Guppedantha Manasu May 2nd Episode: తండ్రికి క్యాబిన్ లేదంటూ శైలేంద్ర అసహనం - రిషికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన వసుధార
Guppedantha Manasu May 2nd Episode: శైలేంద్ర ఫోన్ రిషి చేతిలో ఉన్న సమయంలో అతడికి సౌజన్యరావు నుంచి కాల్ వస్తుంది. దాంతో తాను ఎక్కడ దొరికిపోతానో అని శైలేంద్ర కంగారు పడతాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్లో ఏ జరిగిందంటే....
Guppedantha Manasu May 2nd Episode: మెడికల్ కాలేజీ లోగోను రిషి తన చేతి ఓపెన్ చేయిస్తాడని శైలేంద్ర కలలుకంటాడు. కానీ అతడికి షాకిస్తూ జగతి, వసుధార ఆ మెడికల్ కాలేజీ లోగోను ఓపెన్ చేయాలని రిషి అనౌన్స్చేస్తాడు. కానీ వసుధార మాత్రం రిషి ఇచ్చిన స్ఫూర్తి వల్లే ఇదంతా చేయగలిగామని, అతడు ఓపెన్ చేయడమే కరెక్ట్ అని పట్టుపడుతుంది. చివరికి జగతి, రిషి, వసుధార కలిసి కాలేజీ లోగోను ఓపెన్ చేస్తారు. ముగ్గురి ఆనందం, కాలేజీలో రిషికి ఉన్న పేరు ప్రఖ్యాతులు చూసి శైలేంద్ర తట్టుకోలేకపోతాడు.
వసుధార అడ్డు తొలగిస్తే...
జగతి, వసుధారలను అడ్డుతప్పిస్తే రిషి అంతు చూడొచ్చు అని మనసులోనే అనుకుంటాడు. లోగో బాగుందని వసుధారను మెచ్చుకుంటాడు రిషి. అందరూ ఆ రూమ్ నుంచి వెళ్లిపోతారు. రిషి, వసుధార మాత్రమే అక్కడే ఉండిపోతారు. నా గుర్తుగా మీకు ఒక్కటి ఇవ్వాలి అంటూ రిషితో అంటుంది వసుధార. కానీ నేను ఇచ్చే బహుమతి మీకు నచ్చుతుందో లేదో అని సందేహపడుతుంది.
నువ్వే నా దానివి అయ్యావు. అంతకన్నా ప్రత్యేకత ఏముటుంది వసుధార అంటూ వసుధారపై ప్రేమను ఒలకబొస్తాడు రిషి. ఎప్పుడు మన ఇష్టాలు వేర్వేరు కాదు అంటాడు. అతడికి బ్రేస్లెట్ గిఫ్ట్గా ఇస్తుంది. ఏ పని చేసినా మీకు నేను గుర్తు రావాలి అందుకే ఈ గిఫ్ట్ ఇచ్చానని అంటుంది. ఆమె మాటలకు ఈ బ్రేస్ లెట్ ఉన్నా లేకపోయినా నువ్వు ప్రతి క్షణం నాకు గుర్తొస్తూనే ఉంటావని రిషి అంటాడు. అతడి మాటలకు వసుధార సంతోషంలో మునిగిపోతుంది.
శైలేంద్రకు ఫోన్ చేసిన సౌజన్యరావు...
మెడికల్ కాలేజీ బిల్డింగ్, ఆడ్మిషన్ పనుల గురించి శైలేంద్రకు వివరిస్తుంటాడు రిషి. ఆ సమయంలో శైలేంద్ర ఫోన్ రిషి చేతిలో ఉంటుంది. ఇంతలోనే అతడికి సౌజన్యరావు ఫోన్ చేస్తాడు. దాంతో తాను ఎక్కడ దొరికిపోతానో అని శైలేంద్ర కంగారుపడిపోతాడు. రిషి నుంచి దూరంగా వెళ్లిపోయి సౌజన్యరావుపై ఫైర్ అవుతాడు. రిషి లెక్కలు అన్ని సరి చేస్తానని అతడితో చెబుతాడు.
శైలేంద్ర మాటలను వసుధార వింటుంది. ఆమె తన పక్కన ఉండటం చూసి శైలేంద్ర కంగారు పడతాడు. ఫోన్ ఎవరి నుంచి వచ్చిందని వసుధార అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి తడబడిపోతాడు. అక్కడి నుంచి తొందరగా వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. రిషి ఎండలో ఉండటంతో అతడికి గొడుగు పడుతుంది వసుధార. మరో గొడుగును శైలేంద్ర చేతికి ఇస్తుంది. దాంతో వసుధారకు అతిథి మర్యాదలు బాగా తెలుసు అంటూ ఆమెపై సెటైర్ వేస్తాడు శైలేంద్ర.
తండ్రికి క్యాబిన్ కావాలని...
ఆ తర్వాత ముగ్గురు కలిసి ఫణీంద్ర, మహేంద్రలను కలుస్తారు. వారి ముందు రిషి కాలేజీని బాగా నడుపుతున్నాడంటూ అతడి ప్రశంసలు కురిపిస్తూ నాటకం ఆడతాడు శైలేంద్ర. రిషిని ఎండీ అంటూ పిలిచి తనలో ఉన్న అక్కసును బయటపెడతాడు. ఎవరికీ ఇచ్చే గౌరవం వాళ్లకు ఇవ్వాలి అంటూ చెబుతాడు. అతడి మాటలు రిషితో పాటు అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కావు.
ఆ తర్వాత కాలేజీలో అందరికి క్యాబిన్స్ ఉండి తన తండ్రి ఫణీంద్రకు క్యాబిన్ ఎందుకు లేదని ప్రశ్నిస్తాడు. ఫణీంద్ర సర్ధిచెప్పడానికి ప్రయత్నించినా శైలేంద్ర మాత్రం అతడి మాట వినడు. దాంతో తన క్యాబిన్ను ఫణీంద్రకు ఇవ్వాలని జగతి డిసైడ్ అవుతుంది. కానీ ఫణీంద్ర మాత్రం ఒప్పుకోడు.
ఎండీ సీట్లో శైలేంద్ర..
తనకు క్యాబిన్ అవసరమైతే రిషినే తన సీట్ ను నాకు ఇచ్చేస్తాడని సరదాగా ఫణీంద్ర అంటాడు. అతడి మాటలకు మీతో పాటు అన్నయ్యకు కూడా సీట్ ఇవ్వడానికి నేను ఎప్పుడూ రెడీనే అంటూ రిషి సమాధానం చెబుతాడు. అక్కడితో ఆగకుండా శైలేంద్రను తన ఎండీ సీట్లో కూర్చొబెడతాడు.
రిషి సీట్లో శైలేంద్ర కూర్చొవడం వసుధారతో పాటు జగతికి నచ్చదు. ఈ రోజు సీట్ మారింది.రేపు నేమ్ బోర్డ్ మార్చేస్తాను అంటూ మనసులోనే రిషిపై రివేంజ్ తీర్చుకోవాలని శైలేంద్ర అనుకుంటాడు. మరోసారి తన మాటలతో ధరణిని దెప్పిపొడుస్తుంది దేవయాని. జగతి, వసుధారలకు దూరంగా ఉండాలని ఆమెకు వార్నింగ్ ఇస్తుంది.
అందరూ వెళ్లిపోయిన తర్వాత రిషిని తన సీట్లో కూర్చొబెట్టిన వసుధార ఈ సీట్లో మీరు తప్ప ఇంకెవరూ కూర్చోకూడదని అంటుంది. ఈ సీట్లో కూర్చొనే అర్హత మీకు మాత్రమే ఉంది అని చెప్పడంతో నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది.