Mass wedding in Ayodhya: ఒకే సమయంలో, ఒకే వేదికపై 1300 పెళ్లిళ్లు;కట్నం లేకుండానే
Mass wedding in Ayodhya: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో హిందు, ముస్లింల ఐక్యతకు సూచికగా సామూహిక వివాహ మహోత్సవం జరిగింది. ఒకే సమయంలో, ఒకే వేదికలో 1300లకు పైగా హిందు, ముస్లిం జంటలు వివాహం చేసుకున్నాయి.
Mass wedding in Ayodhya: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో ఈ కార్యక్రమం జరిగింది. అయోధ్య, అంబేద్కర్ నగర్ జిల్లాల్లోని జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ట్రెండింగ్ వార్తలు
Mass wedding in Ayodhya: సామూహిక వివాహ కార్యక్రమం
అయోధ్యలోని గవర్న్ మెంట్ ఇంటర్ కాలేజ్ గ్రౌండ్ లో శుక్రవారం ఈ వివాహ మహోత్సవం జరిగింది. ఇందులో 1342 హిందూ జంటలు, 13 ముస్లిం జంటలు వివాహం చేసుకున్నాయి. హిందూ వివాహాలను గాయత్రి పరివార్ సంస్థవారు, ముస్లిం వివాహాలను ఒక ముస్లిం ఖ్వాజీ నిర్వహించారు. కట్నం ప్రసక్తి లేకుండానే ఈ వివాహాలు జరగడం విశేషం. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలను అందించిందని జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ తెలిపారు.
₹50000 gift from govt: ప్రభుత్వం నుంచి బహుమతి
ఈ కార్యక్రమంలో వివాహం చేసుకున్న జంటలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 వేల చొప్పున నగదు బహుమానం అందించింది. వివాహ కార్యక్రమం ముగియగానే వారికి మ్యారేజ్ సర్టిఫికెట్లను కూడా అందించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ రెండో సారి సీఎం అయిన తరువాత రాష్ట్రంలోని 5 లక్షల మంది యువతుల పెళ్లిళ్లకు సహాయం చేశారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్భర్ వెల్లడించారు.