Netizens fires on Rashmi: రష్మీపై నెటిజన్ల ఫైర్.. చేతబడి చేయిస్తానని దారుణంగా కామెంట్స్
Netizens fires on Rashmi: యాంకర్ రష్మీపై సోషల్ మీడియాలో కొంతమంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమెపై చేతబడి చేయిస్తామని, దాడి చేస్తామని పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై రష్మీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
Netizens fires on Rashmi: ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్లో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఘటనపై సోషల్ మీడియాలో విపరీతంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. అభం శుభం తెలియని బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొంతమంది జంతు ప్రేమికులు మాత్రం కుక్కలదు అసలు తప్పే లేదన్నట్లుగా.. బాలుడి మృతిపై కనకిరం కూడా చూపించకుండా మాట్లాడటంతో నెట్టింట చర్చ జరుగుతోంది. తాజాగా ఈ చర్చలోకి బుల్లితెర యాంకర్ రష్మీని తీసుకొచ్చారు. జంతు ప్రేమికురాలిగా గతంలో పలుమార్లు పోస్టులు పెట్టిన ఆమెను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
శునకాలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలని ట్వీట్ చేసింది. దీంతో ఎప్పుడు ఏ మాట్లాడాలో తెలియదంటూ ఆమెపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. అంతేకాకుండా ఆమెను తిడుతూ పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ ఆమె వాటన్నింటికీ ఓపికంగా ట్విటర్ వేదికగా సమాధానాలు చెబుతోంది. కొంతమందైతే ఆమెను హద్దుమీరి మాట్లాడుతున్నారు. రష్మీకి చేతబడి చేయిస్తాం అంటూ ఫైర్ అవుతున్నారు.
నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్ఠి దానా.. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్లు అవుతాయా? నీ మీద యాసిడ్ పోస్డ్. వాటి గురించి నీలాంటి వాళ్లకు తెలియదు. నోరు మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు అంటూ దారుణంగా తిట్టిపోస్తున్నారు. దీంతో రష్మీ ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసింది.
ఈ అకౌంట్ అమ్మాయిదో, అబ్బాయిదో తెలియదు కానీ ఆ వ్యక్తి అప్పట్లో నా వయసు గురించి, పెళ్లి గురించి వాగారు. ఇప్పుడేమో ఏకంగా నా చేతబడి చేస్తాడంట, నాపై యాసిడ్ దాడి చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇన్ని మాటలు అన్నందుకు నీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా? వద్దా అంటూ అగ్రహం వ్యక్తం చేసింది.
పెట్ లవర్ అయిన రష్మీ.. గతంలో సంక్రాంతికి కోళ్ల పందాలు వద్దని ట్వీట్ చేసింది. అదే సమయంలో రంజాన్, బ్రకీద్కు జంతువులను చంపకండి అంటూ ట్వీట్ చేసింది. తాజాగా అంబర్ పేట్ కుక్కల దాడి విషయంలోనూ అలానే స్పందించింది. కుక్కల సంరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.