Shraddha Aftab news : 'బతికుండగానే శ్రద్ధ జీవితాన్ని నరకంగా మార్చాడు'
Shraddha murder case : అఫ్తాబ్.. శ్రద్ధ జీవితాన్ని.. బతికుండగానే నరకంగా మార్చాడని ఆమె స్నేహితులు ఆరోపించారు. అతడిని వదిలించుకుందామని శ్రద్ధ అనేకమార్లు భావించిందని చెప్పారు.
Delhi murder case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాల్కర్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శ్రద్ధ స్నేహితుడు, ముంబైకు చెందిన లక్షణ్ నాదర్ కొన్ని వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈయన.. శ్రద్ధతో నిత్యం టచ్లో ఉండేవాడు. రెండు నెలల పాటు శ్రద్ధ నుంచి మెసేజ్ లేకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులను అలర్ట్ చేసింది ఈయనే.
ట్రెండింగ్ వార్తలు
అఫ్తాబ్ను వదిలేద్దామనుకున్న శ్రద్ధ.. కానీ!
ముంబైలో ప్రేమించుకున్న శ్రద్ధ, అఫ్తాబ్ పూనావాలాలు ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఓ కాల్ సెంటర్లో చేరారు. కాగా.. ఈ ఏడాది మే 18న.. శ్రద్ధను హత్య చేశాడు అఫ్తాబ్. తన శరీరాన్ని 35 భాగాలుగా నరికి.. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఈ వ్యవహారం.. కొన్ని రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ తండ్రి ఫిర్యాదుతో అఫ్తాబ్ను అరెస్ట్ చేసిన పోలీసులకు ఈ వివరాలు తెలిసాయి.
Delhi live in partner murder case : కాగా.. 2019లో శ్రద్ధకు పరిచయమయ్యాడు లక్షణ్ నాదర్. ముంబైలోని ఓ కాల్ సెంటర్లో ఇద్దరు కలిసి పనిచేసేవారు. వీరిద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలోనే అఫ్తాబ్ గురించి లక్షణ్కు చెప్పింది శ్రద్ధ. ఓ డేటింగ్ యాప్లో అతడిని కలిసినట్టు.. ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు వివరించింది.
ఆ తర్వాత.. అఫ్తాబ్, శ్రద్ధలు కొన్ని నెలల పాటు ఓ ఫిట్నెస్ స్టోర్లో పనిచేశారు. నాదర్ ప్రకారం.. శ్రద్ధ, అఫ్తాబ్ల రిలేషన్ను వారి ఇళ్లల్లో ఒప్పుకోలేదు. ఈ క్రమంలో.. ఇళ్ల నుంచి బయటకొచ్చేసి, నాయ్గాన్ ఈస్ట్ ప్రాంతంలో ఓ ఫ్లాట్ను రెంట్కు తీసుకుని సహజీవనం మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు అదే ఫ్లాట్లో ఉన్నారు.
Shraddha Aftab news : ప్రేమికుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవని చెప్పిన లక్షణ్.. ఓ సందర్భంలో అఫ్తాబ్ గురించి శ్రద్ధ స్నేహితులు.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినట్టు వెల్లడించాడు.
"శ్రద్ధ నాకో వాట్సాప్ మెసేజ్ పంపించింది. అఫ్తాబ్ను వదిలి, ఫ్లాట్ నుంచి బయటపడకపోతే.. అతను తనను చంపేస్తాడని మెసేజ్ చేసింది. మేము అఫ్తాబ్కు వార్నింగ్ ఇచ్చాము. పోలీసులకు చెప్పాలని అనుకున్నాము. కానీ మమ్మల్ని శ్రద్ధ ఆపింది. ఆమెను గౌరవించి.. పోలీసుల వద్దకు వెళ్లలేదు," అని లక్షణ్ నాదర్ తెలిపాడు.
Shraddha walker friends : తొలినాళ్లల్లో శ్రద్ధ, అఫ్తాబ్లు సంతోషంగానే ఉండేవారని మరో స్నేహితుడు రజత్ శుక్లా చెప్పాడు.
"2018 నుంచి రిలేషన్లో ఉన్నట్టు శ్రద్ధ నాక ఓసారి చెప్పింది. తొలుత సంతోషంగానే ఉండేవారు. కానీ అఫ్తాబ్ తనను కొడుతున్నాడని చాలా సార్లు చెప్పింది. అఫ్తాబ్ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని శ్రద్ధ భావించేది. కానీ అలా చేయలేకపోయింది," అని రజత్ మీడియాకు వెల్లడించాడు.
శ్రద్ధ జీవితాన్ని బతికుండానే నరకం చేశాడని.. అఫ్తాబ్పై తీవ్ర ఆరోపణలు చేశాడు రజత్. ఢిల్లీకి వెళ్లిపోయిన తర్వాత వాళ్లిద్దరితో కాంటాక్ట్ తెగిపోయిందని పేర్కొన్నాడు.
Delhi crime news : లక్షణ్ నాదర్.. శ్రద్ధతో చివరిగా మే నెలలో మాట్లాడాడు. జులై, ఆగస్టులో ఎన్ని మెసేజ్లు, కాల్స్ చేసినా శ్రద్ధ నుంచి స్పందన రాలేదు. లక్షణ్ భయపడిపోయాడు. వెంటనే శ్రద్ధ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు.
కుటుంబంతో శ్రద్ధకు మంచి రిలేషన్ లేదు. ఫలితంగా వారు పెద్దగా మాట్లాడుకోవడం మానేశారు. లక్షణ్ మాటలతో భయపడిపోయిన శ్రద్ధ తండ్రి.. వెంటనే ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 8న శ్రద్ధ ఉన్న ఫ్లాట్కు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తులో భాగంగా.. అఫ్తాబ్ను అరెస్ట్ చేశాడు పోలీసులు. పెళ్లి చేసుకోవాలని గొడవలు చేస్తుండటంతోనే.. తాను శ్రద్ధను చంపేసినట్టు నిజాన్ని అంగీకరించాడు అఫ్తాబ్.
కాగా.. అఫ్తాబ్కు మరో మహిళతో అఫైర్ ఉందని గ్రహించడంతోనే.. తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ కోరేదని తెలుస్తోంది.
సంబంధిత కథనం