Kishan Reddy : ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
Kishan Reddy : ఛాతిలో నొప్పి కారణంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. ఆదివారం రాత్రి 10:30 గంటలకు ఆయన్ని ఎయిమ్స్కు తరలించినట్టు తెలుస్తోంది.
కిషన్ రెడ్డి (HT_PRINT)
Kishan Reddy admitted in AIIMS : కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి.. ఆదివారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. అనూహ్యంగా ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్లోని క్రిటికల్ కార్డియాక్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. మీడియా సమాచారం ప్రకారం.. కిషన్ రెడ్డిని ఆదివారం రాత్రి 10:30 గంటలకు ఎయిమ్స్లో చేర్చారు.
"గత రాత్రి 10:30 గంటలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీ ఎయిమ్స్లోని సీసీయూలో చేర్చారు. ఛాతిలో నొప్పి వస్తోందని ఆయన చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు," అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కిషన్ రెడ్డి ఆరోగ్యంపై మరింత సమచారం తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనం