Mobile messenger apps blocked : 14 మెసెంజర్ యాప్స్ను బ్లాక్ చేసిన కేంద్రం
Mobile messenger apps blocked in India : 14 మెసెంజర్ యాప్స్ను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. వీటిని ఉగ్ర ముఠాలు సమాచార వ్యవస్థగా మార్చుకున్నాయని తెలిసి, ఈ నిర్ణయం తీసుకుంది.
Mobile messenger apps blocked in India : ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద బృందాలు వినియోగిస్తున్నాయంటూ.. 14 మొబైల్ మెసెంజర్ యాప్స్పై నిషేధం విధించింది. జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో పాకిస్థాన్ నుంచి ఆదేశాలు తీసుకునేందుకు, వాటిని తమ మద్దతుదారులకు పంచేందుకు ఉగ్ర ముఠాలు ఈ యాప్స్ను వాడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
నిషేధానికి గురైన 14 యాప్స్ ఇవే..
క్రిప్సివర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్మెర్, మిడియాఫైర్, బ్రైర్, బీచాట్, నాండ్బాక్స్, కానియన్, ఐఎంఓ, ఎలిమెంట్, సెకెండ్ లైన్, జాంగి, థ్రిమా వంటి 14 మెసెంజర్ యాప్స్ను కేంద్రం బ్లాక్ చేసింది. భద్రత, నిఘా ఏజెన్సీల సిఫార్సుల మేరకు ఆయా యాప్స్ను నిషేధించింది కేంద్రం.
భారత దేశాల చట్టాలను ఉల్లంఘిస్తూ, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా చర్యలు చేపడుతున్న ఆయా యాప్స్ను నిషేధించాలని ఏజెన్సీలు ప్రభుత్వానికి ఇటీవలే ఓ లిస్ట్ను ఇచ్చాయి. ఫలితంగా ఈ యాప్స్.. 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69ఏ కింద నిషేధానికి గురయ్యాయి.
India Government blocks messenger apps : "ఓజీడబ్ల్యూలు (ఓవర్గ్రౌండ్ వర్కర్స్), ఉగ్రవాదుల మధ్య సమాచార వ్యవస్థగా ఉపయోగపడుతున్న వాటిపై ఏజెన్సీ ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తుంది. ఇలాంటి ఓ ఛానెల్ను ట్రాక్ చేస్తున్న సమయంలోనే.. ఈ 14 యాప్స్కు సంబంధించి ఇండియాలో ఎలాంటి అధికారిక ప్రాతినిధ్యం లేదని ఏజెన్సీలకు తెలిసింది. వీటిల్లో జరిగే కార్యకలాపాలను ట్రాక్ చేయడం కూడా కష్టమని అర్థం చేసుకున్నాయి. ఫలితంగా వీటిని బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి సూచించాయి. ఇప్పుడు ప్రభుత్వం వీటిని నిషేధించింది," అని ఓ అధికారి.. మీడియాకు వివరించారు.
ప్రభుత్వం కఠిన చర్యలు..
YouTube channels blocked in India : ఉగ్రవాదంతో పాటు దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సమాచార వ్యవస్థలపై ఇటీవలే కాలంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. గతేడాది నుంచి ఇప్పటివరకు పలు దఫాలుగా అనేక యూట్యూబ్ ఛానెల్స్, ఎఫ్బీ పేజ్లను నిషేధించింది. వీటికి పాకిస్థాన్తో లింక్స్ ఉన్నాయని, దేశంలో అలజడులు సృష్టించేందుకు.. ఉగ్రవాదులు వీటిని ఉపయోగించుకుంటున్నాయన్న కారణాలతో బ్యాన్ చేసింది. ఇక తాజాగా 14 మొబైల్ మెసెంజర్ యాప్స్ నిషేధానికి గురయ్యాయి.
సంబంధిత కథనం