Bypolls 2022: 6 రాష్ట్రాల్లో 'ఉప' సమరం- బరిలో సీఎం
Bypolls 2022: దేశంలో కీలకమైన ఉప ఎన్నికల సమరం మొదలైంది. 3 లోక్సభ, 7 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Bypolls 2022: ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికల సమరం మొదలైంది. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం మూడు లోక్సభ, 7 అసెంబ్లీ సీట్లకు గురువారం ఉపఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అధికారులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఢిల్లీ.. పంజాబ్..
ఢిల్లీ, పంజాబ్ ఉపఎన్నికలపై ఆప్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీ.. తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. రాజేందర్ నగర్ నియోజకవర్గంలో 'ఉప' పోరు నడుస్తోంది. ఇక్కడ అధికార ఆప్, విపక్ష బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం మీద 1.6లక్షల మంది ఓటర్లు ఉండగా.. 14మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు.
By elections 2022 : పంజాబ్లోని సంగ్రూర్లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా గెలుపొందిన అనంతరం సంగ్రూర్ ఎంపీగా భగవంత్ మన్ రాజీనామా చేయడంతో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా.. పంజాబ్లో సిద్ధూ మూసేవాలా మరణం అనంతరం అక్కడి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మరి తాజా ఎన్నికల్లో 15లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకుని ఎవరిని గెలిపిస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
బరిలో సీఎం..
త్రిపురలోనూ ఈ ఉపఎన్నికలు కీలకంగా మారాయి. స్వయంగా ఆ రాష్ట్ర సీఎం మానిక్ సాహా ఈ ఉపఎన్నికలో బరిలో ఉండటం ఇందుకు కారణం. బోర్దోవాలి నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో నిలబడ్డారు. అగర్తల, సుర్మా, జబరాజ్నగర్లోనూ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి.
Tripura by election : అప్పటివరకు ముఖ్యమంత్రిగా విప్లవ్ దేవ్పై అసంతృప్తి పెరగడంతో ఆయన్ని తప్పించి మానిక్కు అవకాశం ఇచ్చింది కమలదళం. మరికొన్ని నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ఈ ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారింది.
వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూర్, ఝార్ఖండ్ మాందర్, ఉత్తర్ప్రదేశ్ అజామ్గఢ్, రామ్పూర్లో ఉప సమరం నడుస్తోంది.
సంబంధిత కథనం