Journalist kills lover : మహిళను చంపి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన జర్నలిస్ట్
Journalist kills lover: వారిద్దరి మధ్య గత కొంతకాలంగా సంబంధం ఉంది. ఆ మహిళ, తన భర్త- పిల్లలను విడిచిపెట్టి వచ్చేసింది. పెళ్లి చేసుకోవాలని ఆ వ్యక్తిని డిమాండ్ చేసింది. కోపం తెచ్చుకున్న ఆ జర్నలిస్ట్.. ఆమెను వదిలించుకోవాలని చూశాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Journalist kills lover: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జర్నలిస్ట్.. ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు.
ట్రెండింగ్ వార్తలు
పెళ్లి చేసుకోవాలని అడిగితే..
24ఏళ్ల మహిళ.. కొన్ని రోజుల క్రితం వరకు షియుర్ ప్రాంతంలో నివాసముండేది. ఆమెకు ముగ్గురు పిల్లలు. కాగా.. ఇటీవలే.. కుటుంబాన్ని విడిచిపెట్టి హుడ్కో ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుంది.
కాగా.. ఆ మహిళకు, 35ఏళ్ల సౌరభ్ లాఖే అనే వ్యక్తికి గత కొంత కాలంగా అఫైర్ నడుస్తోంది! సౌరభ్.. స్థానికంగా ఫ్రీలాన్స్ రిపోర్ట్.
హుడ్కో ప్రాంతంలోని మహిళ నివాసానికి సౌరభ్ తరచూ వెళ్లేవాడు. కాగా.. తాను ఇంట్లో నుంచి వచ్చేసినట్టు, తనని పెళ్లిచేసుకోవాలని సౌరభ్కు ఆ మహిళ అనేకమార్లు చెప్పింది. కానీ అతను పట్టించుకోలేదు.
Man kills lover : సౌరభ్పై ఒత్తిడి తీవ్రస్థాయిలో పెరిపోయింది. ఇక ఆ మహిళను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను చంపేందుకు ప్రణాళిక రచించాడు.
ఆగస్టు 15న.. ఆ మహిళ నివాసానికి వెళ్లాడు సౌరభ్. ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత.. చేసిన నేరం బయటపడకుండా చూసుకునేందుకు మరో ప్లాన్ వేశాడు.
మహిళ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు సౌరభ్. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు.. శరీర భాగాలను వేరుచేశాడు. ఆ తర్వాతి రోజు.. మహిళ తల, చేతులను బ్యాగులో పెట్టుకుని షియుర్లోని ఓ గోడౌన్లో పడేశాడు.
మరుసటి రోజు, అంటే బుధవారం నాడు.. మృతదేహంలోని ఇతర భాగాలను తరలించే ప్రయత్నం చేశాడు. అప్పుడే.. ఆ ఇంటి ఓనర్.. సౌరభ్ను గమనించాడు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడే అసలు విషయం బయటపడింది. షియుర్కు వెళుతున్న సౌరభ్ను.. పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సౌరభ్పై విచారణ చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం