Shraddha Aftab : ఫ్రిడ్జ్​లో శ్రద్ధ మృతదేహం.. అక్కడే కొత్త గర్ల్​ఫ్రెండ్​తో..!-shraddhas body parts still at home aftab brought new girlfriend over ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Shraddha's Body Parts Still At Home, Aftab Brought New Girlfriend Over

Shraddha Aftab : ఫ్రిడ్జ్​లో శ్రద్ధ మృతదేహం.. అక్కడే కొత్త గర్ల్​ఫ్రెండ్​తో..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 15, 2022 12:08 PM IST

Shraddha murder case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాల్కర్​ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఫ్రిడ్జ్​లో శ్రద్ధ మృతదేహం ఉండగానే.. నిందితుడు మరో గర్ల్​ఫ్రెండ్​ని ఇంటికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో నిందితుడు
పోలీసుల అదుపులో నిందితుడు (ANI)

Shraddha murder case : దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన శ్రద్ధ వాల్కర్​ మర్డర్​ కేసులో.. సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. శ్రద్ధను చంపిన తర్వాత.. వేరే మహిళను తన ఫ్లాట్​కి అఫ్తాబ్​ తీసుకెళ్లినట్టు సమాచారం. అప్పటికీ.. శ్రద్ధ మృతదేహం ఫ్రిడ్జ్​లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పూర్తి వ్యవహారంలో కుట్ర కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగింది..

ప్రముఖ డేటింగ్​ సైట్ 'బంబుల్​'​ ద్వారా 2019లో శ్రద్ధకు పరిచయమయ్యాడు పునావాలా. వీరిద్దరు ముంబైలోనే ఉండేవారు. మెల్లిగా వీరి మధ్య ప్రేమ చిగురించింది. ముంబైలో నివాసముంటున్న సమయంలోనే అనేకమార్లు వీరిద్దరు విహార యాత్రలకు వెళ్లారు. శ్రద్ధ, పునావాలా ప్రేమను ఆమె ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. ఈ ఏడాది తొలినాళ్లల్లో వీరిద్దరు ముంబైని విడిచిపెట్టి ఢిల్లీకి వెళ్లారు.

shraddha aftab delhi : ఆ తర్వాత శ్రద్ధకు ఆమె కుటుంబసభ్యులు ఫోన్​ చేశారు. కానీ ఫోన్​ కనెక్ట్​ అవ్వలేదు. ఈ నెల 8న.. ఢిల్లీకి వెళ్లారు శ్రద్ధ తండ్రి. ఆమె ఫ్లాట్​కు లాక్​ వేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. శ్రద్ధ అత్యంత కిరాతకంగా హత్యకు గురైందని నిర్ధరించారు. నిందితుడు ఆఫ్తాబ్​ను సోమవారం పట్టుకున్నారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ నిత్యం గొడవ చేసేదని, అందుకే చంపేశానని ఆఫ్తాబ్​ పోలీసులకు చెప్పాడు.

ఫ్రిడ్జ్​లో మృతదేహం..

శ్రద్ధను హత్య చేసిన తర్వాత.. ఆమె మృతదేహాన్ని దాచిపెట్టేందుకు ఓ ఫ్రిడ్జ్​ని కొన్నాడు అఫ్తాబ్​. ఆమె మృతదేహాన్ని 35ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జ్​లో పెట్టాడు. ఆ తర్వాతి 18-20 రోజుల పాటు.. ఒక్కొక్కటిగా తీసుకెళ్లి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.

Man kills live in partner in Delhi : అయితే.. ఈ మధ్యలోనే బంబుల్​ డేటింగ్​ యాప్​లో మరో యువతితో అఫ్తాబ్​కు పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. శ్రద్ధ మృతదేహం ఫ్రిడ్జ్​లో ఉన్నప్పుడే.. కొత్త గర్ల్​ఫ్రెండ్​ను ఆ ఫ్లాట్​కి తీసుకెళ్లేవాడని సమాచారం. ఆ యువతి ఇంటికి వచ్చే కొద్ది సేపటి ముందు.. ఫ్రిడ్జ్​లోని శరీర భాగాలను కబోర్డుల్లో పెట్టేవాడని తెలుస్తోంది.

కుట్ర చేసి చంపేశాడా?

ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లిన తర్వాత శ్రద్ధ, అఫ్తాబ్​లు ఓ ఫ్లాట్​లో ఉండేవారు. మార్చ్​- ఏప్రిల్​ మధ్యలో విహార యాత్రలకు వెళ్లారు. మే నెలలో హిమాచల్​ ప్రదేశ్​కు కూడా వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి.. ఢిల్లీలోని ఛత్తర్​పూర్​లో నివాసముండేవాడు. ట్రిప్​ నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. వీరిద్దరు ఛత్తర్​పూర్​లోని ఓ ఫ్లాట్​లోకి మారారు. హిమాచల్​ ప్రదేశ్​లో కలిసిన వ్యక్తిదే ఈ ఫ్లాట్​ అని తెలుస్తోంది.

Aftab Poonawalla Shraddha : ఛత్తర్​పూర్​ ఫ్లాట్​లోకి మారిన కొన్ని రోజులకే.. శ్రద్ధను అతి కిరాతకంగా చంపేశాడు పూనావాలా. ఈ విషయంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రద్ధను హత్య చేసేందుకే.. ఆమెను పూనావాలా కొత్త ఫ్లాట్​కు తీసుకెళ్లాడా? హిమాచల్​ ప్రదేశ్​లో కలిసిన వ్యక్తికి.. ఈ కేసుతో సంబంధం ఉందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కుట్ర కోణంలోనూ విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

తాజా సమాచారం ప్రకారం.. హిమాచల్​ ప్రదేశ్​లో కలిసిన వ్యక్తిని పోలీసులు విచారించారు.

ఫుడ్​ బ్లాగర్​..

ముంబైకు చెందిన అఫ్తాబ్​ పూనావాలా.. అక్కడే డిగ్రీ చదువుకున్నాడు. అతనొక ఫుడ్​ బ్లాగర్​ కూడా! అతడికి ఇన్​స్టాగ్రామ్​లో 28వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు.. కొన్ని వీడియోలు పోస్ట్​ చేశాడు. ఆ తర్వాత ఒక్క వీడియో కూడా అప్లోడ్​ చేయలేదు.

Aftab Poonawalla food blog : ఢిల్లీ వెళ్లిన తర్వాత.. శ్రద్ధ, అఫ్తాబ్​లు కొన్ని నెలల పాటు ఒకే కాల్​ సెంటర్​లో పనిచేసినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.

లవ్​ జీహాద్​ యాంగిల్..!

ఈ పూర్తి వ్యవహరంలో లవ్​ జీహద్​ కోణం ఉందని శ్రద్ధ తండ్రి ఆరోపించారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిందితుడికి ఉరిశిక్ష పడాలని డిమాండ్​ చేశారు. ఢిల్లీ పోలీసులపై తనకు నమ్మకం ఉందని అన్నారు.

నిరంతర పర్యవేక్షణ..

Shraddha Walker Delhi : అఫ్తాబ్​ పూనావాలను దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్​​ స్టేషన్​లో పెట్టారు. అతడిపై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. సెల్​ బయటే ఇద్దరు, ముగ్గురు పోలీసులు కూర్చుని 24/7 అతడిని పర్యవేక్షిస్తున్నారు. మరికొందరు పోలీసులు రౌండ్లు వేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ.. ఓ జాతీయ మీడియాకు దొరికింది.

అఫ్తాబ్​ను మరో ఐదు రోజుల వరకు అదే పోలీస్​ స్టేషన్​లో ఉంచనున్నారు అధికారులు.

IPL_Entry_Point

సంబంధిత కథనం