Karnataka murder case : నడిరోడ్డు మీద పరిగెత్తించి.. దారుణ హత్య!
Karnataka murder case : 26ఏళ్ల వ్యక్తిని, కొందరు దుండగులు పరిగెత్తించి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
Karnataka murder case : కర్ణాటకలో దారుణ హత్య జరిగింది. రద్దీగా ఉన్న ప్రాంతంలో నలుగురు, ఐదుగురు దుండగులు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
ఈ ఘటన బీదర్ జిల్లా త్రిపురనాథ్ గ్రామంలో జరిగింది. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 26ఏళ్ల ఆనంద్ ఫులే అనే వ్యక్తి, రోడ్డు మీద పరుగులు తీశాడు. అతని వెనక మరో 4,5 పరిగెత్తారు. చివరికి వారి వద్ద ఉన్న కత్తితో అతడిని దారుణంగా పొడిచారు. రక్తపు మడుగులో అతను పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు ఈ దృశ్యాలను చూస్తూ ఉండిపోయారు.
Karnataka crime news : కాగా.. నిందితులు అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఆ వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. ఆనంద్ ఫులేని ఆసుపత్రికి తరలించారు. కాగా.. అతను మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాగా.. పాత కక్షలే ఈ దారుణ హత్యకు కారణం అని తెలుస్తోంది.
Karnataka latest news today : ఇదే ఘటనలో ఆనంద్ ఫులే స్నేహితుడు కూడా గాయపడ్డాడు. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని వద్ద నుంచి కూడా సమాచారాన్ని సేకరించిన పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.