Stock market news today : నష్టాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 50 పాయింట్లు డౌన్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 111 పాయింట్ల నష్టంతో 60,094 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 52 పాయింట్లు కోల్పోయి 17,839 వద్ద ట్రేడ్ అవుతోంది.
రిపబ్లిక్ డే కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సెలవు తీసుకున్నాయి. అయితే.. బుధవారం ట్రేడింగ్ సెషన్లో మాత్రం సూచీలు భారీగా పడ్డాయి. 226 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 60,205 వద్ద ముగిసింది. ఇక 226 పాయింట్ల నష్టంతో 17,891 వద్ద స్థిరపడింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1,085 పాయింట్లు కోల్పోయి 41,647 వద్దకు చేరింది. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60,166- 17,877 వద్ద మొదలుపెట్టాయి.
పివోట్ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్ట్ 17,849- 17,789 లెవల్స్ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 18,043- 18,103 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
హీరో మోటోకార్ప్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2725, టార్గెట్ రూ. 2850- రూ. 2900
Bharti Airtel share price target : భారతీ ఎయిర్టెల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 760, టార్గెట్ రూ. 790- రూ. 800
Tata Steel share price target : టాటా స్టీల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 114, టార్గెట్ రూ. 130
ఓఎన్జీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 147, టార్గెట్ రూ. 163
లాభాలు.. నష్టాలు..
టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్టెక్, విప్రో, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock market investment : అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ను లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.61శాతం, ఎస్ అండ్ పీ 500 1.1శాతం, నాస్డాక్ 1.76శాతం లాభాల్లో ముగిశాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.11శాతం, ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.23శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
త్రైమాసిక ఫలితాలు..
Q3 results : బజాజ్ ఫినాన్స్, వేదాంత, ఆర్తి డ్రగ్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, సీఎంఎస్ ఇన్ఫో సిస్టెమ్, గ్లెన్మమార్క్ లైఫ్ సైన్సెస్తో పాటు ఇతర సంస్థల క్యూ3 ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
ఎన్టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, కేర్ రేటింగ్స్, డీసీబీ బ్యాంక్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్తో పాటు ఇతర సంస్థల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు రూ. 2393.94కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1378.49కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం