Guppedantha Manasu May 31st Episode: శైలేంద్రకు జ‌గ‌తి వార్నింగ్‌- వ‌సుధార‌ను క్ష‌మించ‌కూడ‌ద‌ని రిషి నిర్ణ‌యం-guppedantha manasu may 31st episode mahendra disappoints jagathis behaviour ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu May 31st Episode Mahendra Disappoints Jagathis Behaviour

Guppedantha Manasu May 31st Episode: శైలేంద్రకు జ‌గ‌తి వార్నింగ్‌- వ‌సుధార‌ను క్ష‌మించ‌కూడ‌ద‌ని రిషి నిర్ణ‌యం

HT Telugu Desk HT Telugu
May 31, 2023 08:30 AM IST

Guppedantha Manasu May 31st Episode: రిషి ఇంటి నుంచి వెళ్లిపోవ‌డానికి జ‌గ‌తినే కార‌ణ‌మ‌ని అనుకొని ఆమెపై కోపంతో ర‌గిలిపోతుంటాడు మ‌హేంద్ర‌. మ‌రోవైపు కాలేజీ ఎండీ సీట్‌ను శైలేంద్ర‌కు ఇవ్వ‌మ‌ని జ‌గ‌తిని దేవ‌యాని బెదిరిస్తుంది. కానీ ఆమె బెదిరింపుల‌కు జ‌గ‌తి భ‌య‌ప‌డ‌దు.

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu May 31st Episode: భ‌ర్త మ‌హేంద్ర కూడా త‌న‌ను అపార్థం చేసుకోవ‌డంతో జ‌గ‌తి బాధ‌ప‌డుతుంది. శైలేంద్ర చేస్తోన్న దారుణాల గురించి అత‌డికి చెప్పాల‌ని అనుకుంటుంది. కానీ నిజం చెబితే మ‌హేంద్ర‌ను చంపేస్తాన‌ని శైలేంద్ర బెదిరిస్తాడు. మ‌రోవైపు రిషిని చంపాల‌ని శైలేంద్ర నిశ్చ‌యించుకుంటాడు. రౌడీల‌ను పంపిస్తాడు. కానీ మ‌ధ్య‌లో ఓ యువ‌తి వ‌చ్చి రౌడీల ప్లాన్ చెడ‌గొడుతుంది.

ఆమె రిషిని పేరు పెట్టి పిలుస్తుంది. కానీ రిషి మాత్రం ఆమెను గుర్తుప‌ట్ట‌డు. త‌న పేరు ఏంజెల్ అని చెబుతుంది. ఇంట‌ర్‌మీడియ‌ట్, డిగ్రీ క‌లిసి చ‌దువుకున్నామ‌ని అంటుంది. ఇద్ద‌రి రూల్ నంబ‌ర్స్ ప‌క్క‌ప‌క్క‌నే అని చెబుతుంది. ఎక్క‌డుంటున్నావు, ఎక్క‌డినుంచి వ‌స్తున్నావ‌ని ఆమె రిషిని అడుగుతుంది. కానీ రిషి మాత్రం స‌మాధానం చెప్ప‌కుండా డ‌ల్‌గా ఉంటాడు. అత‌డి మౌనం చూసి ఏంజెల్‌కు అనుమానం వ‌స్తుంది. ఏంజెల్ త‌న విజిటింగ్ కార్డ్‌ను రిషికి ఇచ్చి మ‌నం మ‌ళ్లీ క‌లుద్దామ‌ని అంటుంది.

జ‌గ‌తిని అపార్థం చేసుకున్న మ‌హేంద్ర‌...

రిషి ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డంతో మ‌హేంద్ర బాధ‌లో మునిగిపోతాడు. రిషితో సంతోషంగా గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తుచేసుకుంటుంటాడు. అత‌డికి జ‌గ‌తి టీ ఇవ్వ‌డానికి వ‌స్తుంది. కానీ కోపంతో ఆ టీ క‌ప్‌ను విసిరికొడ‌తాడు మ‌హేంద్ర‌. రిషిని కాలేజీ నుంచి పంపించ‌డానికి కార‌ణం ఏమిటి? ఇక్క‌డ జ‌రుగుతున్న‌వ‌న్నీ నాకు ఎందుకు చెప్ప‌లేదు? దాచిపెట్ట‌డానికి కార‌ణం ఏమిట‌ని సీరియ‌స్‌గా అడుగుతాడు. కానీ శైలేంద్ర ఇచ్చిన వార్నింగ్ వ‌ల్ల అత‌డికి నిజం చెప్ప‌లేక క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో మ‌హేంద్ర కోపం మ‌రింత పెరుగుతుంది. నిజం చెప్ప‌డం లేదంటే నువ్వే ఏదో త‌ప్పు చేశావ‌ని అర్థ‌మ‌వుతుంద‌ని జ‌గ‌తితో అంటాడు.

జ‌గ‌తి మౌనం..

నిజం తెలియ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని అతడితో అంటుంది జగతి. ఏంటి మంచిది? రిషి దూరం కావ‌డం మంచి విష‌య‌మా? నువ్వు చిన్న‌ప్పుడు రిషిని వ‌దిలిపెట్టినా క్ష‌మించి ఇంటికి తీసుకొచ్చాడు. అలాంటి వాడిని ఇంట్లో నుంచి వెళ్ల‌గొట్టావు. రిషి ఇంట్లో లేడంటే భ‌రించ‌లేక‌పోతున్నాన‌ని కోపంగా అంటాడు. రిషికి తాను బ‌ర్త్‌డే విషెస్ చెప్ప‌కుండా ఏ బ‌ర్త్‌డే జ‌ర‌గ‌లేద‌ని మ‌హేంద్ర ఎమోష‌న‌ల్ అవుతాడు.

ఫ‌స్ట్ టైమ్ ఇప్పుడిలా జ‌రిగింది. నువ్వు వ‌సుధార క‌లిసి రిషికి మంచి బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చార‌ని ఫైర్ అవుతాడు. క‌నీసం వ‌సుధార ఎక్క‌డుందో అదైనా తెలుసా అని జ‌గ‌తిని అడుగుతాడు మ‌హేంద్ర‌. తెలియ‌ద‌ని జ‌గ‌తి అత‌డికి స‌మాధాన‌మిస్తుంది. ముందు తెలుసుకో...ఆమెకు ఫోన్ చేయ‌మ‌ని అంటాడు.

టెన్ష‌న్‌లో వ‌సుధార‌...

జ‌గ‌తి కార‌ణంగా రిషి త‌న‌ను వ‌దిలిపెట్టి వెళ్లిపోవ‌డం, అమ్మ హాస్పిట‌ల్‌లో చేర‌డంతో ఆమె కాల్ అంటెప్ట్ చేయ‌డానికి వ‌సుధార ఇష్ట‌ప‌డ‌దు. జ‌గ‌తి నిజం చెప్ప‌క‌పోవ‌డం, వ‌సుధార ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో మ‌హేంద్ర అస‌హ‌నానికి గుర‌వుతాడు. బ‌ర్త్‌డే రోజు రిషికి మ‌ర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చామ‌ని వ‌సుధార క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. బ‌ర్త్‌డే రోజు మ‌హేంద్ర‌కు రిషిని దూరం చేసినందుకు బాధ‌ప‌డుతుంది.

త‌ప్పు అని తెలిసినా త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో చేయాల్సివ‌చ్చింద‌ని వ‌సుధార అనుకుంటుంది. మిమ్మ‌ల్ని దోషిని చేయాల‌న్న‌ది మా ఉద్దేశం కాదు. మీ క్షేమం కోస‌మే త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మ‌న‌సులోనే బాధ‌ప‌డుతుంది. మిమ్మ‌ల్ని శిక్షంచి త‌ప్పు చేశాన‌ని, అబ‌ద్ధం చెప్ప‌కుండా తాను ప్రాణాల‌ను తీసుకున్న బాగుండేద‌ని వ‌సుధార అన‌కుంటుంది.

వ‌సుధార‌ను క్ష‌మించ‌న‌ని చెప్పిన రిషి...

రిషి కూడా ఒంట‌రిగా కూర్చొని ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. ప్ర‌తి బ‌ర్త్‌డేకు తండ్రి త‌న‌ను స‌ర్‌ప్రైజ్ చేసేవాడ‌ని, ఈసారి మాత్రం న‌మ్మిన వాళ్లే స‌ర్‌ప్రైజ్ చేశార‌ని, న‌న్ను దోషిని చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని రిషి ఆలోచిస్తుంటాడు. నిర్ణ‌యం తీసుకునే ముందు ఒక్క‌సారి త‌న‌కు చెబితే స‌రిపోయేద‌ని, ఎందుకు న‌న్ను దోషిని చేశార‌ని ఆలోచనలతో స‌త‌మ‌త‌మ‌వుతుంటాడు. న‌న్ను ఇలా శిక్షించ‌డం కంటే డైరెక్ట్‌గా చంపేస్తే బాగుండున‌ని రిషి అనుకుంటాడు. అన‌వ‌స‌ర‌మైన వాళ్ల గురించి ఆలోచించ‌డం వేస్ట్ అని డిసైడ్ అవుతాడు. జీవితంలో వ‌సుధార‌, జ‌గ‌తిల‌ను క‌ల‌వ‌కూడ‌ద‌ని, క్ష‌మించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంటాడు.

శైలేంద్ర‌కు జ‌గ‌తి వార్నింగ్‌...

జ‌గ‌తి కాలేజీకి వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. ఆమెకు ఎదురుప‌డిన దేవ‌యాని మాట‌ల‌తోనే హింసించ‌డం మొద‌లుపెడుతుంది. నీ వ‌ల్లే రిషి కాలేజీ, ఇల్లు వ‌దిలివెళ్లిపోయాడ‌ని, ఆ బాధ లేకుండా కాలేజీకి ఎలా వెళ్తున్నావ‌ని అంటుంది. త‌ప్పు చేసిన వాళ్ల‌కు బాధ‌లేదు. రిషి ఎవ‌రి మాట‌కైతే విలువ ఇస్తాడో వాళ్లే ఊస‌ర‌వెళ్లిలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, ఏదో ఒక రోజు నిజం బ‌య‌ట‌ప‌డ‌క‌పోదు. వాళ్ల ముసుగు బ‌య‌ట‌ప‌డ‌క‌పోదు అని క‌ఠినంగా దేవ‌యానికి స‌మాధానం చెబుతుంది జ‌గ‌తి.

ఆ రోజు నా బాధ ఏమిటో? నా కొడుకు విలువ ఏమిటో అంద‌రికి తెలుస్తుంద‌ని అంటుంది. అది జ‌ర‌గ‌నివ్వ‌న‌ని శైలేంద్ర అంటాడు. ఎలాగైనా నా కొడుకు ఎండీ సీట్‌లో కూర్చోవాల‌ని జగతితో దేవ‌యానికి అంటుంది. మ‌న ఆశ‌కు హ‌ద్దు ఉండాలి. ఇష్ట‌ప‌డ్డ‌దాని కోసం క‌ష్ట‌ప‌డాలి. మ‌నుషుల మీద అభియోగాలు మోపి, ప్ర‌మాదాలు సృష్టిస్తే ఇలాగే ఉంటుంద‌ని అంటుంది. కానీ దేవ‌యాని ఆమె మాట‌ల‌ను తేలిక‌గా తీసుకుంటుంది.

బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ని జ‌గ‌తి...

అవ‌న్నీ మాకు అన‌వ‌స‌రం. నువ్వు ఎండీ సీట్ నుంచి త‌ప్పుకోవాలి. ఆ సీట్ శైలేంద్ర‌కు నువ్వే అప్ప‌చెప్పాల‌ని జగతిని దేవయాని బెదిరిస్తుంది. నేను మీ మాట‌లు వింటాను. మీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌తాన‌ని ఎలా అనుకుంటున్నార‌ని రివ‌ర్స్ అవుతుంది జ‌గ‌తి. ఇంత‌కుముందు కొన్ని సంవ‌త్స‌రాలు రిషికి న‌న్ను దూరం చేశావు. ఇప్పుడు ఇద్ద‌రు క‌లిసి నా కొడుకును నేనే కాలేజీ నుంచి వెళ్ల‌గొట్టేలా చేశారు. రిషి క్షేమం కోసం నాలో నేనే కుమిలిపోయా. ఇప్పుడు రిషి నా క‌ళ్ల ముందు లేకుండా ఎక్క‌డో ఒక చోట క్షేమంగా ఉంటాడు.

ఇంకా నేను మీకు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని రివ‌ర్స్ వార్నింగ్ ఇస్తుంది. అంటే ఎండీ స్థానంలో మీరే ఉంటార‌ని అంటారా అని శైలేంద్ర...జ‌గ‌తిని అడుగుతాడు. అందులో మ‌రే మాట లేద‌ని జ‌గ‌తి చెబుతుంది. ప‌ద‌వి కోస‌మే రిషిని వెళ్ల‌గొట్టి ఎండీ సీట్‌లో కూర్చున్నావ‌ని మేనేజ్‌మెంట్ అనుకునే ప్ర‌మాదం ఉంద‌ని, నీ మేలు కోరి చెబుతున్నా ఆ సీట్‌ను శైలేంద్ర‌కు ఇవ్వ‌మ‌ని దేవ‌యాని అంటుంది. ఆమె తీయ‌ని మాట‌ల‌కు జ‌గ‌తి లొంగ‌దు. నా మ‌న‌సు చంపుకొని నా బిడ్డ మీద అంద‌రి ముందు చెర‌గ‌ని మ‌చ్చ‌వేశాను.

రిషి కోసం మ‌హేంద్ర ఆరాటం...

ఇప్పుడు కాలేజీ కోసం ఎన్ని అవ‌మానాలైన భ‌రిస్తాన‌ని, అంతే త‌ప్ప కాలేజీ బాధ్య‌త‌ల్ని నీ చేతిలో పెట్ట‌న‌ని శైలేంద్ర‌కు బ‌దులిస్తుంది. ఖ‌చ్చితంగా రిషి ఏదో రోజు వ‌స్తాడు. మ‌ళ్లీ ఎండీ సీట్‌లో కూర్చుంటాడు. అప్ప‌టివ‌ర‌కు నేనే ఎండీన‌ని ఆశ‌లు పెట్టుకోక‌ని శైలేంద్ర‌తో చెబుతుంది జ‌గ‌తి.

నా స‌హ‌నం , బాధ మాత్ర‌మే చూశావు. కోపాన్ని చూడాల‌ని అనుకోకు. నీకే మంచిది కాద‌ని శైలేంద్ర‌కు వార్నింగ్ ఇస్తుంది జ‌గ‌తి. ఆ త‌ర్వాత జ‌గ‌తి కాలేజీ వెళ్ల‌డానికి రెడీ అవుతుంది. మ‌హేంద్ర‌ను కాలేజీకి ర‌మ్మ‌ని అడుగుతుంది. కానీ తాను రాన‌ని బ‌దులిస్తాడు.ఆ ఇష్యూను పెద్ద‌ది చేయాల‌ని దేవ‌యాని చూస్తుంది. తాను రిషిని క‌ల‌వ‌డానికి వెళుతున్నాన‌ని మ‌హేంద్ర చెబ‌తాడు.

దేవ‌యాని నాట‌కం...

ఒక‌వేళ రిషి క‌లిస్తే వాడిని ఇంటికి తీసుకొస్తాన‌ని అంటాడు. అత‌డితో వెళ్ల‌డానికి రెడీ అవుతాడు. కానీ జ‌గ‌తిని వ‌ద్ద‌ని అంటాడు మ‌హేంద్ర‌. నేను ఒక్క‌డినే వెళ్లి రిషి బ‌తిమాలి తీసుకొస్తాన‌ని అంటాడు. రిషి ఇంట్లో ఉంటేనే సంతోషంగా ఉంటుంద‌ని, అత‌డు తిరిగి ఇంటికి వ‌స్తే బాగుంటుంద‌ని ఫ‌ణీంద్ర అంటాడు.

రిషి రావాల‌ని దేవుడిని ప్ర‌తి క్ష‌ణం కోరుకుంటున్నాన‌ని భ‌ర్త ముందు నాట‌కం ఆడి మంచి మార్కులు కొట్టేస్తుంది దేవ‌యాని. రిషి తిరిగి ఇంటికొస్తే తాను ఎప్ప‌టికీ డీబీఎస్‌టీ కాలేజీకి ఎండీని కాలేన‌ని శైలేంద్ర భ‌య‌ప‌డ‌తాడు. ఇప్పుడు ఏం చేద్ధామ‌ని దేవ‌యాని అత‌డికి అడుగుతుంది. ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు అనుకున్న‌వ‌న్నీ ఖ‌చ్చితంగా జ‌రిగి తీరుతాయ‌ని దేవ‌యానితో శైలేంద్ర చెప్ప‌గానే నేటి గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point