Crime : ఫ్రిడ్జ్లో 50ఏళ్ల వ్యక్తి మృతదేహం.. అసలేం జరిగింది?
Delhi crime news : ఆయన వయస్సు 50ఏళ్లు. భార్య- పిల్లలతో విడిపోయి వేరుగా నివాసముంటున్నాడు. కానీ అనూహ్యంగా.. ఆయన మృతదేహం ఫ్రిడ్జ్లో కనిపించింది. ఈ ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. అసలేం జరిగింది?
Delhi crime news : ఓ ఇంటి ఫ్రిడ్జ్లో 50ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆ వ్యవహారం పోలీసులకు సైతం మిస్టరీగానే ఉంది.
ఇదీ జరిగింది..
50ఏళ్ల జాకిర్.. సీలంపూర్ ప్రాంతంలోని గౌతంపూరిలో నివాసముంటున్నాడు. కొన్నేళ్లుగా తన భార్య, పిల్లల నుంచి ఆయన వేరుగా ఉంటున్నాడు.
కాగా శుక్రవారం.. జాకిర్కు తన బంధువు అనేకమార్లు ఫోన్ చేసింది. ఆయన ఫోన్ ఎత్తకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలోనే జాకిర్ ఇంటికి కూడా వెళ్లింది. తలుపు తెరిచి ఇంట్లోకి వెళ్లింది. ఆయన కనిపించలేదు. ఇల్లంతా వెతికింది.
చివరికి.. వంటగదిలోని ఫ్రిడ్జ్లో.. కుక్కి ఉన్న 50ఏళ్ల జాకిర్ మృతదేహం కనిపించింది. ఆమె ఒక్కసారిగా షాక్కు గురైంది. అదే సమయంలో పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫ్రిడ్జ్లో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ దారుణానికి ఎవరు ఒడిగట్టారు? అన్న విషయం పోలీసులకు ఇంకా తెలియలేదు. కానీ.. ఘటనాస్థలం నుంచి తాము కొన్ని క్లూలు సంపాదించినట్టు, ఘటనపై దర్యాప్తు చేపట్టి నిందితులను శిక్షిస్తామని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం