Guppedantha Manasu May 1st Episode: రిషి, వ‌సుల‌ ల‌వ్ చూసి జెల‌సీగా ఫీలైన దేవ‌యాని - శైలేంద్ర‌కు రిషి షాక్‌-guppedantha manasu may 1st episode rishi shocks shailendra at medical college logo inauguration ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu May 1st Episode Rishi Shocks Shailendra At Medical College Logo Inauguration

Guppedantha Manasu May 1st Episode: రిషి, వ‌సుల‌ ల‌వ్ చూసి జెల‌సీగా ఫీలైన దేవ‌యాని - శైలేంద్ర‌కు రిషి షాక్‌

Nelki Naresh Kumar HT Telugu
May 01, 2023 08:14 AM IST

Guppedantha Manasu May 1st Episode: రిషి, వ‌సుధార మ‌ధ్య ఉన్న ప్రేమ‌, అన్యోన్య‌త చూసి దేవ‌యాని, శైలేంద్ర అసూయ‌ప‌డ‌తారు. వారిని విడ‌దీసేవ‌ర‌కు మంచివాళ్లుగా న‌టించాల‌ని అనుకుంటారు. త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu May 1st Episode: శైలేంద్ర క‌న్నింగ్ మెంటాలిటీతో ధ‌ర‌ణి చాలా బాధ‌ప‌డుతోంటుంది. ఆమెతో మాట్లాడి స‌మ‌స్య ఏమిటో తెలుసుకోవాల‌ని వ‌సుధార అనుకుంటుంది. కానీ ఇది మాట్లాడే స‌మ‌యం కాద‌ని చెప్పి ఆమెను జ‌గ‌తి వారిస్తుంది. ఇలా తొంద‌ర‌ప‌డ‌టం స‌రికాదంటూ స‌ల‌హా ఇస్తుంది. కానీ బాధ‌ప‌డుతుంద‌ని అలాగే వ‌దిలేయ‌డం క‌రెక్ట్ కాదంటూ జ‌గ‌తి మాట‌ల‌కు వ‌సుధార స‌మాధాన‌మిస్తుంది. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి క‌దా అంటుంది. కానీ జ‌గ‌తి మాత్రం వ‌సు మాట‌ల‌కు అడ్డుచెబుతుంది.

వ‌సుకు జ‌గ‌తి స‌ల‌హా...

భార్యాభ‌ర్త‌ల విష‌యంలో తొంద‌ర‌గా బ‌య‌టివాళ్లు జోక్యం చేసుకోక‌పోవ‌డ‌మే మంచిది. వేరే కార‌ణాల్ని ఊహించుకొని నోరు జారితే ప్ర‌మాదం. అది ధ‌ర‌ణి, శైలేంద్ర మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌ను మ‌రింత దెబ్బ తీస్తుంద‌ని వ‌సుధార‌తో జ‌గ‌తి చెబుతుంది. ఇప్ప‌ట్లో ధ‌ర‌ణిని ఏం అడ‌గ‌ద్దొని అంటుంది. జ‌గ‌తి చెప్పిన‌ట్లుగానే వ‌సుధార చేస్తుంది.

వ‌సు ప్రేమ చూసి...

త‌న డ్రెస్ మీద‌కు సెట్ అయ్యే కోట్ విష‌యంలో ఏది బెస్ట్ అన్న‌ది తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతోంటాడు రిషి. ఇంత‌లోనే వ‌సుధార అక్క‌డ‌కు వ‌స్తుంది. కాలేజీ లాగే అత‌డి రూమ్‌లోకి రావ‌డానికి ప‌ర్మిష‌న్ అడ‌గ‌టంతో రిషి ఆమెపై సెటైర్స్ వేస్తాడు. ఆ త‌ర్వాత రిషికి వ‌సుధార కోట్ సెలెక్ట్ చేసిపెడుతుంది. తానే ద‌గ్గ‌రుండి అత‌డికి తొడుగుతుంది. ఆ త‌ర్వాత త‌న‌కు ఈ కోట్ అంటే చాలా ఇష్టం. మీ కోపం, బాధ‌, ఇష్టం ఇలా అన్ని ఎమోష‌న్స్ ఈ కోట్‌లో క‌నిపిస్తాయ‌ని అంటుంది. ఆమె మాట‌ల‌కు రిషి మురిసిపోతాడు.

ఇంకెప్పుడూ ఎడ‌బాటు…

నా మీద నీకున్న ప్రేమ‌లో క‌ళ్ల‌ల్లో క‌నిపిస్తుంద‌ని వ‌సుధార‌తో అంటాడు రిషి. మ‌న మ‌ధ్య ఇంకెప్పుడూ చిన్న ఎడ‌బాటు కూడా ఉండ‌కూడ‌దు. మ‌నం ఎప్పుడూ ప్రేమ‌గా ఇలాగే ఉండాల‌ని చెబుతూ ఎమోష‌న‌ల్ అవుతాడు. అత‌డి మాట‌ల‌కు వ‌సుధార కూడా పొంగిపోతుంది. ఈ వ‌సుధార మీ ప్రాణం. మీ ప్రాణం ఎప్పుడూ మిమ్మ‌ల్ని వ‌దిలి ఉండ‌లేదు అంటూ ప్రేమ‌గా చెబుతుంది. మీరు నా ప్రిన్స్‌...ఎప్పుడూ ఇలాగే రాజ‌కుమారుడిగా ద‌ర్జాగా ఉండాల‌ని అంటుంది. ఆమె మాట‌ల‌కు నిజంగానే నేను ప్రిన్స్‌నే...ఈ రాజ‌కుమారి గుండెల్లో ఉన్నాను క‌దా అంటాడు రిషి. వారు ప్రేమ‌మైకంలో మునిగిపోగా అక్క‌డికి వ‌చ్చిన శైలేంద్ర వారిని డిస్ట్ర‌బ్ చేస్తాడు.

దేవ‌యాని, శైలేంద్ర జెల‌సీ...

వారి అన్యోన్య‌త‌ను చూసి శైలేంద్ర‌, దేవ‌యాని జెల‌సీగా ఫీల‌వుతారు. అదే మాట‌ను దేవ‌యాని బ‌య‌ట‌కు చెబుతుంది. అయిష్టాలు, అస‌మ్మ‌తులు మ‌న‌సులోనే దాచుకోవాలి. ఏది న‌చ్చ‌లేద‌ని బ‌య‌ట‌కు అన‌కూడ‌దు. మ‌న‌కు కావాల్సింది ద‌క్కాలంటే ప్రేమ‌గా న‌టించాలి అంటూ దేవ‌యానితో అంటాడు శైలేంద్ర‌.

ఆ త‌ర్వాత కాలేజీకి బ‌య‌లుదేరుతూ కార్‌లో త‌న ప‌క్క‌న కూర్చోమ‌ని శైలేంద్ర‌కు ఆఫ‌ర్ చేస్తాడు రిషి. కానీ మిమ్మ‌ల్ని వేరు చేయ‌డం నాకు ఇష్టం లేదు అంటూ వ‌సుధార‌నే ముందు కూర్చోవాల‌ని ప‌ట్టుప‌ట్టి వెన‌క సీట్‌లో కూర్చొంటాడు. భ‌ర్త‌తో క‌లిసి కాలేజీకి వెళితే బాగుంటుంద‌ని ధ‌ర‌ణి అనుకుంటుంది. కానీ ప‌గ‌టి క‌ల‌లు క‌నోద్దు అంటూ దేవ‌యాని ఆమెకు వార్నింగ్ ఇస్తుంది. కారులోనూ జ‌ర్నీ చేస్తోన్న స‌మ‌యంలో రిషిపై ఎంతో ప్రేమ ఉన్న‌ట్లుగా శైలేంద్ర న‌టిస్తాడు.

రిషికి స్టూడెంట్స్ స‌ర్‌ప్రైజ్

కాలేజీలో అడుగుపెట్ట‌గానే రిషికి స్టూడెంట్స్‌ ఫ్ల‌వ‌ర్ బొకే ఇస్తారు. స‌ర్‌ప్రైజ్ ఉంద‌ని చెబుతారు. రిషి, శైలేంద్ర మ‌ధ్య ఉన్న అనుబంధం చూసి ఫ‌ణీంద్ర‌, మ‌హేంద్ర ఆనంద‌ప‌డ‌తారు. త‌మ పాత రోజుల్ని గుర్తుచేసుకుంటారు. త‌మలాగే వారిద్ద‌రు ఇలాగే క‌లిసి ఉంటే బాగుంటుంద‌ని అనుకుంటారు. కాలేజీ వ్య‌వ‌హారాల‌ను రిషితో పాటు శైలేంద్ర కూడా చూసుకుంటే బాగుంటుంద‌ని ఫ‌ణీంద్ర అంటాడు. అత‌డి మాట‌లు చూసి మ‌న‌సులోనే జ‌గ‌తి బాధ‌ప‌డుతుంది. శైలేంద్ర స్వార్థ‌ప‌రుడ‌ని, ఆ నిజం తెలిస్తే మీరు ప‌డే బాధ భ‌గ‌వంతుడు కూడా తీర్చ‌లేడు అంటూ మ‌న‌సులోనే త‌ల్ల‌డిల్లిపోతుంది.

శైలేంద్ర‌కు రిషి షాక్‌...

ఆ త‌ర్వాత స్టూడెంట్స్‌కు శైలేంద్ర‌ను ప‌రిచ‌యం చేస్తాడు రిషి. కానీ స్టూడెంట్స్ మాత్రం మాకు మీ త‌ర్వాతే ఎవ‌రైనా అంటూ రిషిపై గౌర‌వాన్ని చూపుతారు. ఆ త‌ర్వాత వ‌సుధార, జ‌గ‌తి ఐడియాల‌తో తాము మెడిక‌ల్ కాలేజీ లోగోను త‌యారు చేశామ‌ని, ఆ లోగోను ఓపెన్ చేయ‌మ‌ని స్టూడెంట్స్ రిషిని కోర‌తారు. కానీ రిషి మాత్రం ఈ లోగోను ఓపెన్ చేయాల్సింది నేను కాదు అంటాడు.

దాంతో రిషి త‌న‌నే ఆ లోగో ఓపెన్ చేయ‌మ‌ని అంటాడ‌ని శైలేంద్ర మ‌న‌సులోనే సంతోష‌ప‌డ‌తాడు. కానీ అత‌డికి షాకిస్తూ ఈ లోగోను వ‌సుధార‌, జ‌గ‌తి ఓపెన్ చేస్తే బాగుంటుంద‌ని చెప్పిన రిషి శైలేంద్ర‌కు షాక్ ఇస్తాడు. వారితోనే లోగో ఓపెన్ చేయ‌డానికి రెడీ అవుతోండ‌గా నేటి గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point