A K Antony to Delhi: ఏకే ఆంటోనీకి అధిష్ఠానం పిలుపు..-cong president summons a k antony to delhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  A K Antony To Delhi: ఏకే ఆంటోనీకి అధిష్ఠానం పిలుపు..

A K Antony to Delhi: ఏకే ఆంటోనీకి అధిష్ఠానం పిలుపు..

HT Telugu Desk HT Telugu
Sep 27, 2022 05:18 PM IST

A K Antony to Delhi: అనూహ్యంగా ఏకే ఆంటోనీకి కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపువచ్చింది.

సోనియా గాంధీకి క్యూఆర్ కోడ్ గల ఓటర్ ఐడీ కార్డు, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ రూపొందించిన ఎలక్టోరల్ కాలేజ్ తుది జాబితా అందజేస్తున్న అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ
సోనియా గాంధీకి క్యూఆర్ కోడ్ గల ఓటర్ ఐడీ కార్డు, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ రూపొందించిన ఎలక్టోరల్ కాలేజ్ తుది జాబితా అందజేస్తున్న అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ (PTI)

తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అభ్యర్థుల వేట సాగుతుండగా, దాదాపుగా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న సీనియర్‌ నేత ఏకే ఆంటోనీకి మంగళవారం అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది.

ఈ రోజు సాయంత్రం రాష్ట్ర రాజధాని నుంచి బయలుదేరి వెళ్లి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారని ఈ పరిణామం గురించి తెలిసిన వర్గాలు తెలిపాయి. మాజీ రక్షణ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆంటోనీ (81) ఎన్నికల రాజకీయాలకు, పార్లమెంటుకు గుడ్ బై చెప్పి ఈ ఏడాది మార్చిలో రాష్ట్రానికి వచ్చారు.

‘పార్టీ అధ్యక్షురాలు అతడిని త్వరగా దేశ రాజధానికి చేరుకోవాలని అభ్యర్థించారు. రాజస్థాన్‌లో ప్రతిష్టంభనను పరిష్కరించడానికి సోనియా గాంధీ తన సహాయాన్ని కోరినట్లు తెలుస్తోంది..’ అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.

ఆంటోనీ పార్టీలో అత్యున్నత స్థాయి శ్రేణి నాయకులలో ఒకరిగా, క్లీన్ ఇమేజ్‌ ఉన్న నేతగా పేరుగాంచారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ఇస్తున్న శాసనసభ్యులు.. సచిన్ పైలట్‌ను సీఎం చేస్తే మూకుమ్మడిగా రాజీనామా చేస్తానని బెదిరించడంతో పార్టీ అధ్యక్ష పదవికి పోటీ రసవత్తరంగా మారింది. వారిని శాంతింపజేయడానికి పార్టీ పరిశీలకులు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు విఫలమయ్యాయని జైపూర్ నుండి వార్తలు వెలువడ్డాయి.

IPL_Entry_Point