Nithin: పవన్ కల్యాణ్ డైరెక్టర్తో నితిన్ మూవీ
టాలీవుడ్ యంగ్ హీరో ఈ మధ్యే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్.. ఇప్పుడు పవన్ కల్యాణ్ డైరెక్టర్తోనూ ఓ సినిమా చేయనున్నాడు.
ఎప్పుడో 20 ఏళ్ల కిందట జయం మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు నితిన్. ఆ సినిమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత దిల్, సై, ఇష్క్లాంటి హిట్స్ సాధించాడు ఈ యంగ్ హీరో. ఇష్క్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సినిమా ఇవ్వలేకపోయాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే మాస్ ఎంటర్టైనర్లో నితిన్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.
ఈ సినిమా ఓవైపు నడుస్తుండగానే వక్కంతం వంశీ మూవీ షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఇక సురేందర్ రెడ్డితోనూ నితిన్ మరో సినిమా చేసే ప్లాన్లో ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లనుంది. అయితే ఇన్ని ప్రాజెక్టులు చేతిలో ఉన్న నితిన్.. ఇప్పుడు పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ డైరెక్టర్ సాగర్ కే చంద్ర డైరెక్షన్లోనూ నటించడానికి సిద్ధమవుతున్నాడు.
భీమ్లా నాయక్తో తొలి సినిమాతోనే పెద్ద హిట్ అందుకున్నాడు సాగర్. అయితే ఆ సినిమాకు మాటలు, స్క్రీన్ప్లే అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువ క్రెడిట్ దక్కించుకున్నాడు. దీంతో ఇప్పుడు తన తర్వాతి మూవీతో తనను తాను మరోసారి నిరూపించుకోవాలని సాగర్ తహతహలాడుతున్నాడు. ఈ మూవీపై నితిన్ కూడా పాజిటివ్గా స్పందించాడు.
సాగర్ చంద్ర స్క్రిప్ట్ తనకు నచ్చినట్లు నితిన్ తెలిపాడు. దీంతో వీళ్లిద్దరూ తమ సినిమా షూటింగ్ను సెప్టెంబర్లో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్