Ninne Chusthu pre Release Event: ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అని చాటి చెప్పే 'నిన్నే చూస్తు'.. ఎప్పుడొస్తుందంటే?-ninne chusthu pre release event held in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ninne Chusthu Pre Release Event Held In Hyderabad

Ninne Chusthu pre Release Event: ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అని చాటి చెప్పే 'నిన్నే చూస్తు'.. ఎప్పుడొస్తుందంటే?

Maragani Govardhan HT Telugu
Oct 22, 2022 10:43 PM IST

Ninne Chusthu pre Release Event: ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అనే కథాంశంతో రానున్న చిత్రం ‘నిన్నే చూస్తు’. ఇందులో శ్రీకాంత్, హేమలతా రెడ్డి హీరో హీరోయిన్లుగా చేశారు. సుమన్, సుహాసిని, భానుచందర్ లాంటి సీనియర్ నటులు ఇందులో నటించారు.

నిన్నే చూస్తు
నిన్నే చూస్తు

Ninne Chusthu pre Release Event: శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), హీరోహీరోయిన్లుగా, కే. గోవర్ధనరావు దర్శకత్వంలో రానున్న చిత్రం నిన్నే చూస్తు. వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై పోతిరెడ్డి హేమలత రెడ్డి ఈ చిత్రం నిర్మించారు”. రమణ్ రాథోడ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, ఈ పాటలలోని రిధమ్స్ , బీట్స్‌ కు ప్రేక్షకుల నుండి విశేషంగా ఆదరణ లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 27 న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర యూనిట్ ‘నిన్నే చూస్తు’ ప్రి రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ నటులు సుమన్, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, నిర్మాత రామ సత్యనారాయణ లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

సీనియర్ యాక్టర్ సుమన్ మాట్లాడుతూ.. "నాకు ఫోన్ చేసి సినిమా డేట్స్ కావాలన్నప్పుడు నేను బిజీగా ఉన్నా నాకున్న డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇచ్చాను. నేను చిన్న సినిమాల నుంచి హీరోగా ఎదిగాను. ఇక్కడే యాక్టింగ్, డ్యాన్స్ ఇలా అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను. నటి, నిర్మాత హేమలత రెడ్డి చాలా యంగ్ అండ్ డైనమిక్ లేడీ తను సుహాసిని, భానుచందర్ లాంటి పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని సినిమాలో నటిస్తూనే నిర్మాతగా సినిమాను చాలా చక్కగా డీల్ చేసింది. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచీ ప్రమోషన్ లో కాని, బడ్జెట్ లో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ పుట్ వచ్చేలా సినిమా తీయడం జరిగింది.ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను" అని అన్నారు

చిత్ర హీరోయిన్, నిర్మాత పోతిరెడ్డి హేమలత రెడ్డి మాట్లాడుతూ.. "మా సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో ఈ చిత్రాన్ని చిత్రీకరించాలనే మంచి కథతో నాకు ఇష్టమైన హీరో సుమన్, భానుచందర్, సుహాసిని, షియాజి సిండే, కిన్నెర లతో కలిసి మంచి సినిమా చెయ్యాలని ఇండస్ట్రీకి వచ్చిన నాకు వారెంతో అండగా నిలిచారు. వీరితో పాటు దర్శకుడు గోవర్ధన్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ్ ఇలా అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా పూర్తిచేయగలిగాము. ఇందులో ఉన్న ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయి." అని స్పష్టం చేశారు.

చిత్ర దర్శకుడు కె గోవర్ధన్ రావు మాట్లాడుతూ.. "ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని చెప్పే మంచి ప్రేమకథా చిత్రం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత హేమలత రెడ్డికి ధన్యవాదాలు. కరోనా కు ముందు స్టార్ట్ అయిన ఈ సినిమా కొంత షూట్ చేసిన తరువాత కరోనా రావడంతో షూట్ ఆగిపోయింది. ఆ తర్వాత మేము చాలా ఇబ్బందులు పడ్డా మాకు నిర్మాత సపోర్ట్ గా నిలిచింది. చివరకు ఈ నెల 27న సినిమా రిలీజ్ డేట్ సెట్ అయ్యింది. మంచి కంటెంట్ తో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్