Kohli Angry on Hardik: "కత్తులతో కాదు.. కంటి చూపుతో చంపేసేలా ఉన్నాడుగా".. కోహ్లీ డెడ్లీ లుక్కు హార్దిక్ ఫీజులు ఔట్
Kohli Angry on Hardik: టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ.. హార్దిక్ పాండ్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో మంగళవారం నాడు జరిగిన మ్యాచ్లో రెండో పరుగుకు రానందుకు గానూ.. అతడిని డెడ్లీ లుక్తో భయపెట్టాడు.
Kohli Angry on Hardik: విరాట్ కోహ్లీ బ్యాటింగ్ నైపుణ్యాలు గురించి అందరికీ తెలిసిందే. బౌండరీలు, సిక్సర్లు కంటే కూడా వికెట్ల మధ్య పరుగులు తీయడంలో అతడికి అతడే సాటి. ఫోర్లు, సిక్సర్లు కొట్టకపోయినా.. సింగిల్స్ అయినా తీస్తూ ఉండాలి. అతడు ఎల్లప్పుడూ స్కోరు బోర్డు పరుగులు పెడుతూనే ఉండాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. ఇంక మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉంటే వికెట్ల మధ్య వీరిద్దరి పరుగులను కట్టడి చేయాలంటే ప్రత్యర్థి ఫీల్డర్లు చెమటలు కక్కాల్సిందే. అంతగా సింగిల్స్, డబుల్స్కు ప్రాధాన్యమిస్తారు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ విరాట్ కోహ్లీ ఇదే విధంగా పరుగులు తీస్తూ ఆకట్టుకున్నాడు. అయితే ఎలాంటి భావోద్వేగాన్నైనా వెంటనే మైదానంలో చూపించే కోహ్లీ.. నిన్నటి మ్యాచ్లోనూ హార్దిక్పై తన కోపాన్ని చూపించాడు.
ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 43వ ఓవర్లో కసున్ రజిత్ వేసిన లెంగ్త్ డెలివరీని ఆన్ సైడ్ బీహైండ్ స్క్వేర్ ఆడాడు కోహ్లీ. అనంతరం వెంటనే సింగిల్ తీశాడు. అయితే డబుల్ తీసేందుకు ప్రయత్నించగా.. హార్దిక్ ప్రతిస్పందించలేదు. దీంతో వెనక్కి వెళ్లిన విరాట్.. పరుగు తీయనందుకు హార్దిక్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా అతడిని కోపంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ డెడ్లీ లుక్కు హార్దిక్ కూడా భయపడినట్లు కనిపించింది. సారీ అంటూ చేతితో సంకేతమిచ్చాడు. అనంతరం కోహ్లీని డైరెక్టుగా చూడలేకపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. "కోహ్లీ.. హార్దిక్ను చూపుతోనే భయపెట్టేశాడుగా" అంటూ కామెంట్లు పెడుతున్నారు. "విరాట్ క్రీజులో ఉంటే అలాగే ఉంటుంది మరి" అని ఇంకొకకరు పోస్టు చేశారు.
గువహటీ వేదికగా శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లీ(113) సెంచరీతో విజృంభించగా.. రోహిత్ శర్మ(83), శుబ్మన్ గిల్(70) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లంక జట్టు 8 వికెట్లు నష్టపోయి 306 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ దసున్ శనకా(108) సెంచరీతో విజృంభించినప్పటికీ మిగిలిన వారు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో పరాజయం పాలైంది. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో రాణించాడు.
సంబంధిత కథనం