India earthquake risk : ఇండియాకు ‘భూకంపం’ ముప్పు.. టర్కీ కన్నా ఎక్కువ తీవ్రత!
Earthquakes in India : ఇండియాలో టర్కీ స్థాయి భూకంపం వచ్చే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్కు చెందిన ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. దేశంలో గత కొన్నేళ్లుగా వస్తున్న భూప్రకంపనలపై ఆయన రీసెర్చ్ చేస్తున్నారు.
India earthquake warning : భూకంపం అనంతర టర్కీ నుంచి వెలుగులోకి వస్తున్న దృశ్యాలు, కన్నీటి కథలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. టర్కీ ప్రజల కోసం ప్రపంచ దేశాలు ప్రార్థనలు చేస్తున్నాయి. అయితే.. ఇండియాలోనూ తరచూ భూకంప ఘటనలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఈ తరహా ఘటనలు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ఇప్పుడు టర్కీ పరిస్థితులను చూసి భారతీయులు సైతం భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్కు చెందిన ఓ ప్రొఫెసర్ వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురిచేసే విధంగా ఉన్నాయి. ఇండియాకు భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నారు.
'జాగ్రత్తగా ఉండాల్సిందే..!'
దేశంలో భూకంపాల కారణాలు, వాతావరణ మార్పులపై గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు ప్రొఫెసర్ జావెద్ మాలిక్. ఇండియాలోని కొన్ని భాగాల్లో.. 7.5 తీవ్రతతో భూ ప్రకంపనలు వెలుగుచూసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Earthquake risk in India : ఒకటి, రెండు దశాబ్దాల్లో లేదా ఒకటి, రెండేళ్లల్లోనే టర్కీ తరహా తీవ్రతతో భూకంపం సంభవించవచ్చని జావెద్ మాలిక్ పేర్కొన్నారు.
"భూకంపం కేంద్రబిందువు హిమాలయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లోనూ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ తరహా భూకంపాలు వస్తాయని అంచనా వేస్తున్నప్పుడు.. అదే తరహాలో సిద్ధంగా ఉండాలి. నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి," అని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ జావెద్ మాలిక్ తెలిపారు. కచ్, అండమాన్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు.
India earthquake news : భూకంపాల అంశంలో దేశాన్ని 5 జోన్లుగా విడదీశారు. జోన్-5 అనేది అత్యంత తీవ్రమైనది. కచ్, అండమాన్ నికోబార్, హిమాలయ ప్రాంతాలు ఇందులో ఉంటాయి. జోన్-4లో బెహ్రిచ్, లఖింపూర్, పిలిభిట్, ఘజియాబాద్, రూర్కీ, నైనిటల్లు ఉన్నాయి. కాన్పూర్, లక్నో, ప్రయాగ్రాజ్, వారణాసి, సోన్భాద్రలు జోన్-3లో ఉన్నాయి.
భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో వెలువడే ఎనర్జీ వల్ల భూకంపం సంభవిస్తుందని ప్రొఫెసర్ జావెద్ మాలిక్ తెలిపారు. ఆ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే, భూ ప్రకంపనల తీవ్రత అంత ఎక్కువగా ఉండొచ్చని వివరించారు.
24వేలు దాటిన మృతుల సంఖ్య..
Turkey earthquake death toll : కొన్ని రోజుల క్రితం టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 24వేలు దాటింది. 80వేలకుపైగా మంది ప్రజలు గాయపడ్డారు. అనేక మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.