Allu Arjun - Pushpa 2: పుష్ప-2పై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది - సినిమా లాంఛ్ ఎప్పుడంటే
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సీక్వెల్స్లో పుష్ప-2 (Pushpa 2) ఒకటి. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై నిర్మాతలు బిగ్ అప్డేట్ను వెల్లడించారు. అది ఏమిటంటే...
Allu Arjun - Pushpa 2: అల్లు అర్జున్,దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందిన పుష్ప చిత్రం టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఎర్రచందనం అక్రమరవాణా నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాను తెరకెక్కించారు. పుష్పరాజ్గా బన్నీ నటన,మేనరిజమ్స్ వరల్డ్వైడ్గా పాపులర్ అయ్యాయి.
ప్రస్తుతం పుష్ప సినిమాకు పుష్ప ది రూల్ పేరుతో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ ప్రారంభం కోసం అల్లు అర్జున్ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. బన్నీ అభిమానులకు చిత్ర యూనిట్ ఆదివారం గుడ్న్యూస్ వినిపించింది. ఆగస్ట్ 22 సోమవారం రోజున పూజా కార్యక్రమాలతో పుష్ప -2 సినిమాను లాంఛ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లోనే ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించబోతున్నట్లు తెలిసింది.
ఈ కార్యక్రమానికి బన్నీ,సుకుమార్తో పాటు టాలీవుడ్లోని పలువురు సినీ ప్రముఖులు హాజరుకాబోతున్నట్లు తెలిసింది. చిరంజీవి పుట్టినరోజును దృష్టిలో పెట్టుకొని సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. పుష్ప సీక్వెల్లో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అర్జున్ ఫహాద్ ఫాజిల్ మధ్య పోరాటంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్కు ప్రాముఖ్యతనిస్తూ ఈ సీక్వెల్ కథ సాగుతుందని తెలిసింది. ఈ సీక్వెల్లో ప్రియమణి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.