Jetty Movie Trailer: జెట్టి సినిమాలో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి.. దర్శకుడు గోపీచంద్ మలినేని స్పష్టం
Jetty Movie Trailer: మాన్యం కృష్ణ హీరోగా, నందితా శ్వేతా హీరోయిన్గా నటించిన తాజా చిత్రం జెట్టి. ఈ సినిమాకు సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని లాంచ్ చేశారు.
Jetty Movie Trailer: వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్పై వేణు మాధవ్ కే నిర్మాతగా, సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో రూపొందిన చిత్రం జెట్టి. మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన ఈ చిత్రంలో శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. జెట్టి మూవీ ట్రైలర్ను సక్సెస్ పుల్ దర్శకుడు మలినేని గోపీచంద్ వీరసింహారెడ్డి సెట్స్ లో లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. "జెట్టి ట్రైలర్లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి. చాలా రియలిస్టిక్ అప్రోచ్తో మత్య్సకారుల జీవితాలను తెరమీదకు తెచ్చిన విధానం బాగుంది. ఈ కథలో మట్టివాసనలు తెలుస్తున్నాయి. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. పాటలు కూడా మంచి విజయం సాధించాయి అని తెలసింది. ఈ సినిమాతో పరిచయం అవుతున్న హీరో కృష్ణకు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుకకు నా అభినందనలు" అని తెలిపారు.
హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ: మా ట్రైలర్ లాంచ్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి థ్యాంక్స్. చాలా కొత్త నేపథ్యం లో ఈ సినిమా ఉంటుంది. దూరం కరిగినా సాంగ్ మా సినిమాకు మంచి హైప్ ని తెచ్చింది. మత్య్స కారుల జీవితాలను ఆవిష్కరించిన ఈ సినిమా లో అందమైన ప్రేమకథతో పాటు తండ్రి కూతుళ్ళ మద్య బలమైన ఎమోషన్స్ ఉంటాయి. నందిత శ్వేత గారితో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక ఈ కథను మలిచిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది" అని అన్నారు..
దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక మాట్లాడుతూ.. "తీర ప్రాంతంలో ఒక జీవిన విధానం ఉంటుంది. వారి సమస్యలు కట్టుబాట్లు చాలా పటిష్టంగా ఉంటాయి. అలాంటి నేపథ్యం లో తీసిన జెట్టి కథ తప్పకుండాప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ను అందింస్తుంది. ఆడియెన్స్ నుంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాను. మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి ధన్యవాదాలు" అని అన్నారు.
సంబంధిత కథనం