డ్రగ్స్ బానిసను చంపేసిన తండ్రి.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి..
Man kills son : గుజరాత్ అహ్మదాబాద్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ మత్తులో ఇంటికొచ్చి రోజూ తనతో గొడవపడుతున్నాడన్న కారణంతో, కుమారుడిని రాయితో కొట్టి చంపేశాడు ఓ తండ్రి. ఆ తర్వాత.. కుమారుడి శరీరాన్ని ముక్కలుముక్కలు చేసి, రెండు వేరువేరు ప్రాంతాల్లో పడేశాడు. దేశం విడిచి వెళ్లిపోతుండగా.. పోలీసులకు చిక్కాడు.
Man kills son : డ్రగ్స్ తీసుకుంటున్న 21ఏళ్ల కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. నిందితుడు.. నేపాల్కి పారిపోతుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
ఈ నెల 20, 21 తేదీల్లో.. అహ్మదాబాద్లోని రెండు వేరువేరు ప్రాంతాల్లో తల, చేతులు, కాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ ఒక మనిషివేనని పోలీసులు నిర్ధరించారు.
టెక్నికల్, నిఘా వర్గాల సాయంతో.. నిందితుడు జోషిని పోలీసులు పట్టుకున్నారు. జోషి అనే వ్యక్తి.. మరణించిన మనిషికి తండ్రి అని తేలింది.
జులై 22న.. బస్సులో అహ్మదాబాద్ నుంచి సూరత్కు వెళ్లాడు జోషి. అక్కడి నుంచి గోరఖ్పూర్కు వెళ్లి, అటునుంచి నేపాల్కి పారిపోవాలన్నది అతని ప్లాన్. ఈ క్రమంలోనే గోరఖ్పూర్కు ట్రైన్ ఎక్కాడు. కానీ పోలీసుల సమాచారంతో రాజస్థాన్లోని గంగానగర్ రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని పట్టుకున్నారు.
విచారణలో భాగంగా.. జోషి నిజాన్ని ఒప్పుకున్నాడు. డ్రగ్స్, మద్యం మత్తులో తన కుమారుడు తనతో తరచూ గొడపడతాడని, బూతులు తిడతాడని జోషి చెప్పాడు.
"జులై 18న.. స్వాయం అనే వ్యక్తి.. డ్రగ్స్ మత్తులో ఇంటికి వెళ్లి తండ్రిని తిట్టడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ అతను ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే స్వాయం.. జోషిని కొట్టాడు. ఈ క్రమంలోనే జోషి కూడా తిరగబడ్డాడు. పెద్ద రాయితో కుమారుడిని 6-7సార్లు తల మీద బలంగా కొట్టాడు. స్వాయం అక్కడిక్కడే మరణించాడు. ఆ తర్వాత.. నిందితుడు ఎలక్ట్రిక్ గ్రైండర్ తీసుకెళ్లాడు. కుమారుడిని ముక్కలు ముక్కలు చేసి ప్లాస్టిక్ బ్యాగ్లో వేశాడు. ఆ బ్యాగులను తన బైక్ మీద పెట్టుకుని, నగరంలోని రెండు ప్రాంతాల్లో విసిరేశాడు," అని పోలీసులు ఈ మిస్టరీని ఛేజ్ చేశారు.
సంబంధిత కథనం