1.19 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చిన బిన్​ లాడెన్​ కుటుంబం.. కానీ!-bin laden family donated 1m pounds to prince charles charity report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bin Laden Family Donated 1m Pounds To Prince Charles Charity: Report

1.19 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చిన బిన్​ లాడెన్​ కుటుంబం.. కానీ!

Sharath Chitturi HT Telugu
Jul 31, 2022 07:37 PM IST

ఒసామా బిన్​ లాడెన్​ కుటుంబసభ్యులు.. ప్రిన్స్​ ఛార్లెస్​ ఛారిటీ ట్రస్ట్​కు 1.19 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చినట్టు ఓ నివేదిక పేర్కొంది. వివరాల్లోకి వెళితే..

1.19 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చిన బిన్​ లాడెన్​ కుటుంబం!
1.19 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చిన బిన్​ లాడెన్​ కుటుంబం! (REUTERS)

Osama bin laden family : ఒసామా బిన్​ లాడెన్​ కుటుంబసభ్యులు.. ప్రిన్స్​ ఛార్లెస్​ ఛారిటీ ట్రస్ట్​కు 1 మిలియన్​ పౌండ్లు(1.19మిలియన్​ డాలర్లు) విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సండే టైమ్స్​ నివేదిక పేర్కొంది. బిన్​ లాడెన్​ సవతి తల్లి కుమారులు బకర్​ బిన్​ లాడెన్​- షఫీక్​ల విరాళాన్ని ప్రిన్స్​ ఛార్లెస్​ స్వీకరించినట్టు నివేదిక వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

9/11 దాడుల సూత్రధారి బిన్​ లాడెన్​ పేరు వింటే ప్రపంచం ఇప్పటికీ వణికిపోతుంది. అయితే.. ఆయన సోదరులకు ఉగ్రవాదంతో సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాగా.. వారు విరాళాలు ఇవ్వడం మంచి విషయమే అయినా.. తాజా నివేదికతో ప్రిన్స్​ ఛార్లెస్​ మరిన్ని చిక్కుల్లో పడ్డారు! ఆయనకు చెందిన ఛారిటీ సంస్థలు అక్రమ పనులు చేస్తున్నట్టు ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. ప్రిన్స్​ ఛార్లెస్​కు ప్రయోజనం కలిగే విధంగా కొన్ని ప్రాజెక్టులకు.. సౌదీ వ్యాపారవేత్త మహ్​ఫౌజ్​ మరై ముబారక్​.. ట్రస్ట్​ ద్వారా భారీ మొత్తంలో నగదు చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. వాటిపై ఫిబ్రవరిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక తాజా వ్యవహారంతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం లేకపోలేదు.

Prince Charles : అయితే.. ఈ విరాళం వ్యవహారం 2013లో జరిగినట్టు తెలుస్తోంది. 2013లో లండన్​లోని క్లియరెన్స్​ హౌజ్​లో బకర్​ను ప్రిన్స్​ ఛార్లెస్​ కలిశారు. అప్పుడే ఆ విరాళానికి సంబంధించి చర్చలు జరిగినట్టు నివేదిక వెల్లడించింది. బిన్​ లాడెన్​ మరణించి అప్పటికే రెండేళ్లు గడిచిపోయింది.

కాగా.. బిన్​ లాడెన్​ కుటుంబసభ్యుల నుంచి విరాళాలు స్వీకరించవద్దని చాలా మంది ప్రిన్స్​ ఛార్లెస్​కు చెప్పినట్టు నివేదిక పేర్కొంది.

ఈ నివేదిక బయటకొచ్చిన అనంతరం పీడబ్ల్యూసీఎఫ్​(ప్రిన్స్​ ఆఫ్​ వేల్స్​ ఛారిటెబుల్​ ఫండ్​) ఛైర్మన్​ సర్​ ఇయాన్​ చెషేర్​ ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నగదు లావాదేవీలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే విరాళం స్వీకరించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి సమాచారం సేకరించనట్టు వెల్లడించారు. ట్రస్టీలు అందరు కలిసి నిర్ణయించిన తర్వాతే విరాళానికి అంగీకరించినట్టు స్పష్టం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్