Hanuman Chalisa row | 'ప్రధాని ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతాము..'
మహారాష్ట్ర: ప్రధాని ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతామని, నమాజ్ చేస్తామని అందుకు అనుమతులు కావాలని కేంద్రమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు ఓ ఎన్సీపీ నేత. ఫలితంగా రాష్ట్రంలో హనుమాన్ చాలీసా వివాదం మరింత ముదిరింది.
Hanuman Chalisa row | మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే.. ఎంపీ నవ్నీత్ కౌర్ దంపతులు.. జైలుకెళ్లారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఎన్సీపీకి చెందిన ఓ ముస్లిం నేత స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు.. హనుమాన్ చాలీసా చదవడంతో పాటు నమాజ్ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం అనుమతులు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతామని ఎంపీ నవ్నీత్ రాణా- ఎమ్మెల్యే రవి రాణాలు హెచ్చరించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వారికి ఇంకా బెయిల్ కూడా మంజూరు కాలేదు. కాగా.. ఈ ఘటనలకు ప్రతీకారంగా.. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ ముందు హనుమాన్ చాలీసా చదువుతామని, అనుమతులు ఇవ్వాలని ఎన్సీపీ నేత ఫమిద హసన్ ఖాన్ అమిత్ షాకు లేఖ రాసినట్టు తెలుస్తోంది.
PM Modi | ముస్లిం అయినప్పటికీ.. తాను తన ఇంట్లో నిత్యం హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా చదువుతానని హసన్ వెల్లడించారు.
"దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిద్రలేపాల్సిన సమయం వచ్చింది. మతోశ్రీ(ఉద్ధవ్ ఠాక్రే నివాసం) వద్ద హనుమాన్ చాలీసా చదువుతామని నవ్నీత్, రవిలు అంటున్నారు. అలాంటప్పుడు.. ప్రధాని ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదవడానికి, నమాజ్ చేయడానికి మాకు కూడా అనుమతులు ఇవ్వాలి," అని హసన్ ఖాన్ పేర్కొన్నారు.
'ఉద్ధవ్ ఠాక్రేను నిద్రలేపి హిందుత్వాన్ని బోధిస్తామని ఆ దంపతులు అంటున్నారు. అలాంటప్పుడు.. మోదీ, అమిత్ షాలను కూడా నిద్రలేపాలి. అసలు సమస్యల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. జీడీపీ వృద్ధి పడిపోతోంది. ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్ర ప్రభుత్వం.. ఇలాంటి విషయాల(హనుమాన్ చాలీసా వివాదం)ను తీసుకొస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్