Shraddha Aftab : ఫ్రిడ్జ్లో శ్రద్ధ మృతదేహం.. అక్కడే కొత్త గర్ల్ఫ్రెండ్తో..!
Shraddha murder case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాల్కర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఫ్రిడ్జ్లో శ్రద్ధ మృతదేహం ఉండగానే.. నిందితుడు మరో గర్ల్ఫ్రెండ్ని ఇంటికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
Shraddha murder case : దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన శ్రద్ధ వాల్కర్ మర్డర్ కేసులో.. సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. శ్రద్ధను చంపిన తర్వాత.. వేరే మహిళను తన ఫ్లాట్కి అఫ్తాబ్ తీసుకెళ్లినట్టు సమాచారం. అప్పటికీ.. శ్రద్ధ మృతదేహం ఫ్రిడ్జ్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పూర్తి వ్యవహారంలో కుట్ర కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు.
ట్రెండింగ్ వార్తలు
ఏం జరిగింది..
ప్రముఖ డేటింగ్ సైట్ 'బంబుల్' ద్వారా 2019లో శ్రద్ధకు పరిచయమయ్యాడు పునావాలా. వీరిద్దరు ముంబైలోనే ఉండేవారు. మెల్లిగా వీరి మధ్య ప్రేమ చిగురించింది. ముంబైలో నివాసముంటున్న సమయంలోనే అనేకమార్లు వీరిద్దరు విహార యాత్రలకు వెళ్లారు. శ్రద్ధ, పునావాలా ప్రేమను ఆమె ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. ఈ ఏడాది తొలినాళ్లల్లో వీరిద్దరు ముంబైని విడిచిపెట్టి ఢిల్లీకి వెళ్లారు.
shraddha aftab delhi : ఆ తర్వాత శ్రద్ధకు ఆమె కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. కానీ ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. ఈ నెల 8న.. ఢిల్లీకి వెళ్లారు శ్రద్ధ తండ్రి. ఆమె ఫ్లాట్కు లాక్ వేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. శ్రద్ధ అత్యంత కిరాతకంగా హత్యకు గురైందని నిర్ధరించారు. నిందితుడు ఆఫ్తాబ్ను సోమవారం పట్టుకున్నారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ నిత్యం గొడవ చేసేదని, అందుకే చంపేశానని ఆఫ్తాబ్ పోలీసులకు చెప్పాడు.
ఫ్రిడ్జ్లో మృతదేహం..
శ్రద్ధను హత్య చేసిన తర్వాత.. ఆమె మృతదేహాన్ని దాచిపెట్టేందుకు ఓ ఫ్రిడ్జ్ని కొన్నాడు అఫ్తాబ్. ఆమె మృతదేహాన్ని 35ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఆ తర్వాతి 18-20 రోజుల పాటు.. ఒక్కొక్కటిగా తీసుకెళ్లి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.
Man kills live in partner in Delhi : అయితే.. ఈ మధ్యలోనే బంబుల్ డేటింగ్ యాప్లో మరో యువతితో అఫ్తాబ్కు పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. శ్రద్ధ మృతదేహం ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడే.. కొత్త గర్ల్ఫ్రెండ్ను ఆ ఫ్లాట్కి తీసుకెళ్లేవాడని సమాచారం. ఆ యువతి ఇంటికి వచ్చే కొద్ది సేపటి ముందు.. ఫ్రిడ్జ్లోని శరీర భాగాలను కబోర్డుల్లో పెట్టేవాడని తెలుస్తోంది.
కుట్ర చేసి చంపేశాడా?
ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లిన తర్వాత శ్రద్ధ, అఫ్తాబ్లు ఓ ఫ్లాట్లో ఉండేవారు. మార్చ్- ఏప్రిల్ మధ్యలో విహార యాత్రలకు వెళ్లారు. మే నెలలో హిమాచల్ ప్రదేశ్కు కూడా వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి.. ఢిల్లీలోని ఛత్తర్పూర్లో నివాసముండేవాడు. ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. వీరిద్దరు ఛత్తర్పూర్లోని ఓ ఫ్లాట్లోకి మారారు. హిమాచల్ ప్రదేశ్లో కలిసిన వ్యక్తిదే ఈ ఫ్లాట్ అని తెలుస్తోంది.
Aftab Poonawalla Shraddha : ఛత్తర్పూర్ ఫ్లాట్లోకి మారిన కొన్ని రోజులకే.. శ్రద్ధను అతి కిరాతకంగా చంపేశాడు పూనావాలా. ఈ విషయంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రద్ధను హత్య చేసేందుకే.. ఆమెను పూనావాలా కొత్త ఫ్లాట్కు తీసుకెళ్లాడా? హిమాచల్ ప్రదేశ్లో కలిసిన వ్యక్తికి.. ఈ కేసుతో సంబంధం ఉందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కుట్ర కోణంలోనూ విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
తాజా సమాచారం ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్లో కలిసిన వ్యక్తిని పోలీసులు విచారించారు.
ఫుడ్ బ్లాగర్..
ముంబైకు చెందిన అఫ్తాబ్ పూనావాలా.. అక్కడే డిగ్రీ చదువుకున్నాడు. అతనొక ఫుడ్ బ్లాగర్ కూడా! అతడికి ఇన్స్టాగ్రామ్లో 28వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు.. కొన్ని వీడియోలు పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు.
Aftab Poonawalla food blog : ఢిల్లీ వెళ్లిన తర్వాత.. శ్రద్ధ, అఫ్తాబ్లు కొన్ని నెలల పాటు ఒకే కాల్ సెంటర్లో పనిచేసినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.
లవ్ జీహాద్ యాంగిల్..!
ఈ పూర్తి వ్యవహరంలో లవ్ జీహద్ కోణం ఉందని శ్రద్ధ తండ్రి ఆరోపించారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిందితుడికి ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులపై తనకు నమ్మకం ఉందని అన్నారు.
నిరంతర పర్యవేక్షణ..
Shraddha Walker Delhi : అఫ్తాబ్ పూనావాలను దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అతడిపై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. సెల్ బయటే ఇద్దరు, ముగ్గురు పోలీసులు కూర్చుని 24/7 అతడిని పర్యవేక్షిస్తున్నారు. మరికొందరు పోలీసులు రౌండ్లు వేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ.. ఓ జాతీయ మీడియాకు దొరికింది.
అఫ్తాబ్ను మరో ఐదు రోజుల వరకు అదే పోలీస్ స్టేషన్లో ఉంచనున్నారు అధికారులు.
సంబంధిత కథనం