- పిల్లలను విడిచిపెట్టి వచ్చేసింది. పెళ్లి చేసుకోవాలని ఆ వ్యక్తిని డిమాండ్​ చేసింది. కోపం తెచ్చుకున్న ఆ జర్నలిస్ట్​.. ఆమెను వదిలించుకోవాలని చూశాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

మహిళను చంపి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన జర్నలిస్ట్​
మహిళను చంపి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన జర్నలిస్ట్​ (HT Telugu)

Journalist kills lover: మహారాష్ట్రలోని ఔరంగాబాద్​ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జర్నలిస్ట్​.. ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు.

ట్రెండింగ్ వార్తలు

పెళ్లి చేసుకోవాలని అడిగితే..

24ఏళ్ల మహిళ.. కొన్ని రోజుల క్రితం వరకు షియుర్​ ప్రాంతంలో నివాసముండేది. ఆమెకు ముగ్గురు పిల్లలు. కాగా.. ఇటీవలే.. కుటుంబాన్ని విడిచిపెట్టి హుడ్​కో ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుంది.

కాగా.. ఆ మహిళకు, 35ఏళ్ల సౌరభ్​ లాఖే అనే వ్యక్తికి గత కొంత కాలంగా అఫైర్​ నడుస్తోంది! సౌరభ్​.. స్థానికంగా ఫ్రీలాన్స్​ రిపోర్ట్​.

హుడ్​కో ప్రాంతంలోని మహిళ నివాసానికి సౌరభ్​ తరచూ వెళ్లేవాడు. కాగా.. తాను ఇంట్లో నుంచి వచ్చేసినట్టు, తనని పెళ్లిచేసుకోవాలని సౌరభ్​కు ఆ మహిళ అనేకమార్లు చెప్పింది. కానీ అతను పట్టించుకోలేదు.

Man kills lover : సౌరభ్​పై ఒత్తిడి తీవ్రస్థాయిలో పెరిపోయింది. ఇక ఆ మహిళను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను చంపేందుకు ప్రణాళిక రచించాడు.

ఆగస్టు 15న.. ఆ మహిళ నివాసానికి వెళ్లాడు సౌరభ్​. ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత.. చేసిన నేరం బయటపడకుండా చూసుకునేందుకు మరో ప్లాన్​ వేశాడు.

మహిళ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు సౌరభ్​. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు.. శరీర భాగాలను వేరుచేశాడు. ఆ తర్వాతి రోజు.. మహిళ తల, చేతులను బ్యాగులో పెట్టుకుని షియుర్​లోని ఓ గోడౌన్​లో పడేశాడు.

మరుసటి రోజు, అంటే బుధవారం నాడు.. మృతదేహంలోని ఇతర భాగాలను తరలించే ప్రయత్నం చేశాడు. అప్పుడే.. ఆ ఇంటి ఓనర్​.. సౌరభ్​ను గమనించాడు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడే అసలు విషయం బయటపడింది. షియుర్​కు వెళుతున్న సౌరభ్​ను.. పోలీసులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సౌరభ్​పై విచారణ చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం