Kishan Reddy : ఢిల్లీ ఎయిమ్స్​లో చేరిన కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి..-g kishan reddy complains of chest tightness admitted to aiims delhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  G Kishan Reddy Complains Of Chest Tightness, Admitted To Aiims Delhi

Kishan Reddy : ఢిల్లీ ఎయిమ్స్​లో చేరిన కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి..

Sharath Chitturi HT Telugu
May 01, 2023 08:38 AM IST

Kishan Reddy : ఛాతిలో నొప్పి కారణంగా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి.. ఢిల్లీ ఎయిమ్స్​లో చేరారు. ఆదివారం రాత్రి 10:30 గంటలకు ఆయన్ని ఎయిమ్స్​కు తరలించినట్టు తెలుస్తోంది.

కిషన్​ రెడ్డి
కిషన్​ రెడ్డి (HT_PRINT)

Kishan Reddy admitted in AIIMS : కేంద్రమంత్రి జీ కిషన్​ రెడ్డి.. ఆదివారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్​లో చేరారు. అనూహ్యంగా ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్​లోని క్రిటికల్​ కార్డియాక్​ యూనిట్​లో చికిత్స పొందుతున్నారు. మీడియా సమాచారం ప్రకారం.. కిషన్​ రెడ్డిని ఆదివారం రాత్రి 10:30 గంటలకు ఎయిమ్స్​లో చేర్చారు.

"గత రాత్రి 10:30 గంటలకు కేంద్రమంత్రి కిషన్​ రెడ్డిని ఢిల్లీ ఎయిమ్స్​లోని సీసీయూలో చేర్చారు. ఛాతిలో నొప్పి వస్తోందని ఆయన చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు," అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కిషన్​ రెడ్డి ఆరోగ్యంపై మరింత సమచారం తెలియాల్సి ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం