Guppedantha Manasu May 25th Episode: రిషికి ప్రాణభిక్ష పెట్టమని వసుధారను వేడుకున్న జగతి - రిషిధార విడిపోనున్నారా?-guppedantha manasu may 25th episode guppedantha manasu today episode vasudhara breaks down in tears ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu May 25th Episode: రిషికి ప్రాణభిక్ష పెట్టమని వసుధారను వేడుకున్న జగతి - రిషిధార విడిపోనున్నారా?

Guppedantha Manasu May 25th Episode: రిషికి ప్రాణభిక్ష పెట్టమని వసుధారను వేడుకున్న జగతి - రిషిధార విడిపోనున్నారా?

HT Telugu Desk HT Telugu
May 25, 2023 08:29 AM IST

Guppedantha Manasu May 25th Episode: మిష‌న్ ఎడ్యుకేష‌న్ చెక్ విష‌యంలో రిషిపై మినిస్ట‌ర్ సార‌థ్యంలో విచార‌ణ మొద‌ల‌వుతుంది. వ‌సుధార స‌మాధానంపైనే రిషి త‌ప్పు చేశాడా? లేదా? అన్న‌ది ఆధార‌ప‌డి ఉండ‌టంతో నేటి గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ ఆస‌క్తిక‌రంగా మారింది.

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu May 25th Episode: రిషి ప్రాణాల‌తో ఉండాలంటే అత‌డిని కాలేజీకి దూరంగా పంపించ‌డ‌మే మంచిద‌ని జ‌గ‌తి నిర్ణ‌యించుకుంటుంది. మిష‌న్ ఎడ్యుకేష‌న్ ఫండ్స్‌ను రిషి అక్ర‌మంగా వాడాడ‌ని శైలేంద్ర వేసిన నింద‌ల‌ను వ‌సుధార ద్వారా నిజ‌మ‌ని చెప్పించి రిషిని కాలేజీ నుంచి దూరం చేయాల‌ని అనుకుంటుంది. కానీ రిషి గురించి అబ‌ద్దాన్ని చెప్ప‌డానికి వ‌సుధార అంగీక‌రించ‌దు. రిషి త‌న‌ను చాలా న‌మ్ముతాడ‌ని, అత‌డి న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేయ‌లేన‌ని అంటుంది. ప్రాణాల‌ను వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డుతాను కానీ రిషి గురించి అబ‌ద్దం చెప్ప‌న‌ని జ‌గ‌తితో అంటుంది.

ప్రాణ‌భిక్ష పెట్ట‌మ‌ని కోరిన జ‌గ‌తి

రిషి ప్రాణాలు నిల‌బ‌డాలంటే ఈ ఒక్క‌ అబ‌ద్దం చెప్ప‌మ‌ని వ‌సుధార‌ను జ‌గ‌తి క‌న్నీళ్ల‌తో క‌న్వీన్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. గురుద‌క్షిణ‌ క‌ష్టంగా అనిపిస్తే ఓ బిడ్డ‌కు త‌ల్లిగా అడుగుతున్నా...నా కొడుక్కి ప్రాణ భిక్ష పెట్ట‌మ‌ని వ‌సుధార‌ను వేడుకుంటుంది జ‌గ‌తి. రిషి కాలేజీ నుంచి వెళ్లిపోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, అత‌డు ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడ‌ని జ‌గ‌తి చెబుతుంది. అలాంటిది రిషిని తానే కాలేజీ నుంచి వెళ్ల‌గొట్టాల్సివ‌స్తుంద‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ బాధ‌ను భ‌రించ‌లేక‌పోతున్నాన‌ని, ప్ర‌తి క్ష‌ణం న‌ర‌కం అనుభ‌విస్తాన‌ని జ‌గ‌తి మొర‌పెట్టుకుంటుంది.

రిషి సంతోషం కంటే...

నాకు రిషి సంతోషం కంటే అత‌డు బ్ర‌తికి ఉండ‌టం ముఖ్య‌మ‌ని జ‌గ‌తి చెబుతుంది. శైలేంద్ర ఉచ్చు నుంచి రిషి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత ఏం చేయాల‌నేదాని గురించి ఆలోచిద్దామ‌ని అంటుంది. అబ‌ద్ధం చెబితే రిషి త‌న‌ను అస‌హ్యించుకుంటాడ‌ని వ‌సుధార కూడా ఎమోష‌న‌ల్ అవుతుంది. త‌మ బంధానికి తెర‌ప‌డుతుంద‌ని, మ‌ళ్లీ త‌మ‌ మ‌ధ్య దూరం పెరుగుతుంద‌ని, లైఫ్‌లో మ‌ళ్లీ రిషి నా ముఖం కూడా చూడ‌ర‌ని వ‌సుధార అంటుంది.

ఆమె మాట‌ల‌కు రిషి కాలేజీలో ఉంటే శైలేంద్ర అత‌డిని చంపేస్తాడ‌ని జ‌గ‌తి స‌మాధాన‌మిస్తుంది. రిషి ప్రాణాల‌ను కాపాడ‌టానికే ఇదంతా చేస్తున్నామ‌ని, రిషి త‌ప్ప‌కుండా అర్థం చేసుకుంటాడ‌ని వ‌సుధార‌ను క‌న్వీన్స్ చేయ‌డానికి శ‌త‌విధాలా జ‌గ‌తి ప్ర‌య‌త్నిస్తుంది. కానీ వ‌సుధార మాత్రం అబ‌ద్ధం చెప్ప‌డానికి అంగీక‌రించ‌దు. రిషి ప‌రువు కోసం ప్రాణాలు ఇవ్వ‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తాడానిని, ఈ నింద‌తో ప‌రోక్షంగా అత‌డి ప్రాణాల‌ను తీసిన వాళ్ల‌మ‌వుతామ‌ని అంటుంది.

క‌న్నీళ్ల‌కు క‌రిగిపోయిన వ‌సుధార‌...

రిషిని చంప‌డానికి శైలేంద్ర చాలా ప్ర‌య‌త్నాలు చేశాడ‌ని వ‌సుధార‌తో అంటుంది జ‌గ‌తి. ఈ సారి ఖ‌చ్చితంగా రిషి ప్రాణాల‌ను శైలేంద్ర తీస్తాడ‌ని చెబుతుంది. నా కొడుకు ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయ‌ని క‌న్నీళ్ల‌తో వ‌సుధార కాళ్ల‌పై ప‌డ‌టానికి సిద్ధ‌ప‌డుతుంది జ‌గ‌తి. ఆమె క‌న్నీళ్ల‌కు వ‌సుధార క‌రిగిపోతుంది. త‌న‌కు ఇష్టం లేక‌పోయినా అబ‌ద్ధం చెప్ప‌డానికి సిద్ధ‌ప‌డుతుంది.

రిషిని త‌న క్యాబిన్‌కు ర‌మ్మ‌ని మెసేజ్ చేస్తుంది వ‌సుధార‌. రూమ్‌లోకి రిషి అడుగుపెట్ట‌గానే అత‌డిని కౌగిలించుకొని బోరున ఏడ్చేస్తుంది. ఆమె క‌న్నీళ్లు చూసి రిషి కంగారు ప‌డ‌తాడు. ఏమైంద‌ని అడుగుతాడు. కానీ వ‌సుధార మాత్రం మాట్లాడ‌దు. ఏ మ‌నిషికైనా జీవితంలో ఏది ముఖ్య‌మ‌ని రిషిని అడుగుతుంది. ప్రాణం ఉంటేనే పేరు, ప‌ర‌ప‌తి నిల‌బ‌డుతాయి క‌దా అని అంటుంది.

ఆమె మాట‌ల‌కు మిగితా వాళ్ల విష‌యంలో ఏమో కానీ రిషిధార విష‌యంలో ప్రేమే ముఖ్య‌మ‌ని రిషి స‌మాధానం చెబుతాడు. క‌న్నీళ్లు పెట్టుకుంటే చూడ‌లేక‌పోతున్నాన‌ని వ‌సుధార‌ను ఓదార్చుతాడు. త‌న‌ జీవితంలో చాలా సంతోష‌క‌ర‌మైన రోజు ఇద‌ని, ఎందుకు నువ్వు, జ‌గ‌తి మేడ‌మ్ ఇలా కంగారు ప‌డుతున్నార‌ని వ‌సుధార‌ను రిషి అడుగుతాడు. కానీ వ‌సుధార మాత్రం నిజం చెప్ప‌కుండా దాచేస్తుంది. నువ్వు, మేడ‌మ్ నా ప‌క్క‌న ఉండ‌గా నాకు ఎలాంటి ఆప‌ద రాద‌ని రిషి అంటాడు. ఇద్ద‌రు క‌లిసి కాన్ఫ‌రెన్స్ హాల్‌కు వెళ‌తారు.

రిషిపై విచార‌ణ‌...

కాన్ఫ‌రెన్స్ హాల్‌లో మినిస్ట‌ర్‌, ఫ‌ణీంద్ర‌, దేవ‌యాని, శైలేంద్ర‌తో పాటు అంద‌రూ సీరియ‌స్‌గా ఉంటారు.నీ మీద అభియోగం వ‌చ్చింద‌ని రిషితో అంటుంది జ‌గ‌తి. అది నిజ‌మో కాదో తెలియాల‌ని అంటుంది. జ‌గ‌తి మాట‌ల‌కు రిషి షాక్ అవుతాడు. ఒక‌దానికి యూజ్ చేయాల్సిన చెక్‌ను మ‌రోదానికి వాడావ‌ని సార‌థి చేసిన ఆరోప‌ణ గురించి రిషికి జ‌గ‌తి వివ‌రిస్తుంది.

త‌న‌కు మిష‌న్ ఎడ్యుకేష‌న్‌ చెక్ రిషి ఇచ్చాడ‌ని సార‌థి మ‌రోసారి అంద‌రి ముందు అబ‌ద్ధం చెబుతాడు. రిషి అత‌డిపై సీరియ‌స్ అవుతాడు. సార‌థి అబ‌ద్ధం చెబుతున్నాడ‌ని అంటాడు. దేవ‌యాని, శైలేంద్ర...రిషికి స‌పోర్ట్‌గా మాట్లాడుతున్న‌ట్లుగా నాట‌కం ఆడుతారు. మిష‌న్ ఎడ్యుకేష‌న్‌కు సంబంధించిన కోటి రూపాయ‌ల చెక్‌ను సార‌థికి ఎందుకు ఇచ్చావ‌ని చెక్‌ను అత‌డికి చూపిస్తుంది జ‌గ‌తి.

ఆ చెక్ చూసి రిషి షాక్ అవుతాడు. ఏ స్వార్థంతో ఈ ప‌ని చేశార‌ని జ‌గ‌తి అన‌డంతో రిషి ఆమెపై ఫైర్ అవుతాడు. చెక్‌పై తాము సంత‌కం చేయ‌లేద‌ని అంటాడు. కానీ జ‌గ‌తి మాత్రం ఆ సంత‌కాలు ఒరిజిన‌ల్‌తో మ్యాచ్ అయ్యాయ‌ని అంటుంది.

వ‌సుధార మౌనం...

ఈ చెక్‌ను మ‌నం ఇష్యూ చేశామా అని వ‌సుధార‌ను అడుగుతాడు రిషి. కానీ వ‌సుధార మాత్రం స‌మాధానం చెప్ప‌కుండా మౌనంగా ఉంటుంది. మిష‌న్ ఎడ్యుకేష‌న్ చెక్ ప‌వ‌ర్ నీకు, వ‌సుధార‌కు మాత్ర‌మే ఉంది. మీకు తె లియ‌కుండా ఆ చెక్ ఎలా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని మినిస్ట‌ర్ కూడా రిషిని అడుగుతాడు.

వాళ్లు మ‌న‌ల్ని అవ‌మానిస్తున్నారు, అనుమానిస్తున్నారు. భ‌రించ‌లేని నింద వేస్తున్నార‌ని, మ‌న వ్య‌క్తిత్వానికి సంబందించిన విష‌యంలో మౌనం స‌రికాద‌ని వ‌సుధార‌తో రిషి అంటాడు. రిషినే త‌నంత‌ట తానుగా ఈ చెక్ ఇచ్చాడా...నువ్వు ఇచ్చావా అని మినిస్ట‌ర్ మ‌రోసారి వ‌సుధార‌ను అడుగుతాడు. వ‌సుధార మాత్రం మౌనం వీడ‌దు. రిషి ప్రేమ‌, జ‌గ‌తి గురుద‌క్షిణ మ‌ధ్య న‌లిగిపోతుంది. జ‌గ‌తి కోసం అబ‌ద్ధం చెప్పాల‌ని వ‌సుధార నిర్ణ‌యించుకుంటుంది.

వ‌సుధార ఎంత‌కు స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో రిషి ఆమెపై సీరియ‌స్ అవుతాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది. వ‌సుధార ఆన్స‌ర్ ఏమిట‌న్న‌ది రేప‌టి ఎపిసోడ్‌లో తేల‌నుంది.

IPL_Entry_Point