Raitu Bharosa: ఏపీలో నేడు రైతు భరోసా - పిఎం కిసాన్ నిధుల విడుదల-release of pm kisan rythu bharosa funds in ap today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Raitu Bharosa: ఏపీలో నేడు రైతు భరోసా - పిఎం కిసాన్ నిధుల విడుదల

Raitu Bharosa: ఏపీలో నేడు రైతు భరోసా - పిఎం కిసాన్ నిధుల విడుదల

HT Telugu Desk HT Telugu
Jun 01, 2023 06:13 AM IST

Raitu Bharosa: ఏపీలో నేడు పిఎం కిసాన్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఐదో ఏడాది మొదటి విడుదల రైతు భరోసా నిధుల్ని విడుదల చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో జరిగే కార్యక్రమంలో నిధుల్ని విడుదల చేయనున్నారు.

రైతు భరోసా
రైతు భరోసా (HT )

Raitu Bharosa: వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధులు నేడు విడుదల కానున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా నిధుల్ని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాదికి మొదటి విడత నిధుల్ని నేడు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

రైతులు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సాయం అందించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో వరుసగా ఐదో ఏడాది, మొదటి విడతా వైయస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

ఐదో ఏడాది మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 52,30,939 మంది రైతుల ఖాతాల్లో రూ. 3,923.21 కోట్ల రైతు భరోసా సాయాన్ని కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా సాయం కింద రూ.5,500 రైతన్నల ఖాతాల్లో జమ చేస్తారు. పీఎం కిసాన్ ద్వారా రావాల్సిన రూ. 2,౦౦౦ కూడా ఆ నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్నారు.

నేడు అందిస్తున్న సాయం రూ. 3,923 కోట్లతో కలిపి నాలుగేళ్లలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ ద్వారా రూ. 30,985 కోట్లు అందించారు.

మ్యానిఫెస్టోలో రైతులకు ఏటా రూ. 12,500 ఇస్తామని 4 సంవత్సరాలలో రూ. 50,000 ఇస్తామని చెప్పినా, ఏటా రూ. 13,500 చొప్పన 5ఏళ్లలో రూ. 67,500 చెల్లిస్తున్నట్లు వివరించారు. రైతుకు అదనంగా మొత్తం రూ. 17,500 చెల్లిస్తున్నారు. రైతు భరోసా క్రింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500 ప్రతి రైతుకు చెల్లిస్తున్నారు.

మొదటి విడత – ఖరీఫ్‌ పంట వేసే ముందు – మే నెలలో రూ. 7,500, రెండవ విడత – అక్టోబర్‌ నెలలో ఖరీఫ్‌ పంట కోత సమయం మరియు రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడత – పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి–ఫిబ్రవరి నెలలో రూ. 2,000 చొప్పున విడుదల చేస్తున్నారు. వివిధ పథకాల ద్వారా ఈ నాలుగేళ్లలో రైతులకు ప్రభుత్వంరూ. 1,61,236.72 కోట్లు సాయం అందించింది.

రైతు సంక్షేమం కోసం పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్‌ రైతు భరోసా, విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతులకు గ్రామంలో తమ గడప వద్దనే సేవలందించేలా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, ఈ క్రాప్‌ లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నారు.

ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, కనీస మద్దతు ధరలకు పంట ఉత్పత్తుల కొనుగోలు, రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించేలా వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్‌ యంత్రసేవా పథకం, పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, బత్తాయి, 5 రకాల చిరుధాన్యాలతో సహా 26 పంటలకు పంట వేసినప్పుడే మద్దతు ధరలను ప్రకటిస్తున్నారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేశారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ

2023 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలకు 30,382 హెక్టార్లలో పంట నష్టపోయిన 47,999 మంది రైతులకు రూ.44.19 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించారు. పంట కోతల అనంతరం వర్షాల వల్ల కల్లాల్లో పంట దెబ్బతిన్న 3,469 మంది జొన్న, మొక్కజొన్న రైతులకు రూ.9.43 కోట్ల ప్రత్యేక పరిహారంతో కలిపి రూ.53.62 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించారు. గ్రామ స్థాయిలోని ప్రతి ఆర్బీకేలో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి నష్టపోయిన రైతులను పారదర్శకంగా గుర్తించి బటన్‌ నొక్కి నేడు వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.

నేడు జమ చేస్తున్న రూ. 53.62 కోట్లతో కలిపి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 22.74 లక్షల మంది రైతన్నలకు అందించిన మొత్తం ఇన్‌పుట్‌ సబ్సిడీ అక్షరాల రూ. 1,965 కోట్లు ఉందని వ్యవసాయ శాఖ చెబుతోంది.

IPL_Entry_Point