Stock market news today : నూతన ఏడాదిని స్వల్ప లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 70పాయింట్లు పెరిగి 60,911 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 35 పాయింట్ల లాభంతో 18,140 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (డిసెంబర్ 30) ట్రేడింగ్ సెషన్ను నష్టాల్లో ముగించాయి. నిఫ్టీ50.. 85 పాయింట్ల నష్టంతో 18,105 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్.. 293 పాయింట్లు కోల్పోయి 60,840 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 265 పాయింట్ల పతనంతో 42,986కు చేరింది. కాగా.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60,871- 18,132 వద్ద మొదలుపెట్టాయి.
పివోట్ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్ట్ 18,080- 18,036- 17,965 లెవల్స్ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్.. 18,221- 18,264- 18,335 లెవల్స్ వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
Stocks to buy today : ఓఎన్జీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 142, టార్గెట్ రూ. 150- రూ. 154
బజాజ్ ఫిన్సర్వ్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1510, టార్గెట్ రూ. 1600- రూ. 1620
యూకో బ్యాంక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 26, టార్గెట్ రూ. 39
నేటి స్టాక్స్ టు బై పూర్తి లిస్ట్ను ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
టాటాస్టీల్, టాటా మోటార్స్, హెచ్యూఎల్, రిలయన్స్, ఎస్బీఐ, ఇన్ఫీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
మారుతీ సుజుకీ, సన్ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock market news : క్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్ 0.22శాతం, ఎస్ అండ్ పీ 500 0.25శాతం, నాస్డాక్ 0.11శాతం మేర నష్టాల్లో ముగిశాయి. మొత్తం మీద 2022ను నష్టాలతో ముగించాయి అమెరికా స్టాక్ మార్కెట్లు. 2018 తర్వాత నష్టాల్లో ముగించడం ఇదే తొలిసారి.
న్యూ ఇయర్ సందర్భంగా ఆసియాలోని మార్కెట్లకు నేడు సెలవు.
2023 మల్టీబ్యాగర్ స్టాక్గా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2950.89కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2266.2కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం