Akshay Kumar new movie: మరో రియల్ లైఫ్ స్టోరీలో అక్షయ్ కుమార్
రియల్ లైఫ్ స్టోరీలతో కూడిన సినిమాలకు అక్షయ్ కుమార్ పెట్టింది పేరు. ఇప్పుడు అలాంటి సినిమాతో మరోసారి ప్రేక్షకులకు ముందు రానున్నారు.
1989లో పశ్చిమ బెంగాల్లో వరదల్లో చిక్కుకున్న బొగ్గు గనిలో 64 మంది కార్మికులను రక్షించిన మైనింగ్ ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ పాత్రలో తాను నటించబోతున్నట్లు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ బుధవారం తెలిపారు.
దేశంలో ‘మొదటి బొగ్గు గని రెస్క్యూ మిషన్’ 33వ వార్షికోత్సవం సందర్భంగా గిల్ను గుర్తుచేసిన కేంద్ర బొగ్గు శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ పోస్ట్కు ప్రతిస్పందనగా అక్షయ్ కుమార్ ఈ సంగతి చెప్పారు.
‘33 సంవత్సరాల క్రితం ఈ రోజున భారతదేశపు మొట్టమొదటి ‘బొగ్గు గని రెస్క్యూ మిషన్’ని గుర్తుచేసుకున్నందుకు ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు. సర్దార్ జస్వంత్ సింగ్ గిల్ పాత్ర పోషించడం నాకు గర్వకారణం…’ అంటూ అక్షయ్ ట్విటర్లో పోస్ట్ చేశారు.
అమృత్సర్ వాసి జశ్వంత్ సింగ్ గిల్ 1989లో తన ధైర్యసాహసాలకు అనేక అవార్డులు అందుకున్నాడు. పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్ ప్రాంతంలో వరదలు ముంచెత్తిన గని నుండి 64 మంది ప్రాణాలను కాపాడారు. జశ్వంత్ సింగ్ గిల్ 2019లో 80 ఏళ్ల వయసులో మరణించారు.
ఇంకా పేరు పెట్టని ఈ హిందీ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. అక్షయ్ నటించిన ‘రుస్తుం’ చిత్రం ఫేమ్ టిను సురేష్ దేశాయ్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.
‘చాలా గర్వంగా ఉంది. దివంగత సర్దార్ జస్వంత్ సింగ్ గిల్ చేసిన కోల్మైన్ రెస్క్యూ వీరోచిత చర్యను దృశ్యరూపంలో మీకు అందిస్తున్నాం..’ అని ప్రొడక్షన్ బ్యానర్ ట్వీట్లో పేర్కొంది.
మహేష్ మంజ్రేకర్ మరాఠీ చిత్రం ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తానని అక్షయ్ కుమార్ ఈ నెల ఆరంభంలో ప్రకటించారు.
టాపిక్