సహజీవనం చేస్తున్న వ్యక్తి గొంతు కోసిన మహిళ.. ట్రాలీలో మృతదేహాన్ని కుక్కి..!-ghaziabad woman kills live in partner body found stuffed in trolley bag found by police ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  సహజీవనం చేస్తున్న వ్యక్తి గొంతు కోసిన మహిళ.. ట్రాలీలో మృతదేహాన్ని కుక్కి..!

సహజీవనం చేస్తున్న వ్యక్తి గొంతు కోసిన మహిళ.. ట్రాలీలో మృతదేహాన్ని కుక్కి..!

Sharath Chitturi HT Telugu
Aug 09, 2022 06:49 AM IST

woman kills live in partner : అతనితో ఓ మహిళ సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకోవాలని డిమాండ్​ చేసింది. మతం పేరు చెప్పి, అతను పెళ్లికి ఒప్పుకోలేదు. కోపంలో అతడిని ఆ మహిళ గొంతు కోసి చంపేసింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది ఈ ఘటన.

సహజీవనం చేస్తున్న వ్యక్తి గొంతు కోసిన మహిళ..
సహజీవనం చేస్తున్న వ్యక్తి గొంతు కోసిన మహిళ.. (HT)

woman kills live in partner : ఉత్తర్​ప్రదేశ్​ ఘాజియాబాద్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న వ్యక్తి గొంతును బ్లేడ్​తో కోసేసింది ఓ మహిళ. అనంతరం ట్రాలీలో మృతదేహాన్ని కుక్కి.. వేరే ప్రాంతంలో విసిరిసేందుకు ప్రయత్నించింది. అప్పుడే పోలీసులకు దొరికిపోయింది.

పెళ్లికి ఒప్పుకోలేదని..

ప్రీతి శర్మ అనే మహిళ.. నాలుగేళ్ల క్రితం తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి ఫిరోజ్​ అనే వ్యక్తితో సహజీవనంలో ఉంది. అతని వయస్సు 23ఏళ్లు.

కొంత కాలంగా.. తనని పెళ్లి చేసుకోవాలని ప్రీతి.. ఫిరోజ్​ను అడుగుతోంది. ఏవేవో సాకులు చెబుతూ.. అతను తప్పించుకున్నాడు.

ఆదివారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. తనని పెళ్లి చేసుకోవాలని ప్రీతి.. మరోమారు ఫిరోజ్​ను డిమాండ్​ చేసింది. వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబసభ్యులు ఒప్పుకోరని చెప్పాడు ఫిరోజ్​. ప్రీతిని పెళ్లి చేసుకోలేనని తేల్చేశాడు.

ఈ క్రమంలో కోపం పెంచుకున్న ప్రీతి.. క్షణికావేశంలో ఫిరోజ్​ను చంపేసింది. బ్లేడ్​తో అతని గొంతు కోసేసింది. ఆ తర్వాత.. మృతదేహాన్ని ఓ పెద్ద ట్రాలీ బ్యాగులో కుక్కింది.

Ghaziabad crime news : ఘాజియాబాద్​ రైల్వే స్టేషన్​లో ట్రాలీని పడేసేందుకు బయలు దేరింది ప్రీతి. కానీ అప్పుడే రోడ్డు మీద ఓ పోలీసు వాహనం ఎదురైంది.

ట్రాలీని, ప్రీతిని మహిళా పోలీసు సిబ్బంది తనిఖీ చేశారు. అప్పుడే ట్రాలీలో నుంచి ఓ మృతదేహం బయటపడింది.

విచారణలో భాగంగా.. ప్రీతిని పోలీసులు ప్రశ్నించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. పెళ్లికి నిరాకరించడంతోనే సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపేసినట్టు ఆ మహిళ అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన బ్లేడ్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం