Bihar Road Horror : వృద్ధుడిని 8కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు.. చివరికి!
Bihar Road Horror : వృద్ధుడిని ఢీకొట్టి.. కారు మీద ఆయన్ని 8కి.మీల దూరం వరకు ఈడ్చుకెళ్లిన ఘటన బిహార్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.
Bihar Road Horror : బిహార్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 70ఏళ్ల వృద్ధుడిని ఓ కారు ఢీకొట్టింది. కారు బోనెట్ మీద వృద్ధుడు పడగా.. 8 కి.మీల దూరం వరకు ఆయన్ని ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. అనంతర పరిణామాలతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.
అసలేం జరిగిందంటే..
తూర్పు చంపారణ్ జిల్లాలోని నేషనల్ హైవే 27 మీద జరిగింది ఈ ఘటన. బాంగ్రా గ్రామానికి చెందిన 70ఏళ్ల శంకర్ చౌదరి అనే వృద్ధుడు.. తన సైకిల్ మీద బయటకెళ్లాడు. గోపాల్గంజ్ నుంచి వస్తున్న ఓ కారు.. బాంగ్రా చౌక్ వద్ద.. ఆ వృద్ధుడి సైకిల్ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ వృద్ధుడు ఎగిరి, కారు మీదపడ్డాడు. వైపర్ను పట్టుకుని ఉండిపోయాడు. కారు ఆపి తనని దింపమని డ్రైవర్ను వేడుకున్నాడు. కానీ ఆ డ్రైవర్ ఇంకా వేగంతో కారును నడిపాడు. స్థానికులు.. కారును ఆపాలని గట్టిగా అరిచారు. కారును వెంబడించారు. కానీ ఫలితం దక్కలేదు.
Car drags 70 year old for 8 kms : చివరికి.. 8కి.మీల దూరంలో ఉన్న కదం చౌక్ ప్రాంతంలో కారు బ్రేక్ పడింది. కారు మీద నుంచి ఎగిరి రోడ్డు మీద పడ్డాడు శంకర్ చౌదరి. వృద్ధుడి మీద నుంచి కారు నడిపించాడు ఆ డ్రైవర్. ఫలితంగా.. శంకర్ చౌదరి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
పరారీలో నిందితులు..
ఘటనపై సమాచారం అందుకున్న కోట్వా పోలీస్స్టేషన్ చీఫ్ అంజు కుమార్.. ఆ ప్రాంతంలోని పోలీసులను అలర్ట్ చేశారు. ఈ క్రమంలోనే పిప్రకోతి పోలీసులు కారను గుర్తించి, దానిని స్వాధీనం చేసుకున్నారు. కానీ.. డ్రైవర్తో పాటు లోపల ఉన్న ప్రయాణికులు అప్పటికే తప్పించుకున్నారు.
Bihar road accident : ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారు ఓనర్కు సంబంధించిన వివరాలను సేకరించే ప్రక్రియను ముమ్మరం చేశారు.
ఢిల్లీలో..
Delhi road horror case : కారుతో మనుషులను ఢీకొట్టి.. వారిని ఈడ్చుకెళుతున్న ఘటనలు ఇటీవలే దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. న్యూఇయర్ వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగివెళుతున్న 20ఏళ్ల అంజలి అనే యువతిని ఓ కారు ఢీకొట్టింది. ఆమె కాలు టైర్ దగ్గర ఇరుక్కుపోయింది. ఈ విషయం తెలిసినప్పటికీ.. డ్రైవర్ కారును దాదాపు 12కి.మీల దూరం కారను నడిపించాడు. ఈ ఘటనపై అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేశారు.