Crime : ఫ్రిడ్జ్​లో 50ఏళ్ల వ్యక్తి మృతదేహం.. అసలేం జరిగింది?-delhi crime news man found dead in fridge ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi Crime News Man Found Dead In Fridge

Crime : ఫ్రిడ్జ్​లో 50ఏళ్ల వ్యక్తి మృతదేహం.. అసలేం జరిగింది?

Sharath Chitturi HT Telugu
Jul 23, 2022 05:55 AM IST

Delhi crime news : ఆయన వయస్సు 50ఏళ్లు. భార్య- పిల్లలతో విడిపోయి వేరుగా నివాసముంటున్నాడు. కానీ అనూహ్యంగా.. ఆయన మృతదేహం ఫ్రిడ్జ్​లో కనిపించింది. ఈ ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. అసలేం జరిగింది?

ఫ్రిడ్జ్​లో 50ఏళ్ల వ్యక్తి మృతదేహం.. అసలేం జరిగింది?
ఫ్రిడ్జ్​లో 50ఏళ్ల వ్యక్తి మృతదేహం.. అసలేం జరిగింది? (HT Telugu)

Delhi crime news : ఓ ఇంటి ఫ్రిడ్జ్​లో 50ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆ వ్యవహారం పోలీసులకు సైతం మిస్టరీగానే ఉంది.

ఇదీ జరిగింది..

50ఏళ్ల జాకిర్​.. సీలంపూర్​ ప్రాంతంలోని గౌతంపూరిలో నివాసముంటున్నాడు. కొన్నేళ్లుగా తన భార్య, పిల్లల నుంచి ఆయన వేరుగా ఉంటున్నాడు.

కాగా శుక్రవారం.. జాకిర్​కు తన బంధువు అనేకమార్లు ఫోన్​ చేసింది. ఆయన ఫోన్​ ఎత్తకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలోనే జాకిర్​ ఇంటికి కూడా వెళ్లింది. తలుపు తెరిచి ఇంట్లోకి వెళ్లింది. ఆయన కనిపించలేదు. ఇల్లంతా వెతికింది.

చివరికి.. వంటగదిలోని ఫ్రిడ్జ్​లో.. కుక్కి ఉన్న 50ఏళ్ల జాకిర్​ మృతదేహం కనిపించింది. ఆమె ఒక్కసారిగా షాక్​కు గురైంది. అదే సమయంలో పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫ్రిడ్జ్​లో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ దారుణానికి ఎవరు ఒడిగట్టారు? అన్న విషయం పోలీసులకు ఇంకా తెలియలేదు. కానీ.. ఘటనాస్థలం నుంచి తాము కొన్ని క్లూలు సంపాదించినట్టు, ఘటనపై దర్యాప్తు చేపట్టి నిందితులను శిక్షిస్తామని స్పష్టం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం