Karnataka murder case : నడిరోడ్డు మీద పరిగెత్తించి.. దారుణ హత్య!-murder on busy karnataka street caught on camera four to five men attacked with sword ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Murder On Busy Karnataka Street Caught On Camera Four To Five Men Attacked With Sword

Karnataka murder case : నడిరోడ్డు మీద పరిగెత్తించి.. దారుణ హత్య!

Sharath Chitturi HT Telugu
Feb 28, 2023 05:48 PM IST

Karnataka murder case : 26ఏళ్ల వ్యక్తిని, కొందరు దుండగులు పరిగెత్తించి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

నడిరోడ్డు మీద పరిగెత్తించి.. దారుణ హత్య!
నడిరోడ్డు మీద పరిగెత్తించి.. దారుణ హత్య!

Karnataka murder case : కర్ణాటకలో దారుణ హత్య జరిగింది. రద్దీగా ఉన్న ప్రాంతంలో నలుగురు, ఐదుగురు దుండగులు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

ఈ ఘటన బీదర్​ జిల్లా త్రిపురనాథ్​ గ్రామంలో జరిగింది. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 26ఏళ్ల ఆనంద్​ ఫులే అనే వ్యక్తి, రోడ్డు మీద పరుగులు తీశాడు. అతని వెనక మరో 4,5 పరిగెత్తారు. చివరికి వారి వద్ద ఉన్న కత్తితో అతడిని దారుణంగా పొడిచారు. రక్తపు మడుగులో అతను పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు ఈ దృశ్యాలను చూస్తూ ఉండిపోయారు.

Karnataka crime news : కాగా.. నిందితులు అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఆ వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. ఆనంద్​ ఫులేని ఆసుపత్రికి తరలించారు. కాగా.. అతను మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాగా.. పాత కక్షలే ఈ దారుణ హత్యకు కారణం అని తెలుస్తోంది.

Karnataka latest news today : ఇదే ఘటనలో ఆనంద్​ ఫులే స్నేహితుడు కూడా గాయపడ్డాడు. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని వద్ద నుంచి కూడా సమాచారాన్ని సేకరించిన పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.

IPL_Entry_Point