Shraddha Aftab news : 'బతికుండగానే శ్రద్ధ జీవితాన్ని నరకంగా మార్చాడు'-delhi murder case shraddha s friends say she wanted to leave aftab but couldnt ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi Murder Case, Shraddha's Friends Say She Wanted To Leave Aftab But Couldn't

Shraddha Aftab news : 'బతికుండగానే శ్రద్ధ జీవితాన్ని నరకంగా మార్చాడు'

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 15, 2022 02:03 PM IST

Shraddha murder case : అఫ్తాబ్​.. శ్రద్ధ జీవితాన్ని.. బతికుండగానే నరకంగా మార్చాడని ఆమె స్నేహితులు ఆరోపించారు. అతడిని వదిలించుకుందామని శ్రద్ధ అనేకమార్లు భావించిందని చెప్పారు.

అఫ్తాబ్​.. శ్రద్ధ
అఫ్తాబ్​.. శ్రద్ధ ((HT Photo))

Delhi murder case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాల్కర్​ మర్డర్​ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శ్రద్ధ స్నేహితుడు, ముంబైకు చెందిన లక్షణ్​ నాదర్​ కొన్ని వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈయన.. శ్రద్ధతో నిత్యం టచ్​లో ఉండేవాడు. రెండు నెలల పాటు శ్రద్ధ నుంచి మెసేజ్​ లేకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులను అలర్ట్​ చేసింది ఈయనే.

ట్రెండింగ్ వార్తలు

అఫ్తాబ్​ను వదిలేద్దామనుకున్న శ్రద్ధ.. కానీ!

ముంబైలో ప్రేమించుకున్న శ్రద్ధ, అఫ్తాబ్​ పూనావాలాలు ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఓ కాల్​ సెంటర్​లో చేరారు. కాగా.. ఈ ఏడాది మే 18న.. శ్రద్ధను హత్య చేశాడు అఫ్తాబ్​. తన శరీరాన్ని 35 భాగాలుగా నరికి.. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఈ వ్యవహారం.. కొన్ని రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ తండ్రి ఫిర్యాదుతో అఫ్తాబ్​ను అరెస్ట్​ చేసిన పోలీసులకు ఈ వివరాలు తెలిసాయి.

Delhi live in partner murder case : కాగా.. 2019లో శ్రద్ధకు పరిచయమయ్యాడు లక్షణ్​ నాదర్​. ముంబైలోని ఓ కాల్​ సెంటర్​లో ఇద్దరు కలిసి పనిచేసేవారు. వీరిద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలోనే అఫ్తాబ్​ గురించి లక్షణ్​కు చెప్పింది శ్రద్ధ. ఓ డేటింగ్​ యాప్​లో అతడిని కలిసినట్టు.. ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు వివరించింది.

ఆ తర్వాత.. అఫ్తాబ్​, శ్రద్ధలు కొన్ని నెలల పాటు ఓ ఫిట్​నెస్​ స్టోర్​లో పనిచేశారు. నాదర్​ ప్రకారం.. శ్రద్ధ, అఫ్తాబ్​ల రిలేషన్​ను వారి ఇళ్లల్లో ఒప్పుకోలేదు. ఈ క్రమంలో.. ఇళ్ల నుంచి బయటకొచ్చేసి, నాయ్​గాన్​ ఈస్ట్​ ప్రాంతంలో ఓ ఫ్లాట్​ను రెంట్​కు తీసుకుని సహజీవనం మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు అదే ఫ్లాట్​లో ఉన్నారు.

Shraddha Aftab news : ప్రేమికుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవని చెప్పిన లక్షణ్​.. ఓ సందర్భంలో అఫ్తాబ్​ గురించి శ్రద్ధ స్నేహితులు.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినట్టు వెల్లడించాడు.

"శ్రద్ధ నాకో వాట్సాప్​ మెసేజ్​ పంపించింది. అఫ్తాబ్​ను వదిలి, ఫ్లాట్​ నుంచి బయటపడకపోతే.. అతను తనను చంపేస్తాడని మెసేజ్​ చేసింది. మేము అఫ్తాబ్​కు వార్నింగ్​ ఇచ్చాము. పోలీసులకు చెప్పాలని అనుకున్నాము. కానీ మమ్మల్ని శ్రద్ధ ఆపింది. ఆమెను గౌరవించి.. పోలీసుల వద్దకు వెళ్లలేదు," అని లక్షణ్​ నాదర్​ తెలిపాడు.

Shraddha walker friends : తొలినాళ్లల్లో శ్రద్ధ, అఫ్తాబ్​లు సంతోషంగానే ఉండేవారని మరో స్నేహితుడు రజత్​ శుక్లా చెప్పాడు.

"2018 నుంచి రిలేషన్​లో ఉన్నట్టు శ్రద్ధ నాక ఓసారి చెప్పింది. తొలుత సంతోషంగానే ఉండేవారు. కానీ అఫ్తాబ్​ తనను కొడుతున్నాడని చాలా సార్లు చెప్పింది. అఫ్తాబ్​ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని శ్రద్ధ భావించేది. కానీ అలా చేయలేకపోయింది," అని రజత్​ మీడియాకు వెల్లడించాడు.

శ్రద్ధ జీవితాన్ని బతికుండానే నరకం చేశాడని.. అఫ్తాబ్​పై తీవ్ర ఆరోపణలు చేశాడు రజత్​. ఢిల్లీకి వెళ్లిపోయిన తర్వాత వాళ్లిద్దరితో కాంటాక్ట్​ తెగిపోయిందని పేర్కొన్నాడు.

Delhi crime news : లక్షణ్​ నాదర్​.. శ్రద్ధతో చివరిగా మే నెలలో మాట్లాడాడు. జులై, ఆగస్టులో ఎన్ని మెసేజ్​లు, కాల్స్​ చేసినా శ్రద్ధ నుంచి స్పందన రాలేదు. లక్షణ్​ భయపడిపోయాడు. వెంటనే శ్రద్ధ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు.

కుటుంబంతో శ్రద్ధకు మంచి రిలేషన్​ లేదు. ఫలితంగా వారు పెద్దగా మాట్లాడుకోవడం మానేశారు. లక్షణ్​ మాటలతో భయపడిపోయిన శ్రద్ధ తండ్రి.. వెంటనే ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 8న శ్రద్ధ ఉన్న ఫ్లాట్​కు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తులో భాగంగా.. అఫ్తాబ్​ను అరెస్ట్​ చేశాడు పోలీసులు. పెళ్లి చేసుకోవాలని గొడవలు చేస్తుండటంతోనే.. తాను శ్రద్ధను చంపేసినట్టు నిజాన్ని అంగీకరించాడు అఫ్తాబ్​.

కాగా.. అఫ్తాబ్​కు మరో మహిళతో అఫైర్​ ఉందని గ్రహించడంతోనే.. తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ కోరేదని తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం