డ్రగ్స్​ బానిసను చంపేసిన తండ్రి.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి..-guj man kills drug addict son disposes off body parts in ahmedabad held ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Guj: Man Kills Drug Addict Son, Disposes Off Body Parts In Ahmedabad; Held

డ్రగ్స్​ బానిసను చంపేసిన తండ్రి.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి..

Sharath Chitturi HT Telugu
Jul 24, 2022 09:15 PM IST

Man kills son : గుజరాత్​ అహ్మదాబాద్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్​ మత్తులో ఇంటికొచ్చి రోజూ తనతో గొడవపడుతున్నాడన్న కారణంతో, కుమారుడిని రాయితో కొట్టి చంపేశాడు ఓ తండ్రి. ఆ తర్వాత.. కుమారుడి శరీరాన్ని ముక్కలుముక్కలు చేసి, రెండు వేరువేరు ప్రాంతాల్లో పడేశాడు. దేశం విడిచి వెళ్లిపోతుండగా.. పోలీసులకు చిక్కాడు.

డ్రగ్స్​ బానిసను చంపేసిన తండ్రి.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి..
డ్రగ్స్​ బానిసను చంపేసిన తండ్రి.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. (HT Telugu)

Man kills son : డ్రగ్స్​ తీసుకుంటున్న 21ఏళ్ల కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన గుజరాత్​లో చోటుచేసుకుంది. నిందితుడు.. నేపాల్​కి పారిపోతుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

ఈ నెల 20, 21 తేదీల్లో.. అహ్మదాబాద్​లోని రెండు వేరువేరు ప్రాంతాల్లో తల, చేతులు, కాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ ఒక మనిషివేనని పోలీసులు నిర్ధరించారు.

టెక్నికల్​, నిఘా వర్గాల సాయంతో.. నిందితుడు జోషిని పోలీసులు పట్టుకున్నారు. జోషి అనే వ్యక్తి.. మరణించిన మనిషికి తండ్రి అని తేలింది.

జులై 22న.. బస్సులో అహ్మదాబాద్​ నుంచి సూరత్​కు వెళ్లాడు జోషి. అక్కడి నుంచి గోరఖ్​పూర్​కు వెళ్లి, అటునుంచి​ నేపాల్​కి పారిపోవాలన్నది అతని ప్లాన్​. ఈ క్రమంలోనే గోరఖ్​పూర్​కు ట్రైన్​ ఎక్కాడు. కానీ పోలీసుల సమాచారంతో రాజస్థాన్​లోని గంగానగర్​ రైల్వేస్టేషన్​లో ఆర్​పీఎఫ్​ సిబ్బంది అతడిని పట్టుకున్నారు.

విచారణలో భాగంగా.. జోషి నిజాన్ని ఒప్పుకున్నాడు. డ్రగ్స్​, మద్యం మత్తులో తన కుమారుడు తనతో తరచూ గొడపడతాడని, బూతులు తిడతాడని జోషి చెప్పాడు.

"జులై 18న.. స్వాయం అనే వ్యక్తి.. డ్రగ్స్​ మత్తులో ఇంటికి వెళ్లి తండ్రిని తిట్టడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. కానీ అతను ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే స్వాయం.. జోషిని కొట్టాడు. ఈ క్రమంలోనే జోషి కూడా తిరగబడ్డాడు. పెద్ద రాయితో కుమారుడిని 6-7సార్లు తల మీద బలంగా కొట్టాడు. స్వాయం అక్కడిక్కడే మరణించాడు. ఆ తర్వాత.. నిందితుడు ఎలక్ట్రిక్​ గ్రైండర్​ తీసుకెళ్లాడు. కుమారుడిని ముక్కలు ముక్కలు చేసి ప్లాస్టిక్​ బ్యాగ్​లో వేశాడు. ఆ బ్యాగులను తన బైక్​ మీద పెట్టుకుని, నగరంలోని రెండు ప్రాంతాల్లో విసిరేశాడు," అని పోలీసులు ఈ మిస్టరీని ఛేజ్​ చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం