Shakuntalam Trailer Launch Event: శాకుంతలం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత
Shakuntalam Trailer Launch Event: చాలా కాలం తర్వాత శాకుంతలం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ద్వారా మీడియా ముందుకొచ్చింది సమంత. ఈ వేడుకలో ఎమోషనల్ అయిన సమంత కన్నీళ్లు పెట్టుకున్నది.
Shakuntalam Trailer Launch Event: మయో సైటిస్ కారణంగా గత కొన్నాళ్లుగా సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్కు దూరంగా ఉంటోంది సమంత (Samantha). సోషల్ మీడియాకు కూడా గ్యాప్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత తొలిసారి ఆమె మీడియా ముందుకొచ్చింది. శాకుంతలం సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్నది.
ఈ సినిమాకు సమంత అసలైన హీరో అంటూ గుణశేఖర్ (Gunashekar)చెప్పిన మాటలతో సమంత ఎమోషనల్ అయ్యింది. శాకుంతలం ప్రయాణంలో ఎదురైన కష్టాలను తల్చుకుంటూ గుణశేఖర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడితో పాటు సమంత కూడా స్టేజ్పైనే ఏడ్చేసింది. ఈ వేడుకలో శాకుంతల రిలీజ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని సమంత అన్నది.
ఓపిక లేకపోయినా శక్తినంతా కూడగట్టుకొని ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు రావాల్సిందే అని ఫిక్స్ అయ్యానని సమంత అన్నది. గుణశేఖర్ మీద ఉన్న గౌరవంతో ఈ వేడుకు వచ్చానని సమంత తెలిపింది. కొందరికి లైఫ్లో సినిమా ఒక భాగంగా ఉంటుందని, కానీ గుణశేఖర్కు లైఫ్ మొత్తం సినిమానే అని సమంత చెప్పింది.
శాకుంతలం సినిమాను గుణశేఖర్ ప్రాణం పెట్టి తీశారని అన్నది. కథ విన్న తర్వాత అది స్క్రీన్పై ఆవిష్కృతం అయ్యే విషయంలో కొన్ని సార్లు మాత్రమే ఎక్స్ట్రా మ్యాజిక్ జరుగుతుందని, శాకుంతలం విషయంలో అది జరిగిందని సమంత అన్నది. తాను ఊహించిన దానికంటే ఎన్నో రేట్లు సినిమా అద్భుతంగా వచ్చిందని తెలిపింది. ఎలాంటి లిమిట్స్, క్యాలికులేషన్స్ లేకుండా దిల్రాజు శాకుంతలం ప్రయాణంలో భాగమయ్యారని అన్నది.
ఈ వేడుకలో దిల్రాజు (Dil Raju) మాట్లాడుతూ అన్ని భాషల ఆడియెన్స్కు రీచ్ అయ్యేలా ఐదు లాంగ్వేజ్లో శాకుంతలం సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పాడు. బ్యూటీఫుల్ ఎపిక్ ఫిల్మ్ ఇదని అన్నాడు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం సమంతతో పాటు గుణశేఖర్కు దక్కుతుందని చెప్పాడు.
శాకుంతల సినిమాకు అసలైన హీరో సమంత అని గుణశేఖర్ చెప్పాడు. సినిమా వెనుక ఉన్న హీరో దిల్రాజు అని చెప్పాడు. ఈ వేడుకలో దేవ్ మోహన్ పాల్గొన్నాడు. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో సమంత కళ్లద్ధాలు ధరించి చేతిలో జపమాలతో కనిపించింది.
కాగా శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలచేయబోతున్నారు. ఈ సినిమాను దిల్రాజుతో కలిసి గుణశేఖర్ తనయ నీలిమ గుణశేఖర్ నిర్మిస్తోంది. మోహన్బాబు, గౌతమి కీలక పాత్రలు పోషిస్తున్నారు.