Bihar CM assets : ఈ రాష్ట్రంలో.. సీఎం కన్నా కేబినెట్​ మంత్రులే ధనవంతులు!-bihar cabinet ministers richer than cm nitish kumar shows report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bihar Cabinet Ministers Richer Than Cm Nitish Kumar Shows Report

Bihar CM assets : ఈ రాష్ట్రంలో.. సీఎం కన్నా కేబినెట్​ మంత్రులే ధనవంతులు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 01, 2023 10:50 AM IST

Bihar CM Nitish Kumar assets : బీహార్​లో సీఎం నితీశ్​ కుమార్​ కన్నా ఆయన కేబినెట్​లో మంత్రులుగా పనిచేస్తున్న వారి ఆస్తుల విలువే ఎక్కువగా ఉంది. ఈ విషయం వారు ప్రకటించిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తే తెలుస్తోంది.

బీహార్​ సీఎం నితీశ్​ కుమార్​.
బీహార్​ సీఎం నితీశ్​ కుమార్​.

Bihar CM Nitish Kumar assets : బీహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​తో పాటు కేబినెట్​ మంత్రులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. సీఎం కన్నా కేబినెట్​ మంత్రుల వద్దే ఆస్తులు ఎక్కువగా ఉండటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

ఆస్తుల వివరాలు..

సీఎం నితీశ్​ కుమార్​, కేంద్ర మంత్రుల ఆస్తుల వివరాలను బిహార్​ ప్రభుత్వ అధికారిక వెబ్​సైట్​లో డిసెంబర్​ 31న అప్లోడ్​ చేశారు. దీని ప్రకారం.. నితీశ్​ కుమార్​ వద్ద ఉన్న ఆస్తులు, స్థిరాస్తుల విలువ రూ. 75.53లక్షలు. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది రూ. 18వేలు ఎక్కువ. నితీశ్​ కుమార్​ వద్ద రూ. 28,135 నగదు క్యాష్​ రూపంలోను, రూ. 51,856 నగదు డిపాజిట్ల రూపంలో వివిధ బ్యాంక్​లలో ఉన్నాయి.

Bihar latest news : మొత్తం మీద బీహార్​ సీఎం నితీశ్​ కుమార్​ వద్ద రూ. 16.68లక్షలు విలువ చేసే మూవెబుల్​ అసెట్స్​, రూ. 58.85లక్షలు విలువ చేసే ఇమ్మూవెబుల్​ అసెట్స్​ ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఢిల్లీ ద్వారకలోని కోఆపరేటివ్​ హౌజింగ్​ సొసైటీలో ఒక ఫ్లాట్​ ఉంది.

సీఎంతో పాటు కేబినెట్​ మంత్రుల ఆస్తులు, అప్పుల వివరాలను.. ప్రతి యేటా చివరి రోజున ప్రకటించాల్సిందిగా నితీశ్​ కుమార్​ గతంలో ఓ రూల్​ తీసుకొచ్చారు. అందుకు కట్టుబడి.. ప్రతియేటా చివరి రోజున ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటిస్తూ వస్తున్నారు. సీఎం నితీశ్​ కుమార్​తో పాటు ఈసారి ఆర్​జేడీ చీఫ్​ లాలూ ప్రసాద్​ యాదవ్​ తనయులు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​- పర్యావరణశాఖ మంత్రి తేజ్​ ప్రతాప్​ యాదవ్​లు కూడా తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు.

Bihar cabinet ministers assets : అధికారిక డేటా ప్రకారం.. సీఎం నితీశ్​ కుమార్​ కన్నా కేబినెట్​ మంత్రులే ధనవంతులు! 2022 మార్చ్​ నాటికి.. తేజస్వి యాదవ్​ రూ. 75లక్షలు విలువ చేసే క్యాష్​ ఉంది. ఆయన భార్య రాజ్​శ్రీ వద్ద రూ. 1.25లక్షలు విలువ చేసే క్యాష్​ ఉంది. ఇక తేజ్​ ప్రతాప్​ వద్ద రూ. 1.7లక్షల క్యాష్​, రూ. 3.2కోట్లు విలువ చేసే ఆస్తులు, స్థిరాస్తులు ఉన్నాయి. తేజస్వీ యాదవ్​ ఆస్తుల వివరాలు తెలియలేదు.

Tejaswi Yadav assets : తేజస్వీ, తేజ్​ ప్రతాప్​లతో పాటు ఆర్థికశాఖ మంత్రి విజయ్​ కుమార్​ చౌదరి, విద్యుత్​శాఖ మంత్రి బిజేందర్​ ప్రసాద్​ యాదవ్​, రెవెన్యూశాఖ మంత్రి అలోక్​ కుమార్​ మెహ్తా. పట్టణాభివృద్ధిశాఖ మంత్రి శ్రవణ్​ కుమార్​, భవన నిర్మాణాలశాఖ మంత్రి అశోక్​ చౌదరి, గనులశాఖ మంత్రి సురేంద్ర ప్రసాద్​ యాదవ్​, సమాచారశాఖ మంత్రి సంజయ్​ కుమార్​ ఝా, రవాణాశాఖమంత్రి శీలా కుమార్​లు తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం